Sunday, December 12, 2010

తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండిపోతా...చిరంజీవి

తెలంగాణలో ఉన్న మా కార్యకర్తలు, అభిమానులకు నేనెప్పుడూ రుణపడి ఉంటానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరిన చిరంజీవి, తెలంగాణలోని కార్యకర్తలు, అభిమానులను ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు.ఏడాది తర్వాత తెలంగాణలో పర్యటన చేపట్టిన చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండిపోతానని, తాను అందరి వాడిననీ, కేవలం ఒక్క ప్రాంతానికి చెందిన వాడిని కాదని చిరంజీవి అన్నారు. హెలికాప్టర్‌లో ఆదివారం ఆదిలాబాద్ బయలు దేరిన చిరంజీవి, ప్రాణిహిత పుష్కర స్నానం చేసి తండ్రి పిండప్రదానం చేయనున్నట్లు తెలిపారు.మొదట ఆదిలాబాద్ జిల్లా అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరాలకు హాజరై పుణ్యస్నానం చేసి ఆచరించి పూజాధికాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోని కూసుమంచి చేరుకుని తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులను చిరంజీవి పరామర్శిస్తారని ప్రజారాజ్యం పార్టీ శ్రేణులు తెలిపాయి. 

No comments:

Post a Comment