Wednesday, July 20, 2011
Tuesday, July 19, 2011
తెలంగాణపై మూడు టీమ్లు, ఆజాద్తో సీమాంధ్ర భేటీ
హైదరాబాద్: తెలంగాణపై పార్టీలో ఏకాభిప్రాయ సాధన కోసం మూడు ప్రాంతాల నుంచి మూడు టీమ్లను ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్తో తనను కలిసి సీమాంధ్ర నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణలకు చెందిన టీమ్ల్లో ఐదు నుంచి పది సభ్యులేసి, రాయలసీమ టీమ్లో ఐదుగురు సభ్యులుంటారు. తమ టీమ్లకు సంబంధించిన సభ్యులను ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులే ఖరారు చేసుకుంటారు. ఈ టీమ్లతో పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తుంది. సీమాంధ్రకు చెందిన 15 మంది మంత్రులు, 31 మంది శాసనసభ్యులు, 12 మంది ఎమ్మెల్సీలు సోమవారం సాయంత్రం ఆజాద్ను కలిసినవారిలో ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు నేతృత్వంలో ఈ బృందం ఆజాద్తో భేటీ అయ్యారు.
తెలంగాణకు చెందిన ప్రతినిధులను 5 నుంచి 10 మందిని ఆహ్వానించామని, వారితో సమావేశమైన తర్వాత రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నాయకులను ఆహ్వానిస్తామని, తద్వారా సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తామని ఆజాద్ భేటీ అనంతరం చెప్పారు. ఇరు ప్రాంతాల నాయకులు సంయమనం పాటించాలని ఆజాద్ సూచించినట్లు మంత్రి శైలజానాథ్ భేటీ అనంతరం చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రతిపాదనను అమలు చేయాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు. ఆజాద్తో చర్చలు సంతృప్తికరంగా సాగాయని కావూరి సాంబశివరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పనికిరాదని ఆజాద్ తమతో చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణపై తన అభిప్రాయాన్ని కూడా ఆజాద్ తమతో చెప్పలేదని ఆయన అన్నారు.
ఆజాద్పై తమకు నమ్మకం ఉందని, అందరితో చర్చించి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరామని ఆయన అన్నారు. ఆజాద్కు తమ అభిప్రాయాన్ని తెలిపామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలిపామని ఆయన చెప్పారు. సమస్యకు పరిష్కారం లభించే వరకు ఆజాద్ను కలుస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారుతోందని, పార్టీ ప్రతిష్టను కాపాడడానికి సహకరించాలని ఆజాద్ సీమాంధ్ర నాయకులకు సూచించినట్లు సమాచారం. ఆజాద్తో సమావేశం ముగిసిన తర్వాత సీమాంధ్ర నాయకులు తిరిగి కావూరి నివాసంలో సమావేశమయ్యారు. రేపు మంగళవారం వారు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను, కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రణబ్ మఖర్జీలను కలుస్తారు.
Sunday, July 17, 2011
అవసరమైతే అపరిచితుడ్ని అవుతా..
ఈ మాట అన్నది ఏ సినిమా స్టారో.. అవినీతిని అంతం చేయాలనుకుంటున్న రాందేవ్ బాబానో, అన్నా హజారేనో కాదు. రాష్ట్ర రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో వివాదాల్ని ఇంటిపేరుగా మార్చుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. రాముడి లాంటి వాడినని తనకు తానే కితాబిచ్చుకున్న లగడపాటి అవసరమైతే మాత్రం అపరిచితుడిలా మారిపోతానన్నారు. జగన్ పార్టీ నేతల విమర్శలకు, సాక్షి కథనాలకు ప్రతిస్పందనగా ఈ మాటలను అన్నారు. కేవలం పత్రిక, ఛానల్ ఉన్నాయని జగన్ మిడిసిపడుతున్నాడని, తలచుకుంటే తాను వంద ఛానళ్లు పెట్టగలనంటూ రాజగోపాల్ ప్రకటించారు. వైఎస్ పెట్టేవాడైతే, జగన్ కొట్టేసే వాడంటూ విమర్శించారు. మడమతిప్పనని జగన్ తరచూ చెప్పే మాటలు నిజమైతే, సీబీఐ విచారణ వద్దంటూ సుప్రీంకు వెళ్లకూడదని సవాల్ విసిరారు. ఉపేంద్ర వారసుడిగా తాను రాజకీయాల్లోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే చేరానని, వైఎస్ వెంట రాష్ట్రమంతా కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగానని వివరణ ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లే తనకు స్పూర్తనీ చెప్పారు లగడపాటి. సాక్షి కథనాలకు లీగల్ నోటీసులూ అందిస్తానన్నారు.
ఆర్.ఇ.సి.ఎస్ ద్వారా వినియోగదారుల పిల్లలకు స్కాలర్షిప్లు
విశాఖపట్నం:ఆర్.ఇ.సి.ఎస్ సంస్థ ద్వారా ఐదు మండలాల్లో ఉన్న వినియోగదారుల పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ చేసేందుకు తమ పాలకవర్గం నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, కశింకోట, తాళ్లపాలెం డైరక్టర్లు పెంటకోట శ్రీనివాసరావు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, సంస్థ ఎం.డి ఎన్.ఎన్ అప్పారావులు స్పష్టం చేసారు. స్థానిక సంస్థ ప్రధాన కార్యాలయంలోజూలై 16 శనివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 2010-11 సంవత్సరం నుండి 10వ తరగతిలో 500 మార్కులు పైబడిన వినియోగదారుల పిల్లలకు 2000 రూపాయలు స్కాలర్ అందజేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఈ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థినివిద్యార్థులకు తమ బోర్డు ఉన్నంతకాలం రెండువేల రూపాయలను అందజేస్తామని తెలిపారు. అలాగే ఐదు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థివిద్యార్థులకు బెంచ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముగ్గురు విద్యార్థులకు ఒక బెంచ్ వంతున ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇందిరకరుణ తరంగణి చెక్కు లు 453 ఉన్నాయని వాటిని ఈనెల 20 నుండి అందజేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రతిపాదించిన పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఏడాది రాష్ట్రంలో ఫస్ట్మార్కులు సాధించగా ర్యాంక్లో 13 వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్.ఇ.సి.ఎస్లలో మాత్రమే పాలిటెక్నికల్ కళాశాలలను ఏర్పాటు దివంగత ముఖ్యమంత్రి వైయస్ ఏర్పాటు చేసారన్నారు. ఈ ఏడాది పాలిటెక్నికల్లో ఇ.సి.ఇ కోర్సుకు కూడా అనుమతి పొందామన్నారు. విద్యార్థివిద్యార్థుల నుండి ఈ ఏడాది పాలిటెక్నికల్కు 213 దరఖాస్తులు అందాయని వాటిలో 23 దరఖాస్తులు తొలగించామని, మిగిలిన 190 దరఖాస్తులకు కౌన్సిలింగ్ ఎప్పుడు అనే విషయమై పత్రికలద్వారా,్ఫన్ద్వారా, పోష్టుకార్డులద్వారా సమాచారాన్ని అందజేస్తామని చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ పేర్కొన్నారు.
Saturday, July 16, 2011
దేశ ఆర్థిక రాజధానిపై ముష్కర పంజా
దేశ ఆర్థిక రాజధాని13-07=2011 బుధవారం మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. 2008 నవంబర్ 26 నాటి పేలుళ్ల దుర్ఘటన ఇంకా స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే, నిందితులకు శిక్ష పడకముందే… బుధవారం సాయంకాలం ముంబయిలో వరసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించా యి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంభవించిన ఈ పేలుళ్లలో 21 మంది మర ణించారు. వందమంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లో ఇండియన్ ముజా హిదిన్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం వున్నట్లుగా అనుమానిస్తున్నారు. రాష్టప్రతి ప్రతిభాపాటిల్ పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్సింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ను సంప్రదించి పేలుళ్ల గు రించి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేలుళ ్లపట్ల విచారం వ్యక్తం చేశారు.‘సాయంకాలం ఆరు గంటల 45 నిముషాల తర్వాత… కొద్ది నిముషాల వ్యవధిలో జవేరీ బజార్, ఒపేరా హౌస్, దాదర్ లలో వరసగా ఈ పేలుళ్లు సంభవించాయి. కనీసం 21 మంది మరణించారు. 141 మంది గాయపడ్డారు. మూడు పేలుళ్లనూ పోలిస్తే, ఒపేరా హౌస్ వద్ద జరిగిన పేలుడు చాలా శక్తివంతమైంది’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు.
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి పి చిదంబరం మాట్లాడుతూ – ముంబయి పేలుళ్లలో పదిమంది మరణించారని, గాయపడిన 54 మందిని ఆస్పత్రుల్లో చేర్చారని ధ్రువప డిందని చెప్పారు. మృతుల సంఖ్య పెరగవచ్చని ఆయన తెలిపారు. మరే పేలుడు గురించి కానీ, బెదిరింపు గురించి కానీ సమాచారం లేదని చిదంబరం అన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కె సింగ్ మాట్లాడుతూ – వంద మంది గాయపడ్డారని, వారిని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారని తెలిపారు. మూడు పేలుళ్లకు మధ్య ఎక్కువ వ్యవధి లేదని, కొన్ని నిముషాలలోనే సంభవించాయని చిదం బరం అన్నారు. వరసగా పేలుళ్లు జరగడం చూస్తే ఇది ఉగ్రవా దులు పథకం ప్రకారం చేసిన దాడి అని అర్థమవుతోందని హోంమంత్రి చె ప్పారు. ముంబయి పేలుళ్ల సమాచారంతో వివిధ రాష్ట్రాలు అప్రమత్త మయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి.అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ముంబాయి పేలుళ్ళను ఖండించాయి.
అత్యాధునిక పేలుడు సామగ్రితో…
ఈ పేలుళ్లకు అత్యాధునిక పేలుడు పరికరాలను (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్- ఐఇడి) లను వినియోగించారు. 2008 ముంబయి పేలుళ్ల నింది తుడు అజ్మల్ కసబ్ పుట్టినరోజు నాడే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. జవేరీ బజార్ ప్రాంతం నుంచి ఒక ఐఇడిని కనుగొన్నట్టు ముంబయి పోలీసులు తెలిపారు.
పేలుళ్లు ఎలా జరిపారు?
మూడింటిలో ఒక పేలుడు మారుతీ ఎస్టీం కారులో సంభవించిందని, మరొకటి మోటార్ సైకిల్లో జరిగిందని హోంశాఖ కార్యాదర్శి సింగ్ తెలి పారు. జవేరీ బజార్ పేలుడు బెస్ట్ బస్టాప్లో ఒక మీటర్ బాక్స్లోని ఎలక్ట్రిక్ కేబినెట్లో సంభవించిందని పోలీసులు అన్నారు. మొదటి పేలుడు దక్షిణ ముంబయిలోని జవేరీ బజార్ షకీల్ మెమోన్ వీధిలోని ముంబాదేవి ఆలయం సమీపంలో జరిగింది. ఆ పేలుడులో 25 మంది గాయపడ్డారని ముంబయి పోలీసు ప్రతినిధి నిసార్ తంబోలీ తెలిపారు. ఈ బజార్లో చాలా నగల దుకాణాలు ఉన్నాయి. ఒపేరా హౌస్ దగ్గర్లో ఉన్న డైమండ్ మార్కెట్ వద్ద జరిగిన బాంబు పేలుడులో దాదాపు 25 మంది గాయపడ్డారు. ఇది కూడా దక్షిణ ముంబాయిలోనే ఉంది.సెంట్రల్ ముం బయిలోని దాదార్ వెస్ట్లో కబూతర్ఖానా వద్ద జరిగిన మూడో పేలుడులో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని సెయింట్ జార్జి, నాయర్, కెఈఎం ఆస్పత్రుల్లో చేర్పించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. వరసగా జరిగిన మూడు పేలుళ్లతో నగరంలో హై ఎలర్ట్ ప్రకటించారు.
గతంలోనూ జవేరీ బజార్పై గురి
2003 నాటి పేలుడులో 54 మంది మరణించిన తర్వాత చాలాసార్లు ఉగ్రవాదులు జవేరీ బజార్పై గురిపెట్టారని చవాన్ చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రాలయ కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక బృందం సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు.
చవాన్తో ప్రధాని సంప్రదింపులు
పుకార్లను నమ్మవద్దని, సంయమనంతో వ్యవహరించాలని పృథ్వీరాజ్ చవాన్ ముంబయి ప్రజల్ని కోరారు.ఇలా ఉండగా, పేలుళ్లు జరిగిన కొద్దిసేపటికే ప్రధాని మన్మోహన్సింగ్ ముఖ్యమంత్రి చవాన్తో మాట్లాడారు. జాతీయ భద్రతా దళాల్ని, ఫోరెన్సెక్ నిపుణుల్ని హుటాహుటిన బిఎస్ఎఫ్ విమానంలో ముంబయి పంపించారు. ముంబయి రైలు పేలుళ్లు జరిగి అయిదేళ్లు పూర్తయిన రెండు రోజులకే ఈ పేలుళ్లు జరిగాయి.
Wednesday, July 13, 2011
Saturday, July 9, 2011
ఆరో చాంబర్ తెరవొద్దు – సుప్రీం కమిటీకి పద్మనాభుడి సిరికి రక్షణ ఎలా?
ఆరో చాంబర్ తెరవొద్దు – సుప్రీం కమిటీకి పద్మనాభుడి సిరికి రక్షణ ఎలా?
తిరువనంతపురంలోని సుప్రసిద్ద పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగలో చివరి చాంబర్ను తెరవొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. సంపద లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నిపుణుల కమిటీకి న్యాయమూర్తులు విఆర్ రవీంద్రన్, ఎకె పట్నాయక్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశించింది. వచ్చే గురువారం జరిగే తదుపరి విచారణ దాకా వాయిదా వేస్తూ, అపార సంపదతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆలయ పవిత్రత, సంపద భద్రతకు సంబంధించి తగిన సూచనలు చేయాల్సిందిగా పిటిషనర్, తిరువాన్కూర్ రాజవంశీయుడైన రాజా మార్తాండ వర్మ, కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగలోని ఆరు రహస్య గదుల్లో ఐదింటిని ఇప్పటికే తెరిచిన విషయం తెలిసిందే. అయితే ఆరో గదిని (బి-చాంబర్) మాత్రం తెరవలేదు. ఈ అయిదు గదుల్లో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, పురాతన బంగారు, వెండి నాణేలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు తెలియజేసింది. చివరి గదిని తెరిస్తే పాలకులకేకాక, గదిని తెరిచిన వారికీ కీడు కలుగుతుందని భక్తుల విశ్వాసం.
కాగా, ఈ ఆలయం ప్రజల ఆస్తి అని రాజవంశీకుల తరఫున వాదించిన న్యాయవాది కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి స్పష్టం చేశారు. ఇప్పుడు బైటపడిన ఆస్తిలో రాజ కుటుంబీకులు ఎవ్వరూ వాటా కోరడం లేదని కోర్టుకు విన్నవించారు. బయటపడిన సొమ్ము ఆలయానికే చెందుతుందని రాజకుటుంబీకులు చెప్తున్నట్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు.
అంతేకాక వెలుగు చూసిన సంపద విలవ లక్ష కోట్ల రూపాయలుగా చెప్పడం సరికాదని, అదంతా మీడియా వేస్తున్న అంచనా మాత్రమేనని ఆయన అన్నారు. కాగా, ఆలయ భద్రత పట్ల న్యాయమూర్తులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ‘గర్భగుడిలోని విగ్రహంపై ఉండటానికి బదులు చాలామంది చూపుఈ రహస్య గదులపై ఉంటోంది’ అని వారు వ్యాఖ్యానించారు.
Thursday, July 7, 2011
తెలంగాణాపై నాన్చొద్దని హైకమాండ్ నిర్ణయం ? ఇక తేల్చుడే !
తెలంగాణాపై నాన్చొద్దని హైకమాండ్ నిర్ణయం ? ఇక తేల్చుడే !
తెలంగాణాపై ఇక తేల్చేందుకే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో భేటీ జరిగింది. ఈ అంశంపై గంటన్నరపాటు చర్చ జరిగింది. T - కాంగ్రెస్ నేతల రాజీనామాల సెగను ఫ్యూచర్లో ఎదుర్కొకోకుండా ఉండేందుకే నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై అధినేత సోనియా గాంధే స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.
అందుకే మన్మోహన్, అహ్మద్పటేల్తో గంటపాటు తెలంగాణ, దాని ప్రత్యామ్నాయాలపై చర్చించారు. ఆ తర్వాత అరగంటపాటు జరిగిన కోర్ కమిటీలో ఏం చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించారు.
Wednesday, July 6, 2011
హస్తినలో తెరపడని హైడ్రామా
హస్తినలో తెరపడని హైడ్రామా
తెలంగాణ అంశంపై 06-07-2011మంగళవారం కూడా హస్తినలో హైడ్రామా కొనసాగింది. అయితే, ఇంకా తెరపడలేదు. దాదాపు వందమంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పించడంతో ఆ వేడి అధిష్టానాన్ని గట్టిగానే తాకింది. అయితే, ఇప్పటికిప్పుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోయినా, అతి త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా నిర్ణయాన్ని వెలువరించాలన్న దృక్పథంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తోంది. అలాగే, విభజనవాదంపై ఇక సాగతీత సరికాదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ సారి తొందరపాటుతో కాకుండా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నేతలు, ప్రజలను సంతృప్తి పరిచేవిధంగా నిర్ణయం తీసుకోవాలని సంకల్పించింది. వచ్చే రెండు మూడు రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారు. 06-07-11మంగళవారం రోజంతా టి.కాంగ్రెస్ ఎంపీలు, నేతలు అధినేత్రి రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ అజాద్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీలతో చర్చోపచర్చలు జరిపారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీతో టి.కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, మందా జగన్నాథం, మధుయాష్కీ, బలరామ్ నాయక్లతో పాటు జానారెడ్డి, సారయ్య, పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు. తెలంగాణలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రణబ్కు వివరించారు. తాము పార్టీకి వ్యతిరేకం కాదని, పార్టీ ప్రతిష్టను కాపాడుతూనే తమకు ఇబ్బంది లేకుండా ఏదో ఒక పరిష్కారాన్ని సూచించాలని టి.నేతలు ప్రణబ్ను కోరారు. దీనిపై చర్చలను కొనసాగిద్దామని ప్రణబ్ వారికి హామీ ఇచ్చారు. చర్చలు సంతృప్తికరంగా సాగడం పట్ల టి.నేతలు కూడా సంతోషం వెలిబుచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని ప్రణబ్ను కోరినట్టు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ జానారెడ్డి చెప్పారు. ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనే వరకూ ఓర్పు వహించాలని తమను ప్రణబ్ కోరారని, తక్షణం తెలంగాణను ప్రకటించాలని, అంతవరకు మాత్రమే తాము ఓర్పు వహించగలమని జానారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, జానా బృందం భేటీ ముగిసిన అనంతరం ప్రణబ్తో విజయవాడ ఎంపీ లగడపాటి సమావేశం కావడం విశేషం.
తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాల పట్ల తొలుత నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన కాంగ్రెస్ అధిష్టానంలో మంగళవారంనాడు కొంత కదలిక వచ్చింది. సున్నితమైన, సంక్లిష్టమైన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను ఇప్పటికిప్పుడు పరిష్కరించే అవకాశాలు లేకపోయినా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల రాజీనామాలను ఉపసంహరింపజేసేందుకున్న మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది.
మూకుమ్మడి రాజీనామాల రూపంలో తెలంగాణ ప్రజల మనోభావాలను విస్పష్టంగా వ్యక్తీకరించిన ప్రజాప్రతినిధుల ప్రతిష్టను కాపాడుతూనే వారికి రాజీనామాలను ఉపసంహరించుకొనే అవకాశాన్ని కల్పించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించిన అధిష్టానం మంగళవారంనాడంతా గత రాత్రి ఇక్కడకు చేరుకొన్న ముగ్గురు రాష్ట్ర మంత్రులు, మరికొద్ది మంది పార్లమెంట్ సభ్యులతో విస్తృతంగా చర్చలు జరిపింది. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలోపేతం కావడానికి ముఖ్యమైన ప్రేరణగా భావిస్తున్న రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14-ఎఫ్ క్లాజును తొలగించడంతో పాటు తెలంగాణ డిమాండ్పై కేంద్రం తప్పనిసరని భావిస్తున్న సంప్రదింపుల ప్రక్రియను తక్షణమే పున:ప్రారంభించి వేగవంతం చేస్తామనే ప్రకటనతో రాజీనామాల పర్వానికి తెరదించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనే విస్పష్టమైన ప్రకటన మినహా మరే ప్రత్యామ్నాయంతోనూ తాము సంతృప్తిపడే సమస్యే లేదని ఇప్పటి వరకూ కొంత మొండిగా వ్యవహరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నాయకులు కూడా మంగళవారంనాడు గులాంనబీ ఆజాద్తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్తో తొలిదఫా చర్చల సందర్భంగానే కొంత మెత్తబడినట్లు సమాచారం. సంప్రదింపుల ప్రక్రియ పూర్తికాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల, పార్టీల అభిప్రాయాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఏకాభిప్రాయం సాధించకుండా తెలంగాణపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవడం సాధ్యపడదని కేంద్ర నాయకులు తేల్చిచెప్పిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఎలాంటి చలనం లేకుండా పడివున్న సంప్రదింపుల ప్రక్రియనైనా వెంటనే ప్రారంభించాలని వీరు అధిష్టానం ప్రతినిధులను కోరారు.
ఉదయం గులాంనబీ ఆజాద్తో తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం చర్చల తర్వాత అహ్మద్ పటేల్తో కలిసి ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీని కలుసుకొని తెలంగాణ ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాలతో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితులను, రాజీనామాలకు పరిష్కారం కనుగొనే విషయంలో తెలంగాణ నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆమెకు వివరించారు. పార్టీ అధ్యక్షురాలి స్థాయిలో జరిగిన ఈ చర్చల అనంతరం అహ్మద్ పటేల్ తెలంగాణకే చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. తెలంగాణ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్యలతో పాటు పార్లమెంట్ సభ్యులు వివేక్, గుత్తా సుఖేందర్రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు కూడా ఈ చర్చలలో పాలుపంచుకొన్నారు.
ఉదయం, సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జితో, అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శితో జరిపిన చర్చలలో తెలంగాణ ప్రజల మనోభావాల తీవ్రతను, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, సంక్లిష్టమైన ఈ వివాద పరిష్కారానికున్న మార్గాలను ఎంతో విపులంగా చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల పరిరక్షణను కూడా దృష్టిలో ఉంచుకొని సాగిన ఈ చర్చలలో వివిధ పరిష్కారమార్గాలను పరిశీలించినట్లు సమాచారం. తెలంగాణ ప్రజలు కోరుకొంటున్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకుండా వారిని సంతృప్తిపరచడం అసాధ్యమని కొందరు నాయకులు వాదించగా కనీసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలమేనంటూ వర్కింగ్ కమిటీలో ఒక తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వ పరిశీలనకు పంపించే విషయాన్ని పరిశీలించాలని మరొకరు సూచించినట్లు సమాచారం.
అధిష్టానం నేతలు స్పష్టీకరిస్తున్న విధంగా తెలంగాణ అంశంపై కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలతో, రాజకీయ పార్టీలతో చర్చలు జరపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని వెల్లడించిన తెలంగాణ నేతలు ఒక దశలో రాష్ట్రాన్ని రెండుగా విభజించే విషయంలో ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమయ్యే రాజధాని నగరం విషయంలో కూడా కొంతమేరకు రాజీపడేందుకు సిద్ధపడినట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం. తెలంగాణ ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తే హైద్రాబాద్ నగరాన్ని కొన్నేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా అంగీకరించేందుకు తమకు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చునని కూడా చర్చల సందర్భంగా తెలంగాణ నేతలు పేర్కొన్నట్లు ధ్రువీకరించబడని వార్తలు వెల్లడిస్తున్నాయి. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం తెలంగాణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్రం సూచిస్తున్న సంప్రదింపుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలనే అంశంపై దాదాపుగా అంగీకారం కుదిరినట్లు అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి.
ప్రజాభీష్టం మేరకే తప్పనిసరైన పరిస్థితులలో చట్టసభల సభ్యత్వాలకు రాజీనామాలు చేయాల్సి వచ్చినప్పటికీ తాము కాంగ్రెస్ అధిష్టానానికి విధేయులమేనని, కొన్ని ప్రతిపక్షాలు కోరుకొంటున్న విధంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని భావించడం లేదని ఈ సందర్భంగా అధిష్టానం ప్రతినిధులకు మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, రాజీనామా చేసిన లోక్సభ సభ్యులు గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలియవచ్చింది. అయితే, అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అయిన కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఇటీవలి హైద్రాబాద్ పర్యటనలో తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యల పట్ల వారు తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితుల్లో హైద్రాబాద్ వచ్చిన ఆయన కనీసం తమతో మాట్లాడకుండా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నివాసానికి వెళ్లడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారు మండిపడ్డారు. అయితే, సమయాభావం వల్లనే తాను అందరినీ కలుసుకోలేకపోయానని, తనకు దురుద్దేశాలు ఆపాదించవద్దని ఆయన ఇచ్చిన వివరణతో తెలంగాణ నేతలు సంతృప్తిపడ్డారు.
ఉదయం గులాం నబీ ఆజాద్తో చర్చల అనంతరం విలేఖరులతో మాట్లాడిన మంత్రి జానారెడ్డి అధిష్టానం ఆహ్వానంపైనే తాము ఎఐసిసి ఇన్చార్జితో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రజల మనోగతాన్ని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు విపులంగా తెలియజేశామని, అధిష్టానం కూడా సమస్య పరిష్కారానికే ప్రయత్నిస్తున్నదని ఆయన తెలియజేశారు. తెలంగాణ సమస్య ఒక్కరోజులో పరిష్కారమయ్యేది కాదన్న ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రభుత్వం, పార్టీ ప్రయత్నిస్తున్నాయని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలనే తాము కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరేలా చూసేందుకే తాము ప్రయత్నిస్తున్నామన్న ఆయన తమ పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్లతో జరిపిన చర్చలు ఎంతో సుహృద్భావ వాతావరణంలో, సదావగాహనతో, సీరియస్గా జరిగాయని మరో ఎంపీ మధుయాష్కీ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకొనేందుకు విస్తృత స్థాయి సంప్రదింపుల ప్రక్రియ పూర్తికావడం తప్పనిసరని కేంద్ర హో మంత్రి తేల్చిచెప్పినందున దానిని సత్వరమే ప్రారంభించి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని తాము కోరుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ ప్రాంతం వారితో, ఏ పార్టీతో చర్చించదలిచినా తమకెలాంటి అభ్యంతరం ఉండదన్నారు. తొలి విడత చర్చలు తమకు సంతృప్తినిచ్చాయని, మంగళవారం రాత్రి లేదా బుధవారం జరుగనున్న మలివిడత చర్చల్లో సమస్యకు ఒక పరిష్కారం లభించగలదన్న విశ్వాసం తమకుందని కూడా ఆయన చెప్పారు.
కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి నివాసంలో తెలంగాణ నేతలతో సుమారు అరగంటసేపు చర్చలు జరిపిన అహ్మద్పటేల్ మరోదఫా మరింత విస్తృత సంప్రదిపుల కోసం రాత్రి పదకొండు గంటలకు తన నివాసానికి రావాలని ఆహ్వానించి వెళ్లడంతో రాత్రి పోద్దుపోయేంత వరకూ జైపాల్ నివాసంలోనే ఉన్న తెలంగాణ నేతలు పలువురు పరిస్థితిని సమీక్షించుకొని తమ వాదనలకు మరింత పదునుపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
Tuesday, July 5, 2011
Friday, July 1, 2011
V. Dinesh Reddy, Director General -IPS
Born/Entry into the Govt. Service/APPT.to
| |||
Source of Recruitment/Batch No. | 1977 (R.R), | ||
Education Qualifications | B.Sc., | ||
Languages Known | Telugu, English & Hindi | ||
Police Medals/Other Awards | IPM 95, PPM 07 | ||
Previous working places | ASP- Rajhamundri, Guntur SP – Kurnool, East Godawari, Khammam, Krishna, CID, East Zone DCP DIG – Warangal, Hyderabad, Commissioner Vijayawada, IG – Secunderabad Railway Range, Legal Metaralaji, Prohibition & Excise Taskforce, City Co-ordination, Police Administration, Printing & Stationary Addl. DG Law & Order, Hyd City Police CommissionerAPSRTC MDDG Vigilance & Enforcement | ||
Office No Phone Numbers | 23232831(O), 23235170(O), 23232311(R | ||
Father & Mother | Venambake Veera Raghava Reddy & Lakshmidevi | ||
Brothers | Suresh Reddy | ||
Sisters | Nirmala, Sunitha, Aruna, Usha | ||
Wife | Sireesha | ||
Children’s | Senayana, Deepthi |
Subscribe to:
Posts (Atom)