Saturday, July 27, 2013

అధికార, విపక్ష పార్టీల మధ్య చిచ్చురేపుతున్న పంచాయతీలు

గ్రామపంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో స్వరాజ్యం తెస్తుందో లేదో కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే కక్షలు కార్పణ్యాలు మాత్రం రగిలిస్తోంది. ఎన్నికలలో ఏర్పడిన తగాదాలు అనంతరం తగువులుగా మారుతున్నాయి. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఎన్నికలు అధికార, విపక్ష పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి.

విశాఖ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కక్షలకు ఊతమిస్తున్నాయి. రెండవ విడత జరిగిన ఎన్నికల్లో పరవాడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్ ఆర్ సీపీ టిడిపి కార్యకర్తల మద్య వాగ్వివాదం జరిగింథి. ముత్యలమ్మపాలెం పెదముసిడివాడ కన్నూరు పంచాయితీల్లో కూడా ఇదే పరిస్థితి. అధికారపార్టీ కార్యకర్తలు టీడీపీకి చెందిన కార్య్కర్తలపై దాడికి ప్రయత్నించారు.
ఇక్కడ పంచాయతీల్లో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.