Tuesday, December 28, 2010

దీక్ష విరమించండి... సబిత: వల్లంటే వల్లకాదు: ఎంపీలు

విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ దీక్ష బూనిన తెలంగాణా ఎంపీలను రాష్ట్ర మంత్రులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. స్వయంగా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి దీక్షా శిబిరానికి తరలి వచ్చి, ప్రభుత్వం ఆ కేసులపై ఆలోచన చేస్తుందోననీ, దీక్ష విరమించాలని అభ్యర్థించినప్పటికీ ఎంపీలు ససేసిమిరా అన్నారు. 
విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తేనే తాము దీక్షను విరమిస్తామని ప్రకటించారు. దీంతో చేసేది లేక మంత్రులు వెనుదిరిగి వెళ్లారు. రేపు ఉదయం ఎంపీల డిమాండ్లకు అనుగుణంగా ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. 
ఇదిలావుంటే కాంగ్రెస్ ఎంపీల దీక్షను తెరాస కొట్టిపారేసింది. తెలంగాణా ఉద్యమానికి సంబంధించి క్రెడిట్ ను తాము కొట్టేయాలన్న తపనలో కాంగ్రెస్ పార్టీ ఉందనీ, అందులో భాగంగానే ఈ దీక్షా నాటకాలని విమర్శించింది. 
కాంగ్రెస్, తెదేపాలు ఎన్ని నాటకాలాడినా ప్రజలకు అసలు సంగతి తెలుసని తెరాస నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ చేసి ప్రజల అభిమానాన్ని పొందలేరన్నారు.

No comments:

Post a Comment