Monday, December 13, 2010

వైఎస్. రాజశేఖర్ రెడ్డి అలీబాబా వంటి వాడు: చంద్రబాబు


దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అలీబాబా వంటి వాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైఎస్సార్ మరణించినప్పటికీ రాష్ట్రంలో అలీబాబాకు ఉన్న 40 మంది అనుచరులు కాంగ్రెస్‌లో ఇంకా ఉన్నారని బాబు విమర్శించారు. ఆ నలభై మంది అవినీతిని బయటపెట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని వెలికి తీస్తామని బాబు సవాలు చేశారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ముదిగొండ, గువ్వలగూడెం, గోకినపల్లి ప్రాంతాల్లో పర్యటించిన బాబు రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వల్లే ఇన్ని కష్టాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులకు అన్యాయం జరుగుతుందని బాబు చెప్పారు.

No comments:

Post a Comment