Saturday, December 6, 2014

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉంటేనే సాయం...!!


ఆంధ్ర ప్రదేశ్‌,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యంగా ఉంటేనే కేంద్రం మద్దతు ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు స్నేహపూరితంగా ఉండి చక్క టి పరిపాలన అందించాలని అప్పుడే తాము అన్నివిధాలా ఆదుకుంటామని మోడీ తెలంగాణ ఎంపీలకు చెప్పారు. న్యూ ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌ రెడ్డి, సీనియర్‌ నేత కే.కేశవరావు నేతృత్వంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, వి నోద్‌కుమార్‌, బాల్కాసుమన్‌, సీతారామ్‌ నా యక్‌, పాటిల్‌, కొండావిశ్వేశ్వర రెడ్డిలు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి తెలంగాణ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా విద్యుత్‌, నీరు, పెండింగ్‌ ప్రాజె క్టులు, ఉమ్మడిగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల విషయంలో ఏర్పడిన వివాదాలను ఎంపీలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో జరగనున్న సిఎంల సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రుల తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకం గా భేటీ కానున్నారు. ప్రధానమంత్రిని కలిసి న తర్వాత ఎంపీలు కే.కేశవరావు, జితేందర్‌ రెడ్డిలు ఎపి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించాలని ప్రధానమంత్రిని కోరినట్లు చెప్పారు. తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ది చెందటానికి రాయితీలు ప్రకటించాలని కోరగా ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రధానంగా 28 అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రాణహిత చెవెళ్ళకు జాతీయ హోదా, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులకు కేంద్రం సహాయం, ఐఏఎస్‌, ఐపిఎస్‌ల కేటాయింపుల ప్రక్రియ వేగంగా జరగాలి. హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం,అదనపు విద్యుత్‌ కేటాయింపు వంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. అయితే ఇరు రాష్ట్రాలు సంతోషంగా, సఖ్యంగా ఉండి ప్రజలకు మంచి పాలన అందించిన రోజు నుంచి కేంద్రం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని నరేంద్రం మోడీ తెలంగాణ ఎంపీలకు స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియకుండానే హైదరాబాద్‌లో ఉన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఎన్‌టిఆర్‌ నామకరణం చేశారని, ఇది చాలా అవమానకరంగా సిఎం భావిస్తున్నారని ఎంపీలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. అయితే ఈ విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రితో తాను మాట్లాడతానని పిఎం పేర్కొన్నారని ఎంపీలు మీడియాకు తెలిపారు. రైల్వేలోని పెండింగ్‌ అంశాలపై కూడా ఎంపీలంతా కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్‌ ప్రభును కలిసి చర్చించారు. రైల్వే పరీక్షలో జరుగుతున్న పేపర్‌ లీకేజి, విద్యార్ధులకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

Monday, November 10, 2014

మంత్రివర్గ విస్తరణతో.. మోదీ మార్కు...!!!

ప్రధాని నరేంద్ర మోదీ మరో 21 మందిని కొత్తగా తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. పేరుకు ఎన్‌డీఏ మంత్రివర్గ విస్తరణ అయినా, వీరిలో 20 మంది బీజేపీ వారే కావడంతో మోదీ మార్కు స్పష్టంగా కనబడింది. తన డిమాండ్లతో మెట్టు దిగకుండా వ్యవహరిస్తున్న శివసేన నుంచి సరేశ్‌ ప్రభును రాజీనామా చేయించి, బీజేపీ తీర్థం ఇచ్చి మరీ మంత్రి పదవి ఇవ్వడంతో.. మంత్రివర్గంపై తన పట్టు కోసం మోదీ ఎంతగా పట్టుదలగా ఉన్నారో తెలిసిపోయింది. అలాగే మోదీతో వ్యవహారం ఎలా ఉంటుందో మిత్రపక్షాలకు తెలిసి వచ్చింది. తాజా విస్తరణతో మోదీ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 66కు పెరిగింది. 
గత శాఖలు మార్పు లేదు...
హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, పౌర విమాన యాన శాఖమంత్రి అశోక్‌ గజపతిరాజు, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌, మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ, జలవనరుల మంత్రి ఉమాభారతి, విద్యుత్‌, బొగ్గు, పునరుత్పాదక ఇంధన మంత్రి పీయూష్‌ గోయల్‌, పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, తదితరుల శాఖల్లో మార్పులేదు. అదేవిధంగా కేబినెట్‌ హోదా మంత్రుల్లో నజ్మాహెప్తుల్లా, రాంవిలాస్‌ పాశ్వాన్‌, కల్‌రాజ్‌ మిశ్రా, మేనకాగాంధీ, రవిశంకర్‌ ప్రసాద్‌, అనంతగీతె, హర్‌సిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌, జ్యుయల్‌ ఓరమ్‌, రాధామోహన్‌ సింగ్‌, తవర్‌చంద్‌ గెహ్లాట్‌ శాఖల్లో కూడా పెద్దగా మార్పు లేదు.
కేబినెట్‌ మంత్రులు
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి (పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సులు, పింఛన్లు, అంతరిక్షం, అణుశక్తి శాఖ మరియు 
ఎవరికీ కేటాయించని శాఖలు.)
రాజ్‌నాథ్‌ సింగ్‌ హోం
మనోహర్‌ పర్రీకర్‌ రక్షణ
అరుణ్‌ జైట్లీ ఆర్థిక శాఖ, కంపెనీ వ్యవహారాలు, 
సమాచార, ప్రసారశాఖ
సుష్మా స్వరాజ్‌ విదేశీ వ్యవహారాలు, ప్రవాసభారతీయ వ్యవహరాలు
నితిన్‌ గడ్కరీ షిప్పింగ్‌, రోడ్డు రవాణా, 
జాతీయ రహదారులు
వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, 
పట్టణ దారిద్య్ర నిర్మూలన
సురేష్‌ ప్రభు రైల్వే శాఖ
డి.వి.సదానంద గౌడ న్యాయశాఖ
రాంవిలాస్‌ పాశ్వాన్‌ ఆహారం, ప్రజాపంపిణీ, కన్య్జూమర్‌ అఫైర్లు
జె.పి.నడ్డా ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
చౌదరి బీరేందర్‌ సింగ్‌ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, 
తాగు నీరు, పారిశుధ్యం
కల్‌రాజ్‌ మిశ్రా మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌
మేనకా గాంధీ మహిళా శిశు సంక్షేమం
అనంతకుమార్‌ రసాయనాలు, ఎరువులు
రవిశంకర్‌ ప్రసాద్‌ కమ్యూనికేషన్‌, ఐటీ
అశోక్‌ గజపతి రాజు పౌర విమానయానం
అనంత్‌ గీతే భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌
హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండసీ్ట్ర
నరేంద్ర సింగ్‌ తోమర్‌ గనులు, ఉక్కు 
జ్యుయల్‌ ఓరమ్‌ గిరిజన వ్యవహారాలు
తవర్‌చంద్‌ గెహ్లాట్‌ సామాజిక న్యాయం, సాధికారత
స్మృతి ఇరానీ మానవ వనరులు
ఉమాభారతి జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన
నజ్మా హెప్తుల్లా మైనారిటీ వ్యవహారాలు
రాధా మోహన్‌ వ్యవసాయం
హర్షవర్ధన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌

సహాయ మంత్రులు (స్వతంత్ర ప్రతిపత్తి)
వి.కె.సింగ్‌ గణాంకాలు, పథకాల అమలు, 
విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు
సంతోష్‌ గంగ్వార్‌ జౌళిశాఖ 
శ్రీపాద నాయక్‌ ఆయుష్‌, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ధర్మేంద్ర ప్రధాన్‌ పెట్రోలియం, సహజ వాయువులు
శర్వానంద్‌ సోన్వాల్‌ యువజన వ్యవహారాలు, క్రీడలు.
ప్రకాశ్‌ జవదేకర్‌ పర్యావరణం, అడవులు 
పీయూష్‌ గోయల్‌ విద్యుత్తు, బొగ్గు, కొత్త, సంప్రదాయేతర ఇంధన వనరులు
జితేంద్ర సింగ్‌ పీఎంవో, సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, శాస్త్ర 
సాంకేతికత, ఎర్త్‌ సైన్స్‌. అంతరిక్షం, 
అణు శక్తి శాఖల సహాయ మంత్రి.
నిర్మలా సీతారామన్‌ వాణిజ్యం, పరిశ్రమలు. 
రావ్‌ఇందర్‌జిత్‌ సింగ్‌ ప్రణాళిక, రక్షణ శాఖ
రాజీవ్‌ ప్రతాప్‌ రూడి నైపుణ్య అభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, 
పార్లమెంటరీ వ్యవహారాలు
బండారు దత్తాత్రేయ కార్మిక, ఉపాధి 
మహేశ్‌ శర్మ సాంస్కృతిక, పర్యాటక శాఖలు, పౌర విమానయానం  
సహాయ మంత్రులు 
జి.ఎం.సిద్ధేశ్వర భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు
మనోజ్‌ సిన్హా రైల్వేలు
ఉపేంద్ర కుష్వాహా మానవ వనరుల అభివృద్ధి
పొన్‌ రాధాకృష్ణన్‌ షిప్పింగ్‌, రోడ్డు రవాణా, 
జాతీయ రహదారులు
కిరన్‌ రిజిజు హోం
క్రిషన్‌ పాల్‌ గుజ్జర్‌ సామాజిక న్యాయం, సాఽధికారత
సంజీవ్‌ బల్యాన్‌ వ్యవసాయం 
మన్‌సుఖ్‌భాయ్‌ వసావా గిరిజన వ్యవహారాలు
రావ్‌సాహెబ్‌ దాదారావు ధాన్వే ఆహారం, ప్రజా పంపిణీ, కన్య్జూమర్‌ అఫైర్లు
విష్ణుదేవ్‌ సాయి గనులు, ఉక్కు 
సుదర్శన్‌ భగత్‌ గ్రామీణాభివృద్ధి
నిహాల్‌చంద్‌ పంచాయతీరాజ్‌
ముక్తార్‌ అబ్బాస్‌ న క్వీ మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాలు
రాంకృపాల్‌ యాదవ్‌ తాగునీరు, పారిశుధ్యం
హరిభాయ్‌ పార్థీభాయ్‌ చౌదరి హోం శాఖ
సంవర్‌లాల్‌ జాట్‌ జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది శుద్ధి
మోహన్‌లాల్‌ కుందారియా వ్యవసాయం
గిరిరాజ్‌ సింగ్‌ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
హన్సరాజ్‌ అహిర్‌ రసాయనాలు, ఎరువులు
రాంశంకర్‌ కఠీరియా మానవ వనరుల అభివృద్ధి
సుజనా చౌదరి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌
రాజ్యవర్ధన్‌ రాఠోర్‌ సమాచార, ప్రసారాల శాఖ
బాబూలాల్‌ సుప్రియో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, 
పట్టణ దారిద్య్ర నిర్మూలన,
జయంత్‌ సిన్హా ఆర్థిక శాఖ
సాధ్వి నిరంజన్‌ జ్యోతి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండసీ్ట్రస్‌
విజయ్‌ సాంప్లా సామాజిక న్యాయం, సాఽధికారిత  

కేంద్రమంత్రిగా సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం

కేంద్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీ
కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, మేనకా గాంధీ, రాంవిలాస్ పాశ్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుజనా మాట్లాడుతూ..డీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ఆశయాలు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కృషి చేస్తానని సుజనా చౌదరి తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన తేనేటి విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ దేశం, ప్రభుత్వం, రాష్ట్రం గురించి అన్ని విషయాలు మోదీ చెప్పారని, అందరూ కలిసి మెలసి చక్కగా పనిచేయాలని చెప్పారని అన్నారు.

Sunday, November 9, 2014

జీవీఎంసీ కమిషనర్‌గా కోన శశిధర్‌ ?

విశాఖపట్నం,(సక్సెస్ న్యూస్) జీవీఎంసీ కమిషనర్‌గా కోన శశిధర్‌ నియామకం దాదాపు ఖరారైనట్టే..?గతంలో వుడా వీసీగా పనిచేసిన అనుభవం ఉన్న శశిధర్‌ ప్రస్తుతం కడపజిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. సుమారు రెండు నెలలుగా జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్‌ లేక
పోవడంతో పాలన కాస్తా కుంటుపడింది,. ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రస్తుతం జానకి ఉన్నప్పటికీ, కమిషనర్‌ లేని లోటు కనిపిస్తోంది. స్మార్ట్‌సిటీగా విశాఖను తీర్చిదిద్దడానికి మాంచి కమిషనర్‌ని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వుడా వీసీగా పనిచేసిన సమయంలో కోన శశిధర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పాలనలో దక్షత చూపించారనక తప్పదు.దీంతో మహావిశాఖనగరపాలక సంస్థకు కమిషనర్‌గా నియమిస్తే, విశాఖనగరం వేగంగా అభివృద్ధికి సాధ్యపడుతుందని ప్రభుత్వం భావించి, కోన శశిధర్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిస్తుంది. గ్రేటర్‌ ఎన్నికలు కూడా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో వెంటనే కమిషనర్‌ నియామకం చేపట్టాలని మన ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే కమిషనర్‌ నియామకం జరుగుతుందని సెక్రటరియేట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Monday, September 22, 2014

అక్రమ లే ఔట్లపై ఏపీ సర్కార్ కొరడా...!

గుంటూరులో జరుగుతున్న అక్రమ లే ఔట్లపై ఏపీ ప్రభుత్వం కొరడా గులిపించింది. కమర్షియల్ లే ఔట్ లను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ రోజే ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రియల్టర్లు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు
.విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో భూములు కొనుగోలు చేయాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న రియల్టర్లు రెచ్చిపోయారు. అక్రమ లే ఔట్లను సృష్టిస్తూ భూములను ఇష్టమొచ్చినట్లుగా విక్రయించడంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నక తప్పదు. దీనిపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఉడా అనుమతులున్నాయి..దరఖాస్తు చేసుకున్నామని..తొందరలోనే పర్మిషన్ వస్తుందని నమ్మబలుకుతూ భూములను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రియల్టర్ల ఆగడాలకు గండి పడుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే కొందరు  ప్రభుత్వం జారీ చేసిన జీవోను సక్రమంగా అమలు చేయాలంటున్నారు.

Wednesday, July 9, 2014

అమర్‌నాథ్‌ యాత్రని చేసి వచ్చి నట్లైతే మృత్యువుని చాలా దగ్గరలో చూసి వచ్చినట్లే...!!!

అమర్నాద్ యాత్ర విశేషాలు

మర్నాద్  "అమరనాధుడంటే"  జరామరణములు లేని వాడు అని అర్ధం .  హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా క్షేత్రం మరియు అత్యంత ప్రమాదకరమైన యాత్ర కూడా . చుట్టూ మంచు ఎత్తైన కొండలు , ఎటుచూసినా మంచుతో కప్పబడి ఉన్న కొండలు , మంచు కరగడం చేత కొండలు స్నానం ఆడుతున్నాయా అనే భావం కలిగించేలా ఉండే సౌందర్య దృశ్యంమే ఈ ప్రదేశం .కొండలపైనుంచి కరిగి వస్తున్న మంచును తన వడిలోకి చేర్చుకుని వయ్యారంగా వంపులు తిరుగుతూ ప్రవహించే సింధు నది . ఆ నదిలోంచి వచ్చే శబ్దాలు పై నుంచి మనకు కనిపిస్తున్నా మానసికంగా మాత్రం ఆ సింధు నదిలోనే ఆడుతూ పాడుతున్నట్టుగా ఉంటాదంటూన్నారు యాత్రికులు .. ఎప్పటి నుంచి ఉన్నాయో పెద్దపెద్ద చెట్లు కనిపిస్తుంటాయి.. ఇక్కడ శివయ్య లేకపోతే నేను ఇంత సాహసం చేసి వచ్చేవాడినా ...భక్తులుకు ఇంత ప్రకృతి అందాలను చూడగలిగే వాన్నా అని పించక మానదు . 
స్థల పురాణం

అమరనాధుడంటే జననమరణాలు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీ దేవి ఈశ్వరుడితో నాధా నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది అని అడిగింది. ఈశ్వరుడు పార్వతీ ! నీవు జన్మించినప్పు డంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను అని బదులిచ్చాడు. పార్వతీ దేవి నాధా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నావు ఇది ఎలా సాధ్యం అని అడిగింది. ఈశ్వరుడు పార్వతీ ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణి కోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతికి చివరకు ఈశ్వరుడు అమరనాధ్‌ గుహను ఎంచుకున్నాడు. పహల్‌ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్‌ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్లాడు. షిషాంగ్‌ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు. మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు. తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమర్‌నాథ్‌ గుహలోపలికి వెళ్లాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వ రహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు.
వంటిలో ఓపిక   ఉండగానే యాత్రలు చెయ్యాలి అనే మాట .. వయసు పైబడిన తరువాత అమర్నాద్ వచ్చే భక్తులకు గుర్తోచ్చి తీరుతుంది . వంటిలో ఓపికున్నప్పుడు అమరనాధుడు గుర్తుకు రావాలి .. ఆయన అనుగ్రహం కూడా ఉండాలిగా !
పర్వతాల పై మంచుపడి ఆ మంచుపై సూర్యకిరణాలు పడటం చేత వచ్చే తెల్లటి కాంతి లోనే శివయ్య దర్శనం ఇస్తూ ఉంటాడు .
ఈ యాత్ర సాహస యాత్ర ని చెప్పడానికి కారణం . సరైన రవాణ సౌకర్యం లేకపోవడం . నిజానికి ఈ అమర్నాద్ యాత్ర జూలై లో ప్రారంభమై - ఆగష్టు లో ముగుస్తుంది . 45 రోజులు మాత్రమే అమర్నాద్ యాత్ర ఉంటుంది . ఆ తరువాత ఈ ప్రాంతం మంచుతూ కప్పబడిపోతుంది . తిరిగి జూలై లోనే ప్రారంభం అవుతుంది . ఈ ప్రాంతం లో ఎవరూ నివసించరు . ప్రయాణం అంతా ఇరుకు రోడ్లపై నే సాగుతుంది . 
ఏ మాత్రం కాస్త అజాగ్రత్త ఉన్న అంతే సంగతులు .. ఇక్కడ గుర్రాలు తప్ప మరే ఇతర వాహనాలు ఉండవు .కొందరు భక్తులు హెలికాప్టర్ పై వచ్చినా సరే 6 కిలోమీటర్లు ముందే హెలికాప్టర్ ఆపివేస్తారు . అక్కడ నుంచి గుర్రాలకు వేరేగా డబ్బులు ఇచ్చి ప్రయాణం కొనసాగించాలి .
గుర్రాలపై ప్రయాణం అంత సులువు కాదు . మనం ఎక్కినా 5 - 10 నిమిషాల్లోనే  ఒళ్ళంతా కదిలిపోవడం చేత ఇంకా ఎంత దూరం అని అడగకుండా ఉండలేము . చుట్టూ కొండలు ఎత్తైన ప్రదేశం లో మనకు .. ఎంత లోతుందో తెలియని లోయలు .. వేగంగా ప్రవహిస్తూన్న సింధు నది . గుర్రం అటు ఇటు కదలడం కాస్త అటు పక్కకి ఇటు ప్రక్కకి కదులుతూంటే .. శివ శివా అని మనకు తెలియకుండానే శివనామస్మరణ చేస్తాం .  
అమర్నాద్ గుహ శ్రీనగర్ ( జమ్మూ మరియు కాశ్మీర్  ) కు 141 కిలోమీటర్ల దూరంలో 3,888 m (12,756 ft) ఎత్తులో ఉంది .
 జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి , పహల్ గాం నుంచి గుహ కు చేరే లోపు మనం 
 కూడా చూస్తూ వెళ్తాం . 
జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి. జమ్ము నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కొరకు రఘునాధన్ వీధిలో ఉన్న " టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ , జమ్ము & కాశ్మీర్ ' వద్దకు వెళ్ళాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెలవారకముందే   వెళ్ళాలి.
*  శ్రీ నగరుకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం ఆకాశాన్ని అంటే కొండ చరియలు నదులు ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. ఇక్కడ యాత్రికులు బసచేయడానికి వసతి గృహాలు లభ్యమవుతాయి. పహల్ గాం కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రికుల శిరంలో ప్రభుత్వేతర సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కలిగిస్తుంటాయి.
* చంద్రవారి ఇది పహల్ గాం  నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్ గాం నుండి చంద్రవారి వరకు మినీ బస్సులు లభ్యమవుతాయి. లిడ్డర్ నథీ తీరం వెంట ఈ బస్సు మార్గసం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలాను చూసే అవకాశం లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడా యాత్రికుల కొరకు ఆహారశాలలు ఉంటాయి.
* శేషాంగ్ ఏడుపర్వతశిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడు పడగలకు గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాధ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతోకూడిన పురాణ కధనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలి మంటలు రగిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నహిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేషాంగ్  సరసులో ఒక సారి స్నానం ఆచరించినట్లైతే జీవితానికి సరికొత్త అర్ధం స్పురించిన అనుభూతి స్పురిస్తుంది.
* శేషాంగ్ నుండి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న "పాంచ్ తర్ణి " చేరుకుంటారు. 
సముద్రమట్టానికి 12,000 ఎత్తులో ఉన్న ఇక్కడి లోయలలో పచ్చిక మైదానాలు ఉన్నాయి. యాత్రీకులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పని సరి. ఇక్కడ కొందరు యాత్రీకులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంత మంది వాంతు వచ్చే అనుభూతికి లోనవుతారు. ఎండు ఫలాలు, వగరు తీపి పదార్ధాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఉత్తమం. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్ళు పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో పయనించడం మనోహరంగా ఉంటుంది. భైరవపర్వత పాదంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమ శివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు.
పంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి .సంగమప్రాంతాన్ని చూడ వచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతమంది యాత్రీకులు అమరావతీ నదిలో స్నానం చేస్తారు. యాత్రీకులు పరమశివుడిని, పార్వతిని, గణేషుడిని దర్శించుకుని సాయంత్రానికి పంచ్ తర్ణి చేరుకోవచ్చు.
* యాత్రీకులు జమ్ము నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా "బాల్ తల్" చేరుకుని అక్కడ నుండి అమరనాధ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండ మార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీర దారుఢ్యం ఉన్న వారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనీస్ లేక డోలీ (పల్లకీలు) లభిస్తాయి.. అమరనాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి మార్గం కనుక "బాలా తల్ " అమరనాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
ప్రయాణం సాగుతున్నంతా సేపు .. కొండల్లోంచి వచ్చే చల్లటి గాలి .. ఉన్నట్టు ఉండి మన గుర్రం పడిపోతుందేమో అనే భయం .. కొండల అంచుల్లో ప్రయాణం .. చుట్టూ చూస్తే అబ్బ ఎంత బాగుంది .. ఆహ చాలు ఈ జన్మకి నేను చూడగలిగాను చూస్తున్నాను అనే ఆనందం కలుగుతుంది, .. 
* వాయు మార్గంలో చంఢీగఢ్ నుండి జమ్ముకాశ్మీరు వరకు విమాన సర్వీసులు ఉన్నాయి.
* జమ్ము-కాశ్మీర్ శీతల రాజధాని అయిన జమ్ము భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక రైలు మార్గంలో జమ్ముకు చేరుకుని అక్కడి నుండి అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
* రహదారి మార్గంలో జమ్ము - కాశ్మిర్ చక్కగా భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసందానించబడి ఉంటుంది కనుక బస్సులు, మరియు కార్లలో ఇక్కడకు చేరుకుని అమర్నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.

ఉపయుక్తమైన విషయాలు 

* చందన్ వాలి, శేషాంగ్,  పాంచ్ తర్ణి లలో హ్రభుత్వం చేత నడుపబడుతున్న డిపారాట్ మెంటల్ స్టోర్స్ లలో కావలసిన వంటకు కావలసిన సామాను లభ్యం ఔతుంది. అలాగే కట్టెలు గ్యాస్ కేనులు కూడా ఈ ఊరిలో దుకాణాలలో లభ్యం ఔతాయి. మార్గమధ్యంలో అనేక టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఉన్నాయి కనుక అక్కడ టీ, కాఫీలతో పాటు అల్పాహారం వంటివి లభిస్తాయి. అయినప్పటికీ యాత్రీకులు తమ వెంట అత్యవసర సమయాలలో ఉపశమనం పొందడానికి తమతో టిన్ ఫొడ్స్, టాఫీలు, బిస్ కట్స్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* యాత్రీకులు "శ్రీ ఆమర్నాథ్ జి ష్రైన్ భోర్ద్ ఫర్ ది యాత్ర " వద్ద నమోదు పత్రం తీసుకున్నట్లతే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్ లక్ష రూపాయలు నగదు లభిస్తుంది. 
* యాత్రా సమయంలో మార్గమధ్యంలో ఏకాంతమైన గుడిసెలు, గుడారాలు యాత్రీకులకు అద్దేకు లభిస్తాయి.
* యాత్రీకులు ఒక మాసానికి ముందు తమ పేరును నమోదు చేసుకున్నట్లైతే యాత్ర సులువుగా సౌకర్యంగా చేయడానికి వీలు అవుతుంది.
యాత్రీకులు చేయవలసినవి 

* యాత్రను నమోదు చేసుకునే సమయంలో వైద్యపరిశీలన నిర్వహించి సముద్రమట్ట్శానికి  14,000 అడుగుల ఎత్తులో కొండచెరియలను ఎక్కేసమయంలో శరీరం తట్టుకోగలదా శోధిస్తారు. వైద్యుల ద్రువీకరణ పత్రాలను యాత్రీకులు వెంట తీసుకుని వెళ్ళాలి. అలాగే రోజుకు 4-5 కిలోమీటర్లు నడక వ్యాయామం మరియు ప్రాణాయామం వంటి వ్యాయామం కనీసం ఒక మాసానాకి ముందు ఆరంభించి శరీరాన్ని యాత్రకు సిద్ధం చేసుకోవాలి.
* యాత్రీకులు "ఎస్ ఏ ఏ బి" వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
* ఎత్తైన పర్వతసానువులలో చలిగాలుల మధ్య ప్రయాణం చేయాలి కనుక యాత్రీకులు ఉన్ని దుస్తులు, చిన్న గొడుగు, విండ్ చీటర్, రైన్ కోటు, స్లీపింగ్ బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షూలు, టార్చి, చేతి కర్ర, మంకీ క్యాప్, గ్లోవ్స్, జాకెట్, ఉలెన్ సాక్స్ మరియు ట్రౌజర్లు తమ వెంట తీసుకు వెళ్ళాలి.
* స్త్రీలకు చీరలు యాత్రకు అనుకూలం కావు కనుక చుడిదార్, ప్యాంట్ షర్ట్ లేక ట్రాక్ సూట్ తీసుకు వెళ్ళడం మంచిది. 
* కఠినమైన కొండ మార్గం మీద జాగ్రత్తతో నడక సాగించాలి.
* పోనీ వాలా, కూలీలు, దండివాలాలు నమోదు చేసుకున్న వారా అని జాగ్రత్తగా పరిశీలించండి. నమోదు చేసుకున్న వారు బాల్ తల్, పాంచ్ తర్ణి, పహల్ గాం వద్ద లభిస్తారు.
* పోనీ వాలాలు, కూలీలు మీ వెంట వస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వారు మీ నుండి తప్పి పోయినట్లైతే అత్యవసరమైన సమయాలలో మీకు కావలసిన వస్తువులు మీకు లభ్యం కావడం కష్టం కనుక సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి.
* యాత్రీకులు బాల్ తల్ , పహల్ గాం నుండి బయలుదేరే సమయంలో మీ దుస్తులు మరియు ఆహారపదార్ధాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులలో బధ్రపచి అవి తడిసి పోకుండా కాపాడుకోండి. 
* యాత్రీకులు తమకు కావలసిన సామానులు వసతి గృహాలకు అవసరమైన ధనాన్ని దగ్గర ఉంచుకోవాలి.
* మీ గురించి సకల వివరాలను వ్రాసుకున్న ఐడెండిటీ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవాలి. అవసరమైన సమయాలలో అది ఉపయోగపడుతుంది. 
* మీరు రోజూ తీసుకోవలసిన మందులను సాదారణంగా కావలసిన మందులను వెంట తీసుకు వెళ్ళండి.
* ప్రయాణం చేసే సమయంలో వేగించి ఉన్న పప్పులు, టాఫీలు, చాక్ లెట్స్ మొదలైనవి మీ వెంట మోసుకు వెళ్ళండి.
* కోల్డ్ క్రీం, మరియు వ్యాజ్ లిన్, స్పష్టంగా చూడడానికి కావలసిన కళ్ళద్దాలు వెంట తీసుకు వెళ్ళండి. అవి తడి, పొడి వాతావరణంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది.
* కొండ ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు మీరే స్వతంత్రించి మీ శక్తికి మించి దూరంగా వెళ్ళ కండి.
* నిదానమైన స్థిరమైన నడకతో యాత్రను సాగించండి. వేగమైన నడక వలన త్వరగా అలసి పోతారు. 
* మీ తోటి యాత్రీకులకు కావలసిన సాయం చేస్తూ ప్రశాంతంగా యాత్రను సాగించండి.
* నిర్వాహకుల సలహాలను శ్రద్ధగా పాటించండి. 
* నీరు, గాలి, వాయువు, భూమి, ఆకాశం ఈశ్వరుడి స్వరూపం కనుక పరిసరాలను కలుషితం చేయకుండా యాత్రను సాగించండి. ఫ్లాశ్టిక్ సామానులు పూర్తిగా నిషిద్ధమని గ్రహించండి.
* మలమూత్ర విసర్జనకు " శ్రీఅమర్నాథ్ ష్రైన్ బోర్డ్ " ఏర్పాటు చేసిన బాత్ రూములను ఉపయోగించండి. బహిరంగప్రదేశాలలో చేయకండి.
 అమర్‌నాథ్‌ యాత్రని చేసి వచ్చినట్లైతే మృత్యువుని కాస్త దగ్గర నుంచి చూసి వచ్చినట్లే . శివుని పై భారం వేసి ఓం నమః శివాయ అంటూ వెళ్తున్నవార్కి యమపాసలు ఏమి చేయగలవు ? 
యాత్రీకులు చేయకూడనివి 
* హెచ్చరిక ఫలకం మరియు హెచ్చరిక చిహ్నం ఉన్న ప్రదేశాలలో నిలబడకండి.
* సిగరెట్లు, మధుపానం చేయకండి. 
* నిటారుగా ఉండే కొండ చరియలలో నడవడానికి స్లిప్పర్స్ ఉపయోగించడం ప్రమాదకరం కనుక లేసులు కలిగిన షూలను వాడండి.
* పరిసరాలను కలుషితం చేసే సామానులు వాడకండి. 
* అమరనాథుని తాకకండి, ఆయన మీద పూజాద్రవ్యాలను విసరకండి, సాంబ్రాణి కడ్డీలను వెలిగించకండి.
* కూలీలకు, పోనీలకు, దండీలకు, వంటసామానులకు, కట్టెలకు, వసతిగృహాలకు నిర్ణయించిన దానికంటే అధికం చెల్లించకండి. 
* నిర్ణయించిన రుసుము కంటే అధికమైన ధనం హెలికాఫ్టర్లకు చెల్లించకండి. 
* రాత్రి వేళలో గుహాలయంలో ఉండకండి. అలా చేస్తే అక్సిజన్ కొరత వలన ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చు.

వేరోక కథనం

పురాతన ఇతిహాసాలలో మరొక కధ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరసును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహింపజేశాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్‌ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్‌ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్‌ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్లి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు పురాణ కాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడన్న ప్రచారం కూడా ఉంది.