Monday, December 20, 2010

బాబు దీక్ష విరమించాలి: హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనీ, ఇంతకన్నా నష్ట పరిహారాన్ని ఏ రాష్ట్రమూ చేయలేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇకనైనా చంద్రబాబు తను చేపట్టిన నిరాహారదీక్షను విరమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంలో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని ఆమె స్పష్టం చేశారు. రైతుల మనోస్తైర్యం దెబ్బతినకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉందని ఆమె అన్నారు.భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని సబితా ఇంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment