Sunday, December 5, 2010

తెలంగాణాకోసం ప్రాణాలనైనా అర్పిస్తా...?

డిసెంబరు నెల అలా అడుగుపెట్టిందో లేదో కేసీఆర్ తెలంగాణాపై తన స్వరాన్ని పెంచారు. తెలంగాణాకోసం తన ప్రాణాలనైనా అర్పించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తెలంగాణా లక్ష్య సాధనకోసం ప్రాణాలర్పించిన శ్రీకాంత్ ప్రధమ వర్థంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటే శ్రీకాంత్‌కు నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. డిసెంబరు 31లోపు కేంద్రం తెలంగాణా ఏర్పాటుకు అనువుగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలనీ, లేదంటే తెలంగాణాలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. తెలంగాణా ప్రాంతంలో ఏ ప్రభుత్వ కార్యాలయం పనిచేయదనీ, బస్సులు తిరగవనీ, షాపులు బందవుతాయనీ వెల్లడించారు. డిసెంబరు తర్వాత కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదన్నారు. తాము చేపట్టబోయే ఉద్యమం దెబ్బకు ఢిల్లీ పెద్దల కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పారు.

No comments:

Post a Comment