Wednesday, November 28, 2012

జగన్ గూటికి… పూరి ‘జగన్’!



క్సెస్ న్యూస్  చెప్పింది…. అక్షరం పొల్లు పోలేదు. ‘పూరి జగన్.. జగన్ మనిషా...?అని  ఇదివరకే విశ్లేషనాత్మక కథను  రచించింథి. జగన్ అడుగులకు మడుగులు వత్తుతూ… జగన్ పిలుపు కోసం కళ్ళు కాయలు కాచేలా ‘పూరి జగన్’ కుటుంబం ఎదురు చూస్తోందని సక్సెస్ న్యూస్ చెప్పింథి. వై యస్ జగన్ కుటుంబంపై తన సానుభూతిని, అభిమానాన్ని తెలియపరచడానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని ఓ ఆయుధంలా పూరి వాడుకున్నాడని సక్సెస్ న్యూస్ వ్యక్తం చేసింది. పూరి జగన్నాద్ కుటుంబం జగన్ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది.వై యస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీకి ఎప్పటినుంచో సినీ గ్లామర్ కొరత. సినిమా రంగం నుంచి వెళ్లి ఆ పార్టీకి అండగా నిలబడినవాళ్ళు ఇప్పటి వరకూ లేరనే చెప్పాలి. మరో వైపు చిరంజీవి పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్స్ కి… కావలసినంత గ్లామర్ దొరికింది. తెలుగుదేశం కి మాత్రం సినీ గ్లామర్ కావలసినంత వుంది. అందుకే 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ పార్టీ సినీ గ్లామర్ సమీకరణాల్లో పడింది. ఎప్పటినుంచో పూరి జగన్నాద్…. జగన్ కి చేరువకావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయన జీవిత కధ ఆధారంగా ఓ సినిమా తీయాలని భావించారు. ‘రాజశేఖరరెడ్డి’ అని నామకరణం కూడా చేసారు. అందులో రాజశేఖర్ ని కధానాయకుడిగా ఎంచుకున్నారు. మరెందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. సినిమా ప్లాన్ విజయవంతం కాకపోయినా… జగన్ దృష్టి పూరి పై పడింది. జగన్ సోదరుడు గణేష్ తెలుగుదేశం పార్టీ జండా మోసినవాడే. జగన్ పార్టీ స్థాపించడంతో అటువైపు దూకారు. జగన్ పాదయాత్రలో భాగంగా పూరి స్వగ్రామం వెళ్ళారు.


అప్పటినుంచి జగన్ తో పూరి జగన్నాద్ కుటుంబ స్నేహానికి బీజం పడింది.ఉప ఎన్నికల ప్రచారంలోవిజయలక్ష్మి, షర్మిల  బస… పూరి ఇంట్లోనే. పూరి జగన్నాధ్ ఇంట్లో జరిగిన ఓణీల పండక్కి జగన్ అతిధిగా వచ్చారు. ఆ తరవాత కూడా జగన్ చాలా సందర్భాల్లో వై యస్ కుటుంబం పై తన అభిమానాన్ని ప్రకటించుకున్నారు. “నేను ఇప్పటివరకూ కేవలం 5 సార్లు మాత్రమె దిన పత్రిక చదివాను. వై యస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చివరిసారిగా న్యూస్ పేపర్ చదివాను. ఆ తరవాత నుంచి ఇప్పటివరకూ ముట్టుకోలేదు” అని స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ‘… రాంబాబు’ సినిమా ద్వారా పూరి కి మరో అవకాశం దొరికింది. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర.. దానికి పెట్టిన పేరు వై యస్ ని పోలి వుంటుంది. అంతే కాదు.. వై యస్ పాదయాత్ర గొప్పదనాన్ని కుడా అందులో ఉటంకించారు. రాజశేఖర్ రెడ్డి ప్రధాన రాజకీయ శత్రువు… చంద్రబాబు నాయుడి ని విమర్శించడం పరాకాష్ట. ఈ సినిమా కేవలం రాజశేఖర రెడ్డి ని హీరోగా చూపించడానికి, తెలంగాణాపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి సాకుగా తీసాడని… చిత్ర సీమలో పెద్ద దుమారమే రేగింది. అవన్నీ ఊహాగానాలు కాదనే విషయం క్రమంగా రాష్ట్ర ప్రజలకు బోధ పడుతోంది.2014 ఎన్నికలలో జగన్ పార్టీ తరపున పూరి కుటుంబం ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలూ వున్నాయి. పూరి తమ్ముడు గణేష్ కి నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం.


అందుకోసం గణేష్ ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దాని కంటే పూరి భార్య లావణ్య కు అనకాపల్లి యం.పీ సీటు ఇస్తే మంచిదని జగన్ పార్టీ భావిస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో చివరి నిమిషాల్లో స్వయంగా పూరి జగన్నాద్ రంగంలోకి దిగినా షాక్ కి గురి కావలసిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లోనే కాదు…. రాజకీయాల్లోనూ ఏదైనా జరగొచ్చు. మొత్తమ్మీద అనకాపల్లి పార్లమెంట్ పై జగన్ పార్టీ ముందస్తు దృష్టి పెడుతోంది. దానికి… పూరి జగన్నాద్ సినీ ఇమేజ్ ని అస్త్రంగా వాడుతోంది. మరి… ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే… కొన్నాళ్ళు నిరీక్షించాల్సిందే.

Wednesday, November 21, 2012

ముంబై పేలుళ్ల ఘటనలో నిందితుడైన కసబ్‌కు ఉరిశిక్ష అమలు


కసబ్ ఉరిశిక్షను ధృవీకరించిన మహారాష్ట్ర హోంశాఖ

ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ ను బుధవారం ఉదయం పూణే సమీపంలోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. కసబ్ ఉరిశిక్షను మహారాష్ట్ర హోంశాఖ అధికారులు ధృవీకరించారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ నుంచి ఈ ఉదయం రహస్యంగా పూణేలోని ఎర్రవాడ జైలుకు తరలించారు.
2008 నవంబర్ 26 తేదిన ముంబైలో మారణహోమం సృష్టించిన సంఘటనలో కసబ్ కీలక సూత్రధారి. ముంబై పేలుళ్ల తర్వాత కసబ్ పట్టుబడ్డారు. ఈ ఘటనలో వందలాది మంది మృతికి కారణమయ్యారు. భారత్ లో కల్లోలం సృష్టించడానికి పాకిస్థాన్ పన్నిన కుట్ర.. కసబ్ దొరకడం వల్లనే బట్టబయలైంది. 
* 26/11 దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 
* ముంబైపైలో మారణహోమంలో పాకిస్థాన్ కు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. 
* 2008 లో పట్టుబడిన లష్కరే తోయిబాకు చెందిన కసబ్ ను ముంబైలని ఆర్థర్ రోడ్ జైలులోని బుల్లెట్ ఫ్రూఫ్ జైలు గదిలో ఉంచారు. 
* ఫిబ్రవరి 21 తేదిన బాంబే హైకోర్టు కసబ్ కు ఉరిశిక్ష విధించింది
* కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను నవంబర్ 5 తేదిన ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు.



Tuesday, November 20, 2012

ఐపీఎస్ ల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


పీఎస్ బదిలీల జీవోను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఉత్కంఠతో కొనసాగిన ఐపీఎస్ ల జీవోల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ల బదిలీల జీవోపై సంతకం  చేశారు. రాష్ట్రంలో 43మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఏసీబీ మాజీ డీజీ భూపతిబాబుకు అప్రాధాన్యత పోస్టు లభించింది.
విశాఖ పోలీస్ కమీషనర్ గా శివధర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీగా టి.కృష్టంరాజు, ఏసీబీ డైరెక్టర్ గా విశ్వజిత్, వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్రా గ్రేహౌండ్స్ కు బదిలీ చేసింది. రైల్వే శాఖ అదనపు డీజీగా భూపతిబాబు, సీబీఐ అదనపు డైరెక్టర్ గా కృష్ణప్రసాద్, సీఐడీ డీఎస్పీ రమణమూర్తి ఫైర్ సర్వీస్ కు బదిలీ చేసింది.
విజిలెన్స్ ఐజీగా కె.సత్యనారాయణ ఎల్బీనగర్ డీసీపీగా రవివర్మ, హైదరాబాద్ క్రైమ్ అదనపు కమీషనర్ గా సందీప్ శాండిల్య, గుంటూరు రేంజ్ ఐజీగా రవిగుప్త, పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ గా ఈ.దామోదర్ ఏపీఎస్సీ బెటాలియన్ ఐజీగా కే.ఆర్ .ఎం.కిషోర్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా టీ.పీ.దాస్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా శివశంకర్ రెడ్డిని,విశాఖ పోలీస్ కమీషనర్ గా పని చేసిన పూర్ణచంద్రరావును  శాంతిభద్రతల విభాగం ఐజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Saturday, November 17, 2012

దువ్వాడ రైల్వేస్టేసన్ లో ఒక మహిళ ట్రైన్ లో పడి మ్రుతిచెందింథి


స్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఒక మహిళ దువ్వాడ రైల్వేస్టేసన్ లో శనివారం ఉదయం ఎక్కుతుండగా ట్రైన్ కదిలిపోయింథి దీంతో ఆమె పట్టాలపై పడి అక్కడకక్కడే మ్రుతిచెందింది.

Thursday, November 8, 2012

పలువురు రూరల్ జిల్లానాయుకులు హర్సం వ్యక్తం చేస్తున్నారు......

జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి దక్కడం తో పలువురు రూరల్  మరియు గ్రేటర్ జిల్లానాయుకులు హర్సం వ్యక్తం చేస్తున్నారు ముక్యంగా జి వి ఎమ్ సి 56వ వార్డ్ మాజీ కార్పోరేటర్ దుళ్ళలక్శ్మిఆవార్డ్ఇన్ చార్జ్, దుళ్ళరామునాయుడు,గొన్నబొర్రయ్యనాయ్డు,(జిబినాయుడు), బొబ్బరనారయణరావు,అట్టాసన్యాసిఅప్పారావు కొలిపాక అప్పరావు, గొళ్ళవిల్లి శ్రీనువాసురావు,అప్పికొండ మహాలక్శ్మి నాయుడు ,సాలాపు వెంకటాప్పారావు,దాసరి విజయాదిత్య, సి హెచ్ రామారావు ,సక్సెస్ న్యూస్ ఎడిటర్ ఎమ్ ఎ రాజు (బాబు)లు హర్సం వ్యక్తం చేసారు, నగేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీని నియమించారు. ధర్మశ్రీ 2004లో మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకూ కొనసాగారు. 

డీసీసీ అధ్యక్షునిగా కరణం ధర్మశ్రీ


జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి దక్కాయి. ప్రస్తుత ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుడు తోట నగేష్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల అధ్యక్షులను మారుస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ జాబితాలో విశాఖ జిల్లా కూడా వుంది. నగేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీని నియమించారు. ధర్మశ్రీ 2004లో మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకూ కొనసాగారు. 2009లో చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అక్కడి టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ను యధావిధిగా కొనసాగిస్తున్నారు. 



Wednesday, November 7, 2012

విశాఖ :పలుచోట్ల పొంగి ప్రవహిస్తున్న వాగులు




విశాఖ : భీమిలి మండలంలో చిప్పాడ వద్ద రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న ఉప్పుటేరు – జలదిగ్భందంలో మూలకద్దు, చిప్పాడ, సిటీనగర్, పాతపాలెం, జీరుపేట గ్రామాలు

• విశాఖ : పద్మనాభ మండలంలో పలుచోట్ల పొంగి ప్రవహిస్తున్న వాగులు, 5వేల ఎకరాల్లో వరి, బంతి, బొప్పాయి పంటలకు ముప్పు
• విశాఖ : మునగపాక మండలంలో కనపర్తి, చూసుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం గ్రామాలు జలదిగ్భందంలో – సహాయం కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్న 5వేల మంది బాధితులు

• అచ్యుతాపురం మండలంలో జలదిగ్బందంలో చిక్కుకున్న పెదపాడు, కాజీపాలెం, జగ్గన్నపేట – పూరిటిగడ్డ వద్ద తగ్గని వరద ఉద్ధృతి, నిన్నటి నుంచి పొలాల్లోనే 25మంది రైతులు
• విశాఖ : చోడవరం మండలం భోగాపురం వద్ద శారద నది వరద నీటిలో చిక్కుకున్న 8మంది రైతులు – చోడవరం మం. పీ.ఎస్.పేట సమీపంలో పెబ్బేరు గడ్డ వరద ఉద్ధృతి, మూడ్రోజులుగా చిక్కుకున్న 5గురు రైతులు

Tuesday, November 6, 2012

పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా


కోస్తాంధ్ర ప్రాంతాంలో భారీ వర్షాల కారణంగా పాలిటెక్నిక్‌ విద్యార్థులను సోమ, మంగళవారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు సాంకేతిక విద్య శిక్షణ సంస్త ( ఎన్‌బీటీఈటీ) కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నుంచి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు

Friday, November 2, 2012

ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరనిలోటు


ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరనిలోటు

ర్రన్నాయుడు మృతి తెలుగు దేశం పార్టీకి తీరని లోటు అని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు మరణ వార్త విన్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఎర్రన్నాయుడును కోల్పోవటం తన కుడి భుజాన్ని కోల్పోయినట్లు అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మిత్రుడు, సహచరుడుని కోల్పోయామన్నారు. 

ఆయన లేరనే దుర్వార్త వినటం చాలా దురదృష్టకరమన్నారు. రాజకీయ ఎంత ఉన్నత పదవులు ఉన్నా అణిగి ఉండే వ్యక్తి అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎర్రన్నాయుడు మృతి పట్ల ఆయన కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజల కోసం అంకిత భావంతో పని చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని, పార్టీకి ఏకష్టం వచ్చినా అండగా నిలిచారన్నారు.

ఎర్రన్నాయుడుకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబునాయుడు తన పాదయాత్రను రద్దు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పెద్దచింతకుంట నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అక్కడ నుంచి విమానంలో శ్రీకాకుళం వెళ్లనున్నారు.