Monday, December 20, 2010

శోభారాణి స్టైలే వేరు

చిరు వ్యాఖ్యలకు భిన్నంగా బాబు దీక్షకు మద్దతు
హైదరాబాద్; రైతుల్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ పీఆర్పీ అధినేత చిరంజీవి గుంటూరు పర్యటనలో మండిపడ్డారు. ఆ పార్టీ సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు కూడా దీక్షను తప్పుపట్టారు. కానీ ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ శోభారాణి మాత్రం దీనికి భిన్నంగా బాబు దీక్షకు మద్దతు తెలిపా రు. బాబు తలుచుకుంటే రైతుల డిమాండ్లు వీలైనంత త్వరలో తీరిపోతాయం టూ కితాబునిచ్చారు. 
చిరంజీవి, చంద్రబాబు కలిస్తే.. అంటూ సరికొత్త సమీకరణ ప్రస్తావన కూడా తెచ్చారు. గతంలోనూ అనేక సార్లు ఆమె పీఆర్పీ తీరును బహిరంగంగానే ప్రశ్నించిన సందర్భాలున్నాయి. అయితే తాజా వ్యవహారం పట్ల ఆ పార్టీ నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కాగా.. తమ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించుకునే స్వేచ్చ ఉంటుందని గతంలో చిరంజీవి పేర్కొనడం ఇక్కడ గమనార్హం.

No comments:

Post a Comment