Sunday, December 23, 2012

రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్‌ను జైలు పాలు చేశారు


రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్‌ను జైలు పాలు చేశారు





రాజకీయంగా జగన్‌మోహన రెడ్డిని ఎదుర్కోలేక జైలుపాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్టన్రాయకులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.  జి వి ఎమ్ సి 56వ వార్డ్ పరిథి  అగనంపూడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు గున్నంటి పూర్ణానంథ శర్మ ఆద్వర్యంలో  జగన్‌మోహన రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ  మాట్లాడుతూ ప్రజాబలం మెం డుగా ఉన్న జగన్‌మోహనరెడ్డిని ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐను అడ్డం పెట్టుకుని జగన్‌మోహనరెడ్డిని జైలుపాలు చేశారన్నారు. రైతు కళ్లలో ఆనందభాష్పాలను చూడాలన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆకాంక్షను తీర్చేందుకు వైఎస్ జగన్‌మోహన రెడ్డి కంకణం కట్టుకున్నారని, ఆయనకు జన్మదిన కానుక గా సహకార సంఘాల ఎన్నికల్లో అధిక స్థానాలను గెలిపించి అందించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనా, నాయకులపైనా ఉందన్నారు. జగన్ పిలుపుకోసం రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యే లు ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్ పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను 700రూపాయలు, వికలాంగులకు వెయ్యి రూపాయలుగా అందించేందుకు పార్టీ నిర్ణయించిందన్నారు. అలాగే అమ్మఒడి పేరుతో పిల్లలను ఆదుకుంటామన్నారు. రైతులకు, విద్యార్థులకు, పేదలను అన్ని విధాలా ఆదుకోవడంతోపాటు సాగు, తాగునీటికి పార్టీ ప్రాధాన్యతనిస్తుందన్నారు. అంతకుముందు జగన్ జన్మదిన సందర్భంగా కేక్‌ను కట్‌చేసి స్వీట్లు పం చిపెట్టారు. వృద్ధులకు దుప్పట్లు  పంచిపెట్టారు.  అనంతరం 2013నూతన క్యాలండర్ ను కొణతాల రామకృష్ణ చేతులు మీదుగా అవిస్కరించారు, ఈ కార్యక్రమంలో నగర అథికారప్రతినిది తిప్పలనాగిరెడ్డి,కొయ్యప్రసాద్ రెడ్డి,చొప్పానాగరాజు,గొలగానిశ్రీను,ఇల్లపు ప్రసాద్, గుర్రంశ్రీను,గళ్ళ అప్పారావు,జె సోమినాయ్డు(సమరా),తులసి,కాతా నూకరాజు, పాల్గొన్నారు

Thursday, December 6, 2012

ఎన్టీఆర్ విగ్రహం మహాచార్య శిల్పి చెక్కనున్నారా ?


తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ. రామారావు విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ శిల్పాన్ని హైదరాబాద్‌కు చెందిన మహాచార్య అనే శిల్పి చెక్కనున్నారు. విగ్రహాన్ని తామే సమర్పిస్తామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పోటీపడినా, చివరకు ఆ అవకాశం మాత్రం పురందశ్వరికే దక్కింది. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని సమర్పించాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం రాజ్యసభ ఆరో నంబర్ విశ్రాంతి మందిరం పక్కన, తమిళ నేత మురసోలి మారన్ విగ్రహం ఎదురుగా ప్రతిష్టించనున్నారు.




Wednesday, November 28, 2012

జగన్ గూటికి… పూరి ‘జగన్’!



క్సెస్ న్యూస్  చెప్పింది…. అక్షరం పొల్లు పోలేదు. ‘పూరి జగన్.. జగన్ మనిషా...?అని  ఇదివరకే విశ్లేషనాత్మక కథను  రచించింథి. జగన్ అడుగులకు మడుగులు వత్తుతూ… జగన్ పిలుపు కోసం కళ్ళు కాయలు కాచేలా ‘పూరి జగన్’ కుటుంబం ఎదురు చూస్తోందని సక్సెస్ న్యూస్ చెప్పింథి. వై యస్ జగన్ కుటుంబంపై తన సానుభూతిని, అభిమానాన్ని తెలియపరచడానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని ఓ ఆయుధంలా పూరి వాడుకున్నాడని సక్సెస్ న్యూస్ వ్యక్తం చేసింది. పూరి జగన్నాద్ కుటుంబం జగన్ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది.వై యస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీకి ఎప్పటినుంచో సినీ గ్లామర్ కొరత. సినిమా రంగం నుంచి వెళ్లి ఆ పార్టీకి అండగా నిలబడినవాళ్ళు ఇప్పటి వరకూ లేరనే చెప్పాలి. మరో వైపు చిరంజీవి పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్స్ కి… కావలసినంత గ్లామర్ దొరికింది. తెలుగుదేశం కి మాత్రం సినీ గ్లామర్ కావలసినంత వుంది. అందుకే 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ పార్టీ సినీ గ్లామర్ సమీకరణాల్లో పడింది. ఎప్పటినుంచో పూరి జగన్నాద్…. జగన్ కి చేరువకావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయన జీవిత కధ ఆధారంగా ఓ సినిమా తీయాలని భావించారు. ‘రాజశేఖరరెడ్డి’ అని నామకరణం కూడా చేసారు. అందులో రాజశేఖర్ ని కధానాయకుడిగా ఎంచుకున్నారు. మరెందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. సినిమా ప్లాన్ విజయవంతం కాకపోయినా… జగన్ దృష్టి పూరి పై పడింది. జగన్ సోదరుడు గణేష్ తెలుగుదేశం పార్టీ జండా మోసినవాడే. జగన్ పార్టీ స్థాపించడంతో అటువైపు దూకారు. జగన్ పాదయాత్రలో భాగంగా పూరి స్వగ్రామం వెళ్ళారు.


అప్పటినుంచి జగన్ తో పూరి జగన్నాద్ కుటుంబ స్నేహానికి బీజం పడింది.ఉప ఎన్నికల ప్రచారంలోవిజయలక్ష్మి, షర్మిల  బస… పూరి ఇంట్లోనే. పూరి జగన్నాధ్ ఇంట్లో జరిగిన ఓణీల పండక్కి జగన్ అతిధిగా వచ్చారు. ఆ తరవాత కూడా జగన్ చాలా సందర్భాల్లో వై యస్ కుటుంబం పై తన అభిమానాన్ని ప్రకటించుకున్నారు. “నేను ఇప్పటివరకూ కేవలం 5 సార్లు మాత్రమె దిన పత్రిక చదివాను. వై యస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చివరిసారిగా న్యూస్ పేపర్ చదివాను. ఆ తరవాత నుంచి ఇప్పటివరకూ ముట్టుకోలేదు” అని స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ‘… రాంబాబు’ సినిమా ద్వారా పూరి కి మరో అవకాశం దొరికింది. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర.. దానికి పెట్టిన పేరు వై యస్ ని పోలి వుంటుంది. అంతే కాదు.. వై యస్ పాదయాత్ర గొప్పదనాన్ని కుడా అందులో ఉటంకించారు. రాజశేఖర్ రెడ్డి ప్రధాన రాజకీయ శత్రువు… చంద్రబాబు నాయుడి ని విమర్శించడం పరాకాష్ట. ఈ సినిమా కేవలం రాజశేఖర రెడ్డి ని హీరోగా చూపించడానికి, తెలంగాణాపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి సాకుగా తీసాడని… చిత్ర సీమలో పెద్ద దుమారమే రేగింది. అవన్నీ ఊహాగానాలు కాదనే విషయం క్రమంగా రాష్ట్ర ప్రజలకు బోధ పడుతోంది.2014 ఎన్నికలలో జగన్ పార్టీ తరపున పూరి కుటుంబం ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలూ వున్నాయి. పూరి తమ్ముడు గణేష్ కి నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం.


అందుకోసం గణేష్ ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దాని కంటే పూరి భార్య లావణ్య కు అనకాపల్లి యం.పీ సీటు ఇస్తే మంచిదని జగన్ పార్టీ భావిస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో చివరి నిమిషాల్లో స్వయంగా పూరి జగన్నాద్ రంగంలోకి దిగినా షాక్ కి గురి కావలసిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లోనే కాదు…. రాజకీయాల్లోనూ ఏదైనా జరగొచ్చు. మొత్తమ్మీద అనకాపల్లి పార్లమెంట్ పై జగన్ పార్టీ ముందస్తు దృష్టి పెడుతోంది. దానికి… పూరి జగన్నాద్ సినీ ఇమేజ్ ని అస్త్రంగా వాడుతోంది. మరి… ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే… కొన్నాళ్ళు నిరీక్షించాల్సిందే.

Wednesday, November 21, 2012

ముంబై పేలుళ్ల ఘటనలో నిందితుడైన కసబ్‌కు ఉరిశిక్ష అమలు


కసబ్ ఉరిశిక్షను ధృవీకరించిన మహారాష్ట్ర హోంశాఖ

ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ ను బుధవారం ఉదయం పూణే సమీపంలోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. కసబ్ ఉరిశిక్షను మహారాష్ట్ర హోంశాఖ అధికారులు ధృవీకరించారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ నుంచి ఈ ఉదయం రహస్యంగా పూణేలోని ఎర్రవాడ జైలుకు తరలించారు.
2008 నవంబర్ 26 తేదిన ముంబైలో మారణహోమం సృష్టించిన సంఘటనలో కసబ్ కీలక సూత్రధారి. ముంబై పేలుళ్ల తర్వాత కసబ్ పట్టుబడ్డారు. ఈ ఘటనలో వందలాది మంది మృతికి కారణమయ్యారు. భారత్ లో కల్లోలం సృష్టించడానికి పాకిస్థాన్ పన్నిన కుట్ర.. కసబ్ దొరకడం వల్లనే బట్టబయలైంది. 
* 26/11 దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 
* ముంబైపైలో మారణహోమంలో పాకిస్థాన్ కు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. 
* 2008 లో పట్టుబడిన లష్కరే తోయిబాకు చెందిన కసబ్ ను ముంబైలని ఆర్థర్ రోడ్ జైలులోని బుల్లెట్ ఫ్రూఫ్ జైలు గదిలో ఉంచారు. 
* ఫిబ్రవరి 21 తేదిన బాంబే హైకోర్టు కసబ్ కు ఉరిశిక్ష విధించింది
* కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను నవంబర్ 5 తేదిన ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు.



Tuesday, November 20, 2012

ఐపీఎస్ ల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


పీఎస్ బదిలీల జీవోను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఉత్కంఠతో కొనసాగిన ఐపీఎస్ ల జీవోల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ల బదిలీల జీవోపై సంతకం  చేశారు. రాష్ట్రంలో 43మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఏసీబీ మాజీ డీజీ భూపతిబాబుకు అప్రాధాన్యత పోస్టు లభించింది.
విశాఖ పోలీస్ కమీషనర్ గా శివధర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీగా టి.కృష్టంరాజు, ఏసీబీ డైరెక్టర్ గా విశ్వజిత్, వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్రా గ్రేహౌండ్స్ కు బదిలీ చేసింది. రైల్వే శాఖ అదనపు డీజీగా భూపతిబాబు, సీబీఐ అదనపు డైరెక్టర్ గా కృష్ణప్రసాద్, సీఐడీ డీఎస్పీ రమణమూర్తి ఫైర్ సర్వీస్ కు బదిలీ చేసింది.
విజిలెన్స్ ఐజీగా కె.సత్యనారాయణ ఎల్బీనగర్ డీసీపీగా రవివర్మ, హైదరాబాద్ క్రైమ్ అదనపు కమీషనర్ గా సందీప్ శాండిల్య, గుంటూరు రేంజ్ ఐజీగా రవిగుప్త, పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ గా ఈ.దామోదర్ ఏపీఎస్సీ బెటాలియన్ ఐజీగా కే.ఆర్ .ఎం.కిషోర్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా టీ.పీ.దాస్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా శివశంకర్ రెడ్డిని,విశాఖ పోలీస్ కమీషనర్ గా పని చేసిన పూర్ణచంద్రరావును  శాంతిభద్రతల విభాగం ఐజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Saturday, November 17, 2012

దువ్వాడ రైల్వేస్టేసన్ లో ఒక మహిళ ట్రైన్ లో పడి మ్రుతిచెందింథి


స్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఒక మహిళ దువ్వాడ రైల్వేస్టేసన్ లో శనివారం ఉదయం ఎక్కుతుండగా ట్రైన్ కదిలిపోయింథి దీంతో ఆమె పట్టాలపై పడి అక్కడకక్కడే మ్రుతిచెందింది.

Thursday, November 8, 2012

పలువురు రూరల్ జిల్లానాయుకులు హర్సం వ్యక్తం చేస్తున్నారు......

జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి దక్కడం తో పలువురు రూరల్  మరియు గ్రేటర్ జిల్లానాయుకులు హర్సం వ్యక్తం చేస్తున్నారు ముక్యంగా జి వి ఎమ్ సి 56వ వార్డ్ మాజీ కార్పోరేటర్ దుళ్ళలక్శ్మిఆవార్డ్ఇన్ చార్జ్, దుళ్ళరామునాయుడు,గొన్నబొర్రయ్యనాయ్డు,(జిబినాయుడు), బొబ్బరనారయణరావు,అట్టాసన్యాసిఅప్పారావు కొలిపాక అప్పరావు, గొళ్ళవిల్లి శ్రీనువాసురావు,అప్పికొండ మహాలక్శ్మి నాయుడు ,సాలాపు వెంకటాప్పారావు,దాసరి విజయాదిత్య, సి హెచ్ రామారావు ,సక్సెస్ న్యూస్ ఎడిటర్ ఎమ్ ఎ రాజు (బాబు)లు హర్సం వ్యక్తం చేసారు, నగేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీని నియమించారు. ధర్మశ్రీ 2004లో మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకూ కొనసాగారు. 

డీసీసీ అధ్యక్షునిగా కరణం ధర్మశ్రీ


జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి దక్కాయి. ప్రస్తుత ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుడు తోట నగేష్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల అధ్యక్షులను మారుస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ జాబితాలో విశాఖ జిల్లా కూడా వుంది. నగేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీని నియమించారు. ధర్మశ్రీ 2004లో మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకూ కొనసాగారు. 2009లో చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అక్కడి టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ను యధావిధిగా కొనసాగిస్తున్నారు. 



Wednesday, November 7, 2012

విశాఖ :పలుచోట్ల పొంగి ప్రవహిస్తున్న వాగులు




విశాఖ : భీమిలి మండలంలో చిప్పాడ వద్ద రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న ఉప్పుటేరు – జలదిగ్భందంలో మూలకద్దు, చిప్పాడ, సిటీనగర్, పాతపాలెం, జీరుపేట గ్రామాలు

• విశాఖ : పద్మనాభ మండలంలో పలుచోట్ల పొంగి ప్రవహిస్తున్న వాగులు, 5వేల ఎకరాల్లో వరి, బంతి, బొప్పాయి పంటలకు ముప్పు
• విశాఖ : మునగపాక మండలంలో కనపర్తి, చూసుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం గ్రామాలు జలదిగ్భందంలో – సహాయం కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్న 5వేల మంది బాధితులు

• అచ్యుతాపురం మండలంలో జలదిగ్బందంలో చిక్కుకున్న పెదపాడు, కాజీపాలెం, జగ్గన్నపేట – పూరిటిగడ్డ వద్ద తగ్గని వరద ఉద్ధృతి, నిన్నటి నుంచి పొలాల్లోనే 25మంది రైతులు
• విశాఖ : చోడవరం మండలం భోగాపురం వద్ద శారద నది వరద నీటిలో చిక్కుకున్న 8మంది రైతులు – చోడవరం మం. పీ.ఎస్.పేట సమీపంలో పెబ్బేరు గడ్డ వరద ఉద్ధృతి, మూడ్రోజులుగా చిక్కుకున్న 5గురు రైతులు

Tuesday, November 6, 2012

పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా


కోస్తాంధ్ర ప్రాంతాంలో భారీ వర్షాల కారణంగా పాలిటెక్నిక్‌ విద్యార్థులను సోమ, మంగళవారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు సాంకేతిక విద్య శిక్షణ సంస్త ( ఎన్‌బీటీఈటీ) కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నుంచి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు

Friday, November 2, 2012

ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరనిలోటు


ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరనిలోటు

ర్రన్నాయుడు మృతి తెలుగు దేశం పార్టీకి తీరని లోటు అని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు మరణ వార్త విన్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఎర్రన్నాయుడును కోల్పోవటం తన కుడి భుజాన్ని కోల్పోయినట్లు అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మిత్రుడు, సహచరుడుని కోల్పోయామన్నారు. 

ఆయన లేరనే దుర్వార్త వినటం చాలా దురదృష్టకరమన్నారు. రాజకీయ ఎంత ఉన్నత పదవులు ఉన్నా అణిగి ఉండే వ్యక్తి అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎర్రన్నాయుడు మృతి పట్ల ఆయన కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజల కోసం అంకిత భావంతో పని చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని, పార్టీకి ఏకష్టం వచ్చినా అండగా నిలిచారన్నారు.

ఎర్రన్నాయుడుకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబునాయుడు తన పాదయాత్రను రద్దు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పెద్దచింతకుంట నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అక్కడ నుంచి విమానంలో శ్రీకాకుళం వెళ్లనున్నారు. 

Tuesday, October 23, 2012

అసలు ఈ యాత్రలు ఎవరికోసం...!!?


అసలు ఈ యాత్రలు ఎవరికోసం...!!? 
ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వారి కష్టాలకు పాలకులే కారణం.. మేము అధికారంలోకి వస్తే అందరి కష్టాలు తీరుస్తాం.... గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కష్టాలు పెంచారు. ఎలా తీరుస్తారు. అనేదానికి సమాధానం లేదు. నయాఉదారవాద విధానాలను మాజీ ప్రధాని పివి నర్సింహారావు ఆధ్యుడయితే ఆంధ్రప్రదేశ్‌లో అమలు వేగంగా జరిగేందుకు నారాచంద్రబాబు నాయుడు ఆజ్యం పోశారు. అందులో భాగంగానే విద్యుత్‌ను విభజించి ప్రయివేట్‌ పరం చేసి ఛార్జీలు పెంచుకోవడానికి అవకాశామిచ్చారు. రైతుల రుణాలు పెరగడానికి ప్రధాన కారకులయ్యారు. సంస్కరణల పుణ్యమాని వృత్తులన్నీ నాశనమయ్యాయి. వీటన్నింటికీ కారకుడు చంద్రబాబునాయుడని ప్రచారం చేసుకుని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో దోపిడీ దొంగలందరూ ఏకమై రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. అత్యధికంగా ఆయన కుమారుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్నాడని జైల్లో పెట్టారు. ఐదుగురు మంత్రులు కూడా ఆ ఉచ్చులో ఇరుకున్నారు. అది జగమెరిగిన సత్యంగా ప్రచారం జరిగింది. ఒక పార్టీ పెట్టుకుంటే ప్రజలను పోగేసుకుంటే తప్పులన్నీ మాఫీ అవుతాయని వైఎస్‌ఆర్‌సిపి అనే పేరుతో పార్టీని ప్రారంభించారు. అయినా కటకటాలు తప్పలేదు. మేమున్నాం.... మిమ్ములను ఆదుకుంటాం.... మమ్ములను ఆదరించండని పాదయాత్రలు చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గాంధీజయంతి సందర్భంగా ప్రారంభించారు. అక్టోబర్‌ 18 నుంచి వైఎస్‌సిపి నేత షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. అయితే గతంలో నాశనం చేశావు.. మరో అవకాశం ఇస్తే నాశనం చేయరనే నమ్మమేముంది. అనేతరహాలో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా గతంలో రాష్ట్రాన్ని లూటీ చేశారు. మరో అవకాశం ఇస్తే లూటీ చేయరా అని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల పట్ల ఉండరా అనేది ఆలోచించాలి.
జనం ఎవరి వెంట ఎక్కువ పోతారు?
            సంస్కరణలను ఆపేయండి లేదా... ధరలను తగ్గించండి....పేదలకు భూములు పంచండి. అవినీతిని అరికట్టండి... ప్రస్తుతం ప్రజలను పట్టి పీడిస్తున్న తెలంగాణా, సమైక్యాంధ్ర సమస్యలకు పరిష్కారం చూపుతాం. ఇలా ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని పాదయాత్ర చేసే వారి వెంట ఎక్కువ మంది ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. విధానమేంటనేది చెప్పకుండా వెళ్లే వారిని ప్రజలు ఎలా నమ్ముతారు?. 

Friday, October 19, 2012

అన్‌రాక్ పై మా పోరాటం ఆగదు...!!?



అన్‌రాక్ పై మా పోరాటం ఆగదు...!!?
న్‌రాక్ నిర్వాసితులు, కార్మికుల సమస్యలను పరిష్కరించేవరకు యాజమాన్యంపై పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అన్‌రాక్ యాజమన్యం తీరును నిరసిస్తూ, నిర్వాతుల, కార్మికుల సమస్యలపై తన కుమారుడు విజయ్ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ కలిసి తామరం నుంచి విశాఖకు చేపట్టిన పాదయాత్రను కామేశ్వరమ్మ గుడి వద్ద అయ్యన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అన్‌రాక్ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్‌రాక్ కంపెనీ వల్ల రానున్న రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. అదే విధంగా ప్రజలు పలురకాల వ్యాధులబారిన పడతారని అందోళన వ్యక్తం చేశారు.
అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ మాట్లాడుతూ, అన్‌రాక్ వద్ద పక్కనే వున్న ఏలేరు నీరు కలుషితమై విశాఖ వాసులు కూడా రోగాలబారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అన్‌రాక్ కంపెనీపైనే కాకుండా కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు, నిర్వాతులు, కార్మికుల సమస్యలపై అన్ని కంపెనీలపైనా పోరాటాలు చేస్తామన్నారు.ఈ పాదయాత్రలో మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాధంశెట్టి నీలబాబు,కోమటి వెంకటరావు,రౌతు శ్రీనువాసురావు బొడ్డపల్లి అప్పారావులు తో పాటు, దానబోయిన నీలకంటరావు గొల్లవిల్లి నాగరాజు తదితరులుఉన్నారు. కొంతదూరం వరకు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ టీడీపీ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు, స్థానిక మండల టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి విళ్ళా రామ మోహనరావు,  గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల నాయకులు, కార్యకర్తలు, అన్‌రాక్ నిర్వాసితులు పాల్గొన్నారు.



Friday, October 12, 2012

తాడి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్


తాడి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ 

వహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విడుదల చేస్తున్న కాలుష్యం కారణంగా అవస్థలు పడుతున్న తాడి గ్రామాన్నితేది11-10-2012 గురువారం జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి సందర్శించారు. ఫార్మాసిటీ అనుకుని ఉన్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని గత మూడేళ్లగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తేది 08-10-2012 సోమవారం అర్థరాత్రి తాడి బీసీకాలనీకి అనుకుని ఉన్న ఆక్టస్ ఫార్మా లిమిటెడ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తాడి ప్రజలను పరుగులు తీయించిన విషయం తెలిసిందే.దీంతో మరుసటి రోజు మంగళవారం ఉదయం తాడి గ్రామస్థులు ఫార్మాసిటీలో ధర్నా చేయడం,తేది 10-10-2012 బుధవారం మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి నేతృత్వంలో తాడి గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆ ఆందోళన వివాదానికి దారి తీసింది. ఆందోళనలో పాల్గొన్న టిడిపి నేతలు బండారు సత్యనారాయణమూర్తి, మాధంశెట్టి నీలబాబు,కోమటి వెంకటరావు, బొడ్డపల్లి అప్పారావులోపాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే వివాదం రోజురోజుకు జటిలమోవుతుంది. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ వి.శేషాద్రితోపాటు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎపిఐఐసిఇడి సత్యనారాయణరావు, ఆర్డీవో రంగయ్య, ఎపిఐఐసి జోనల్ మేనేజర్‌తోపాటు ఉన్నతస్థాయి అధికారులు తాడి గ్రామాన్ని సందర్శించారు. కలెక్టర్ శేషాద్రి తాడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాడి గ్రామానికి అనుకుని ఔషధ కంపెనీలను నిర్మించారన్నారు. దీనికారణంగా తాడి ప్రజలు కాలుష్యం బారిన పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. మంచినీటి వనరులు కలుషితమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. తాడి గ్రామం తరలింపు అధికారులు, రాంకీ యాజమాన్యం ఇచ్చిన హామీలను వివరించారు. రాంకీ యాజమాన్యం నిర్మించిన ల్యాండ్‌ఫిల్‌ను గురించి తెలియజేశారు.

మా ప్రాణాలను కాపాడండి.. కలెక్టర్ కాళ్ళు పట్టుకున్న ప్రజలు

ఫార్మాసిటీ విడుదల చేస్తున్న కాలుష్యం, జరుగుతున్న సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయని తాడి గ్రామస్థులు కలెక్టర్‌కు తెలియజేశారు. నిత్యం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి నెలకొందన్న విషయాన్ని ప్రజలు కలెక్టర్ శేషాద్రి కాళ్లపై పడి చెప్పారు. కాలుష్యం కారణంగా తాడి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని తెలియజేశారు. దీనిపై స్పందించి తాడి ప్రజలకు ప్రాణబిక్ష పెట్టాలని వారంతా కోరారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్యలను పూర్తిగా పరిశీలిస్తామన్నారు. దీనిపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తాడి ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంట్లో కలెక్టర్ రాంకీ యాజమాన్యం నిర్మించిన ల్యాండ్‌ఫిల్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట అధికారులు ఎల్.విజయసారధి, బి.వెంకటేశ్, నేతలు మాధంశెట్టి నీలబాబు, బొడ్డపల్లి అప్పారావు పాలవలస అప్పలాచారి దానబోయిన నీలకంటరావు గొల్లవిల్లి నాగరాజు తదితరులుఉన్నారు.

Tuesday, October 9, 2012

ఫార్మాసిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం


విశాఖ : పరవాడ ఫార్మాసిటీ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం అర్థరాత్రి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం జరగటంతో తాడి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఫార్మా కంపెనీలను జనావాసాల నుంచి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విధులకు వెళుతున్న అయిదు కంపెనీల కార్మికులను అడ్డుకున్నారు. అంతే కాకుండా రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.








Monday, September 24, 2012

Chandrika Slideshow Slideshow

Chandrika Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Chandrika Slideshow Slideshow ★ to Visakhapatnam. Stunning free travel slideshows on TripAdvisor

Friday, September 21, 2012

టీ టి డి ఈవో, ఛైర్మన్ (కంకణం) మధ్య వివాదం


టీ టి డి ఈవో, ఛైర్మన్ (కంకణం) మధ్య వివాదం

ప్తగిరులు బ్రహ్మోత్సవ శోభతో విరాజిల్లుతున్నాయి. వెంకన్న నామస్మరణతో ఏడుకొండలు మార్మోగుతున్నాయి. గోవిందా నీవే దిక్కంటూ శేషాచలంలో కోలాహలం సంతరించుకుంది. అదే సమయంలో వివాదాలూ రచ్చకెక్కుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కంకణధారణ కలకలం రేపింది. ఇంతకూ ఏం జరిగింది? 

కంకణధారణపై ఈవో, ఛైర్మన్  మధ్య వివాదం
బ్రహ్మోత్సవాలకు ఈవో కంకణం కట్టుకోవడం ఆనవాయితీ
దీక్షతోనూ, నిష్ఠతోనూ నిర్వహిస్తామని స్వామి ఎదుట ప్రమాణం
సీఎం పర్యటనలో కంకణం కట్టుకున్న బాపిరాజు
ఇద్దరికి కంకణం కట్టడం ఆనవాయితీ కాదు
కంకణం ఉన్నా లేకున్నా ఉత్సవాల్లో పాల్గొంటానన్న ఈవో
నియమాలు తెలియవంటున్న బాపిరాజు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడంటే అందరికీ భక్తిభావమే. వేంకటేశుని దివ్య మంగళ స్వరూపం చాడాలన్న తపనతో ఏడుకొండలెక్కిన ప్రతి ఒక్కరిలోనూ ఆధ్మాత్మిక చింతనే. మాములు రోజుల్లోనే కిటకిటలాడే సప్తగిరులు... బ్రహ్మోత్సవాల సమయంలో మరింత హోరెత్తుతాయి. గోవిందా నామ స్మరణతో మార్మోగుతాయి. పద్మావతి వల్లభుని దర్శించి తరించాలన్న ప్రతి భక్తిని మది.... భక్తిభావంతో పొంగిపొర్లుతుంది. హృదయం నిండా అడుగడుగు దండాల వాడినే నింపుకొని తన్మయత్వంతో తపన పడే ప్రతి ఒక్కరూ తిరుమలగిరులపై ఎక్కడ చూసినా కనిపిస్తారు. గోవిందుడు అందరి వాడేలే అంటూ గొంతెత్తుతారు.  ఇంతటి ఆధ్మాత్మిక  క్షేత్రంలో ఇంతటి పరమ పుణ్యక్షేత్రంలో తరుచూ వివాదాలు చెలరేగడం సగటు భక్తుని ఆవేదనకు గురిచేస్తోంది.

బ్రహ్మోత్సవాల సమయంలో కంకణధారణపై టీటీడీ ఛైర్మన్ , ఈవోల మధ్య రాజుకున్న వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారడమే విడ్డూరం. సాధారణంగా ఆలయ ఉన్నతాధికారి శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణదారుడిగా కంకణం కట్టుకోవడం ఆనవాయితీ. ధ్వజారోహణం తర్వాత స్వామి వారి ఉత్సవాలను అకుంఠిత దీక్షతోనూ, నిష్టగా నిర్వహిస్తామని శ్రీవారి ఎదుట ప్రమాణం చేసి తిరుమలను వదలి వెళ్లకుండా ఉత్సవాలను నిర్వహించడం పరిపాటి. కానీ ఈసారి టీటీడీ ఛైర్మన్  కనుమూరి బాపిరాజు కంకణం కట్టించుకోవడమే అసలు వివాదానికి కారణం. ముఖ్యమంత్రి పర్యటనలో ఉండగానే బాపిరాజు ఆలయంలోకి వెళ్లి కంకణం కట్టించుకోవడం ఈఓకు కోపం తెప్పించింది.

బ్రహ్మోత్సవాల నిర్వహణాధికారులు ఇద్దరు కంకణం కట్టించుకోవాలని తొలత భావించినా ఆగమశాస్త్రం నిభంధనలు అడ్డురావడంతో ఈఓ వెనక్కి తగ్గారు. తాను కంకణం కట్టించుకున్నా.. లేకపోయినా స్వామి సేవల్లో నిష్ఠగా పాల్గొంటానని ఈవో అంటున్నారు. దీనిపై బాపిరాజు కూడా వివరణ ఇచ్చారు. తనకు ఎలాంటి నియమాలు తెలియవని.. ఆలయ సిబ్బంది వచ్చి తనను కంకణ మహోత్సవానికి అహ్వానించారని చెప్పారు. గతంతో కొంత మంది ఛైర్మన్లు బ్రహ్మోత్సవాలకు కంకణం కట్టించుకోని నిర్వహణదారులుగా వ్యవహారించారని చెప్పడంతో తానూ అసక్తి చూపానన్నారు.  మొత్తానికి కిందటేడాది బ్రహ్మోత్సవాల్లో కలసికట్టుగా ఆడిపాడిన ఛైర్మన్ , ఈవోలు ఈసారి ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. ఇద్దరి మధ్య కంకణ వివాదం కలకలం రేపింది.

Thursday, September 20, 2012

భారత్ బంద్


కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా గురువారం భారత్ బంద్‌లో భాగంగా దేశవ్యాప్త ప్రదర్శనలు, ధర్నాలు సాగుతున్నాయి. ఢిల్లీలో పెద్దఎత్తున జరిగే ధర్నాలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ కరత్, సురవరం సుధాకరరెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ లు ఆద్వర్యంలో జరుగుతుంథి. బీజేడీ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్ తదితర పార్టీల నేతలూ హాజరవుతారు. యూపీఏకి మద్దతిస్తున్న ములాయం వామపక్షాలు, చంద్రబాబుతో జతకట్టి ధర్నా చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.




రాష్ట్రంలో కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలు బంద్‌కు సై అన్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ బంద్‌లో పాల్గొన్నాయి. వైసీపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. ఉదయం ఐదు గంటల నుంచే బస్సులను అడ్డుకున్నారు 

Monday, September 10, 2012

ఉప్పుటేరులో గట్టును తొగించిన అధికారులు







విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెం ఉప్పుటేరుకు అడ్డంగా వేసిన గట్టును సోమవారం రెవెన్యూ,పోలీసు అధికారులు తొలగించారు.సింహాద్రి ఎన్టీపీసీలో ఉపాది కల్పించాలని కోరుతూ మత్య్సకారులు ఇరవై ఆరురోజులు క్రితం ఉప్పుటేరుకు అడ్డంగా గట్టు వేసిన సంగతి తెలిసిందే  దీంతో పంటపొలాలు చేపలు చెరువులు ముంపునకు గురయ్యాయి ఆర్డీవో  మత్య్సకారులుతో పలు దపాలు చర్చలు జరిపి నప్పటకీ పలితం లేకపోవడంతో భారీపోలీస్ బంధోబస్తుతో గట్టును తొలగించారు.అడ్డుకున్న మత్య్సకారులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆర్డీవో రంగయ్య ,ఎసిపి రవిబాబు ఆద్వర్యంలో ముత్యాలమ్మపాలెం మత్స్యకార గ్రామాన్ని పోలీస్ బలగాలు  ఆధీనంలోకి తీసుకున్నాయి. భారీగా సాయుధ బలగాలను మోహరించారు. పోలీస్ ఉన్నతాధికారులు ముత్యాలమ్మపాలెం గ్రామాన్ని  సందర్శించారు. సుమారు 25 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 50 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఏడు వందల మంది సిబ్బందిని ముత్యాలమ్మపాలెంలో మోహరించారు. నలుగురు ఎసిపిలు తో బలగాలను పర్యవేక్షిస్తున్నారు. వాటితోపాటు రైఫిల్, గ్యాస్ పార్టీలను రప్పించారు. వజ్రా 207 వాహనాన్ని సిద్ధం చేశారు. అనకాపల్లి అగ్నిమాపక కేంద్రం శకటాన్ని సిద్ధం చేశారు. ముత్యాలమ్మపాలెంలో ప్రతిచోట వైర్‌లెస్ సెట్‌లను ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తానికి వీడియో, ఫోటో గ్రాఫర్లను సిద్ధం చేసి గట్టును తొలగించారు..