Saturday, December 11, 2010

యువసైన్యమంతా జగన్ వెంటే నడుస్తుంది;రేణుకా చౌదరి

           కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి నెలకొల్పనున్న కొత్త రాజకీయ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామాలే ఎదురవుతాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా ఖచ్చితంగా జగన్ వెంటే నడుస్తుందని ఆమో జోస్యం చెప్పారు. జగన్ కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీని వీడటంపై ఆమె స్పందిస్తూ.. తామంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉన్నామన్నారు. అయితే, ఈ కుటుంబం నుంచి వేరుపడిన తర్వాత ఖచ్చితంగా కొంత కొత్తదనంతో కూడిన ఏదో ఒక పని చేయాలని కోరుకుంటారన్నారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎదురైన అవమానాలు, కష్టాలను తట్టుకుని జగన్ నిలబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయనకు మంచి భవిష్యత్ ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. మన ప్రజాస్వామ్య దేశంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. అదేసమయంలో పార్టీకి చెందిన నేతలను పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీ బయటకు పంపే ప్రయత్నమేదీ చేయలేదన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి ఆమె ప్రత్యేక స్థానం, మర్యాద ఇచ్చారన్నారు.

No comments:

Post a Comment