జగన్కు బాబాయ్ వివేకానంద రెడ్డిలమధ్య ఉప ఎన్నికల పోరు అప్పుడే మొదలైంది. కడప, పులివెందులలో త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలు జగన్కు సెమీఫైనల్స్ అయితే తనకు ఫైనల్స్ అని వ్యవసాయశాఖ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని వివేకా పిలుపునిచ్చారు. ఈనెల 17న పులివెందులలో జరుగనున్న బహిరంగ సభకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. వైఎస్ జగనైనా, తానైనా ఇద్దరమూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే పని చేస్తామని ప్రకటించారు. కాగా జగన్ పెట్టే పార్టీలో తాను ఎట్టి పరిస్థితిల్లో చేరబోనని వివేకా ప్రకటించారు. పార్టీ అనేది జగన్ వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పారు,
Sunday, December 12, 2010
జగన్కు సెమీస్ ఐతే.. నాకు ఫైనల్స్; వివేకానంద రెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment