న్యూస్


తన పై జోక్స్ వేసిన సైట్ పై కేసు :baalayya

ఈ మధ్య కాలంలో ఎవరు సెల్ ఫోన్ చూసినా బాలకృష్ణ మీదో లేదా జూ.ఎన్టీఆర్ మీదో జోక్ వస్తోంది. సర్దార్జీల జోక్ లను బాలకృష్ణకు అనువర్తించి ఈ జోక్ లను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ పై ఇలాంటి జోక్ లు వికృతమైన ఫోటోలతో http://www.ihatebalayya.com/ అనే వెబ్ సైట్ రన్ అవుతోంది. ఈ విషయం తన అభిమానుల ద్వారా బాలకృష్ణ స్వయంగా సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్ఎంఎస్‌ల వెనక ఉన్నవారితో పాటు వెబ్‌సైట్ నిర్వాహకుల ను పట్టుకుని కేసు పెట్టడానకి వెతుకుతున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

ఫిబ్రవరి 18 నుండి అసెంబ్లీ – బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సిద్ధమైన ప్రభుత్వం
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 18 నుండి ప్రారంభించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం పూర్తయిన వెంటనే సభ మరుసటి రోజుకు వాయిదా వేయవలస ఉన్నందున శుక్రవాం సమావేశం ఏర్పాటు చేసిన పక్షంలో శని, ఆదివారాలు సభను వాయిదే వేసే వెసులు బాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్ధాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించినందున 45 రోజులకు సరిపడ ఎజెండాను ఖరాలు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆర్ధిక శాఖ పద్దుల వారిగా కసరత్తు చేసింది. కేంద్ర సహయం, రాష్ట్ర వ్యయం అంచనా వేసింది. రాబడులు ఆశాజనకంగానే ఉన్నందున బడ్జెట్‌ను లక్ష కోట్లకు మించి ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. శాఖల వారిగా డిమాండ్ల రూపకల్పనకు కసరత్తు ప్రారంభించే విధంగా అధికారుల స్ధాయిలో చర్యలు ప్రారంభించారు.  ఆదాయ, వ్యయాలు, సంక్షేమ పద్దులు, నిర్వహణ భారం తదితర అంశాలు పూర్తి స్దాయి పద్దుల్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాలు ఎలాగున్నప్పటికీ రాజ్యాంగ బద్దమైన చర్యలకు ఆటంకం కలగని విధంగా చర్యలు ప్రధానం అని సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ సమావేశాలను పరిగణలోకి తీసుకున్న పక్షంలో బడ్జెట్‌ సమావేశాలు సాఫీగా జరిగే అవకాశం లేదు. శాసన మండలికి కొంత మందిని ఎంపిక చేసుకొనే ప్రక్రియ ఉన్నందున పూర్తి స్దాయిలో మార్చి 31 వరకు సభ జరిపించే విధంగా ఎజెండాను రూపొందించాలని ప్రభుత్వం నుండి సంబంధింత అధికారులకు ఆదేశాలు అందాయి.  దాదాపు 30 రోజులకు తక్కువ కాకుండా సమావేశాలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తుంది. శాసనమండలి సభ్యులు సుమారు 29 మంది పదవి కాలం పూర్తి కావస్తున్నందున కొత్త వారి ఎన్నిక అధికార పక్షానికి కత్తి మీద సాముగానే ఉంది. జగన్‌ వర్గం బలపడుతుందని భావించి ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే అసంతృప్తి వాదులను కౌన్సిలింగ్‌ చేయడం ప్రారంభించారు. పార్టీని బలోపేదం చేసే దిశగా పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తన స్ధాయిలో చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధుల్లో మాత్రం ఇంకా అయోమయం కొనసాగుతునే ఉంది. కాంగ్రెస్‌ అంతర్గత వేదికల్లో జగన్‌ ఎంత మందిని చీల్చగలడనే చర్చ ఊపందుకుంది. బహిరంగంగా జగన్‌పై విమర్శలు చేస్తున్నవారిలో కొందరు, ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటారని భావిస్తున్న వారిలో కొందరు స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.జగన్‌ 2014 ఎన్నికల వరకు ఓపిక పట్టే విధంగా లేడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పద్దులపై చర్చకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ బిల్లులు ఆమోదింపచేసుకొనడం ప్రధానం అనే భావనతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర రాజకీయ పరిస్ధితులు అంతగా అనుకూలించనప్పటికీ సభ నిర్వహణలో పెద్దగా ఆటంకం ఉండబోదనే ధైర్యం ప్రభుత్వం నుండి వ్యక్తం అవుతుంది. ఇప్పటి నుండే అసంతృప్తి వాదులను బుజ్జగించడానికి ముఖ్యమంత్రి పూనుకున్నందున, అవసరమైన పక్షంలో అధిష్టానం జోక్యం చేసుకొని సభ్యుల మధ్య సక్యత లోపించని విధంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం లేక పోలేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో కొన్నింటికి మార్పులు చేర్పులు ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు.రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రాజకీయ రచ్చబండను తలపించే విధంగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ అంశంతో పాటు ప్రభుత్వం బల నిరూపన కూడా చర్చనీయాశం కాబోతుంది. జగన్‌ వర్గీయులు ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని బల నిరూపన చేసుకోవాలని బహిరంగంగా సవాల్‌ చేశారు. ఆలాంటి పరిస్ధితి ఉత్పన్నమైన పక్షంలో వ్యవహరించవలసిన వ్యూహంపై కూడా మంతనాలు సాగుతున్నాయి. ప్రభుత్వ మనుగడ అసెంబ్లీ సమావేశాలలోనే తేలే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. జగన్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన కథనాలు, వాటిపై ప్రతిపక్ష నేత ఎన్‌. చంద్రబాబు చేసిన డిమాండ్‌ పై అసెంబ్లీలో చర్చకు తెరలేపడానికి విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ అంశం, జగన్‌ వ్యవహారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశాలు కాబోతున్నాయి.ఫిబ్రవరి 18 నుండి అసెంబ్లీ – బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సిద్ధమైన ప్రభుత్వంఅసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 18 నుండి ప్రారంభించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం పూర్తయిన వెంటనే సభ మరుసటి రోజుకు వాయిదా వేయవలస ఉన్నందున శుక్రవాం సమావేశం ఏర్పాటు చేసిన పక్షంలో శని, ఆదివారాలు సభను వాయిదే వేసే వెసులు బాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్ధాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించినందున 45 రోజులకు సరిపడ ఎజెండాను ఖరాలు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆర్ధిక శాఖ పద్దుల వారిగా కసరత్తు చేసింది. కేంద్ర సహయం, రాష్ట్ర వ్యయం అంచనా వేసింది. రాబడులు ఆశాజనకంగానే ఉన్నందున బడ్జెట్‌ను లక్ష కోట్లకు మించి ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. శాఖల వారిగా డిమాండ్ల రూపకల్పనకు కసరత్తు ప్రారంభించే విధంగా అధికారుల స్ధాయిలో చర్యలు ప్రారంభించారు.  ఆదాయ, వ్యయాలు, సంక్షేమ పద్దులు, నిర్వహణ భారం తదితర అంశాలు పూర్తి స్దాయి పద్దుల్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాలు ఎలాగున్నప్పటికీ రాజ్యాంగ బద్దమైన చర్యలకు ఆటంకం కలగని విధంగా చర్యలు ప్రధానం అని సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ సమావేశాలను పరిగణలోకి తీసుకున్న పక్షంలో బడ్జెట్‌ సమావేశాలు సాఫీగా జరిగే అవకాశం లేదు. శాసన మండలికి కొంత మందిని ఎంపిక చేసుకొనే ప్రక్రియ ఉన్నందున పూర్తి స్దాయిలో మార్చి 31 వరకు సభ జరిపించే విధంగా ఎజెండాను రూపొందించాలని ప్రభుత్వం నుండి సంబంధింత అధికారులకు ఆదేశాలు అందాయి.  దాదాపు 30 రోజులకు తక్కువ కాకుండా సమావేశాలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తుంది. శాసనమండలి సభ్యులు సుమారు 29 మంది పదవి కాలం పూర్తి కావస్తున్నందున కొత్త వారి ఎన్నిక అధికార పక్షానికి కత్తి మీద సాముగానే ఉంది. జగన్‌ వర్గం బలపడుతుందని భావించి ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే అసంతృప్తి వాదులను కౌన్సిలింగ్‌ చేయడం ప్రారంభించారు. పార్టీని బలోపేదం చేసే దిశగా పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తన స్ధాయిలో చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధుల్లో మాత్రం ఇంకా అయోమయం కొనసాగుతునే ఉంది. కాంగ్రెస్‌ అంతర్గత వేదికల్లో జగన్‌ ఎంత మందిని చీల్చగలడనే చర్చ ఊపందుకుంది. బహిరంగంగా జగన్‌పై విమర్శలు చేస్తున్నవారిలో కొందరు, ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటారని భావిస్తున్న వారిలో కొందరు స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.జగన్‌ 2014 ఎన్నికల వరకు ఓపిక పట్టే విధంగా లేడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పద్దులపై చర్చకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ బిల్లులు ఆమోదింపచేసుకొనడం ప్రధానం అనే భావనతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర రాజకీయ పరిస్ధితులు అంతగా అనుకూలించనప్పటికీ సభ నిర్వహణలో పెద్దగా ఆటంకం ఉండబోదనే ధైర్యం ప్రభుత్వం నుండి వ్యక్తం అవుతుంది. ఇప్పటి నుండే అసంతృప్తి వాదులను బుజ్జగించడానికి ముఖ్యమంత్రి పూనుకున్నందున, అవసరమైన పక్షంలో అధిష్టానం జోక్యం చేసుకొని సభ్యుల మధ్య సక్యత లోపించని విధంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం లేక పోలేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో కొన్నింటికి మార్పులు చేర్పులు ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు.రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రాజకీయ రచ్చబండను తలపించే విధంగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ అంశంతో పాటు ప్రభుత్వం బల నిరూపన కూడా చర్చనీయాశం కాబోతుంది. జగన్‌ వర్గీయులు ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని బల నిరూపన చేసుకోవాలని బహిరంగంగా సవాల్‌ చేశారు. ఆలాంటి పరిస్ధితి ఉత్పన్నమైన పక్షంలో వ్యవహరించవలసిన వ్యూహంపై కూడా మంతనాలు సాగుతున్నాయి. ప్రభుత్వ మనుగడ అసెంబ్లీ సమావేశాలలోనే తేలే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. జగన్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన కథనాలు, వాటిపై ప్రతిపక్ష నేత ఎన్‌. చంద్రబాబు చేసిన డిమాండ్‌ పై అసెంబ్లీలో చర్చకు తెరలేపడానికి విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ అంశం, జగన్‌ వ్యవహారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాన చర్చనీయాంశాలు కాబోతున్నాయి.