Wednesday, December 1, 2010

మంత్రివర్గ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : రాష్ట్ర నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఉదయం 10.13 గంటలకురాజ్‌భవన్‌లో ప్రారంభం అయ్యింది. తొలిగా గల్లా అరుణకుమారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె ముఖ్యమంత్రికి,గవర్నర్ నరసింహన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అక్షర క్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ మంత్రి రోశయ్య, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మేయర్ కార్తీకరెడ్డి, కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి, పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, సీపీఎం, సీపీఐ, పీఆర్పీ, లోక్‌సత్తా పార్టీలకు చెందిన నేతలు హాజరు అయ్యారు.

No comments:

Post a Comment