Friday, December 17, 2010

జగన్‌ చుట్టూ ఐటి ఉచ్చు సో'నయా' అస్త్రం

 ప్రఅకస్మాత్తుగా రంగంలోకి దిగిన ఆదాయపు పన్ను శాఖ జగన్‌కు చెందిన 15 కంపెనీలపై దృష్టిరాజకీయంగా చెక్ పెట్టేందుకే సోనియా నిర్ణయం జగన్‌ విశ్వసనీయతనుశ్నార్ధకం చేయడమే లక్ష్యం...?
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు, ఎంపి పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేసి 2జి స్కామ్‌ పాత్రధారిగా అపవాదు మూటగట్టుకున్న ఎ.రాజా, ఆయన సన్నిహితుల ఇళ్లపై సిబిఐ వరుస దాడులు నిర్వహించిన నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న యువనేత జగన్మోహన్‌ రెడ్డి వ్యవహారానికి కూడా చెక్‌ పెట్టేయాలని, తద్వారా రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ ద్వారా ఇమేజ్‌ను దెబ్బతీసి జనంలో ఆయనకున్న విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేయాలన్నదే కాంగ్రెస్‌ అధిష్టానం ఎత్తుగడగా చెబుతున్నారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ మీడియాలో గురువారం విస్త్రతంగా ప్రసారాలు సాగాయి.డిఎంకె మిత్రపక్షమైనప్పటికీ, తలనొప్పిగా మారిన ఆ పార్టీకి చెందిన రాజాను ఇంటికి సాగనంపడంలో కాంగ్రెస్‌ చొరవ తీసుకుంది. అంతేకాకుండా, సిబిఐ దాడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి అవినీతిని సహించేది లేదని, అవినీతికి ఎవరు పాల్పడినా రాజా గతే పడుతుందని స్పష్టమైన సంకేతాలను ఇవ్వడంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, యుపిఎ చైర్‌పర్సన్‌సోనియాగాంధీకృతకృత్యులయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా పరిణమించారు. తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే, కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగలేదు. రాజశేఖర రెడ్డి మరణానంతరం సీనియర్‌ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేశారు. అయితే, వివిధ కారణాల వల్ల ఆయన్ని తప్పించి స్పీకర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డిని సిఎం పీఠంపై అధిష్టానం కూర్చొబెట్టింది. అప్పటివరకు మౌనంగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి, తన మీడియా ద్వారా కాంగ్రెస్‌ అధినేత్రి పైనే ఎదురుదాడికి దిగారు. దీంతో కాంగ్రెస్‌ అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించింది. జగన్మోహన్‌ రెడ్డి పినతండ్రి వివేకానందరెడ్డికి రాష్ట్ర కేబినెట్‌లో స్థానం కల్పించి సమరానికి సిద్ధపడింది. అప్పటివరకు చేస్తున్న ఓదార్పు యాత్రలను కొనసాగించేందుకే జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు సంభవించే ముప్పేమీ లేదని గ్రహించిన ఆయన అనుచరవర్గం పార్టీలో ఉంటూనే, జగన్‌తో ఓదార్పు యాత్రల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే, జగన్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడం ద్వారా ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేసేందుకే కాంగ్రెస్‌ అధిష్టానం ఆదాయపు పన్ను అస్త్రాన్ని ఎంచుకుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒక్కసారిగా ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగడం రాజకీయవర్గాల్లో సంచలనం కలిగించింది. జగన్మోహన్‌ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకుని వివిధ మార్గాల్లో అక్రమంగా కోట్లాది రూపాయిలను ఆర్జించారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌లోని సీనియర్‌ నేతలు ఎప్పటినుంచో అధిష్టానానికి మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయితే, యువనేతను కట్టడి చేసి పార్టీ పటిష్టతకు ఉపయోగించుకోవాలని రాజశేఖరరెడ్డి అభిమానులు మరోవైపు కోరుతుండడంతో అధిష్టానం వేచి చూసే ధోరణిని అవలంభించింది. చివరకు జగన్‌ తనదారి తాను చూసుకోవడంతో ఇక రాజకీయంగా కూడా ఢిల్లిd నేతలు ఎదురుదాడి చేయాలని, రాష్ట్రంలో కిరణ్‌ ప్రభుత్వానికి ఎటువంటి తలనొప్పులు లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం.ఇందులో భాగంగానే ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగినట్టు భావిస్తున్నారు. జగన్‌కు చెందిన 'సాక్షి' మీడియా సంస్థలతో పాటు, భారతి సిమెంట్‌, తదితర 16 కంపెనీల లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ పట్టిపట్టి చూస్తోంది. ఆయా కంపెనీలకు పెట్టుబడులన్నీ ఒకే దారిలో అంటే షేర్ల రూపంలో వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఆయన కంపెనీలన్నింటిపైనా గత ఏడాదిగా నిఘా ఉంచినట్టు సమాచారం. అంతేకాకుండా, జగన్‌ గత ఏడేళ్లుగా కడుతున్న పన్నుల మొత్తం ఏవిధంగా ప్రతిఏటా విపరీతంగా పెరిగిందీ కూడా ఆదాయపను పన్ను శాఖ నిపుణులు పరిశీలిస్తున్నారు. షేర్ల రూపంలో జగన్‌ కంపెనీల్లోకి వచ్చిపడిన భారీ మొత్తాలను చూసి అధికా రులు అవాక్కైనట్టు సమాచారం. సాంకేతికంగా అది ఎలా సాధ్యపడినప్పటికీ, అంత పెద్ద మొత్తాలను ఆయా కంపెనీలు జగన్‌ కంపెనీల షేర్లు కొనాల్సిన అగత్యంపై కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. రాంకీ, మ్యాట్రిక్స్‌, సరస్వతి పవర్‌, పివిపి, హెటిరో హెల్త్‌ కేర్‌, జగతి పబ్లికేషన్స్‌, క్లాసిక్‌ రియాల్టిd, తదితర కంపెనీల్లో పెట్టుబడులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. 2010 ఏడాదికి సంబంధించి 81 కోట్ల ముందస్తు పన్ను చెల్లింపు పైనా దృష్టి పెట్టారు. 2003-2004లో కేవలం తొమ్మిది లక్షల 91 వేల 951 రూపాయిలను తన ఆస్తిగా చూపిన జగన్‌, భారతి సిమెంట్స్‌ కంపెనీ నుంచి 50 శాతం షేర్లను పార్ఫిసిమ్‌ అనే ఫ్రెంచ్‌ కంపెనీకి రూ.3053 కోట్లకు అమ్మి రూ.416 కోట్ల లాభాన్ని ఆర్జించడంపై వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనే జగన్‌ కంపెనీల్లో పెద్ద మొత్తాలను వెచ్చించి షేర్లు కొన్న కంపెనీలకు నోటీసులను జారీ చేయడం తెలిసిందే.కాగా, ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన సమర్పించిన ఆదాయపు పన్ను డిక్లరేషన్లను ఆ శాఖ అధికారులు పరిశీలిస్తే అందుకు కాంగ్రెస్‌ ఎలా బాధ్యత వహిస్తుందని అంటున్నాయి. ఆయనపై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నమాట నిజమే అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాయి. అయితే, తమ నేత ఆదాయపు ప న్ను శాఖ నుంచి దాచిందేమీ లేదని, ఎప్పటికప్పుడు ముందస్తు పన్నుతో సహా చెల్లిస్తున్నారని జగన్‌ వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు ధోరణితో కూడుకున్నదేనని, అయినప్పటికీ జగన్‌ ఇమేజ్‌ను ఏవిధం గానూ దెబ్బతీయలేరని వారు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని విమర్శిస్తున్నారు.

No comments:

Post a Comment