హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతలు, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని వారిపై ఉన్న సాధారణ కేసులను ఎత్తివేయటం జరిగిందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. కేసుల ఎత్తివేతపై ఆయన సోమవారం సభలో మాట్లాడుతూ కేసులన్ని ఒకేసారి ఎత్తివేయటం సాధ్యం కాదని, తీవ్రమైన కేసుల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు.కేసుల ఎత్తివేత విద్యార్థుల భవిష్యత్, శాంతిభద్రతలో ముడిపడిన అంశమన్నారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కేసులు ఎత్తివేశామన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రావని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్లో హింసకు పాల్పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment