Saturday, September 28, 2013

01అవును సమైక్యాంధ్ర ముఖ్యమంత్రినే : సీఎం కిరణ్

 02రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు.
03రాష్ట్రాన్ని విడదీయడం అంత తేలికైన విషయం కాదన్న కిరణ్, దిగ్విజయ్ సింగ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పదవుల కంటే ప్రజల ముఖ్యమని వెల్లడించారు. పార్టీకి విధేయుడంటూనే ధిక్కార స్వరం వినిపించారు. 
04ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి విభజన విషయంలో తన నిర్ణయాన్ని మరోమారి వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యూసీ తాను లేవనెత్తిన అంశాలపై ఒక్క దానికి కూడా భరోసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను విడదీయడం అంత తేలిక కాదన్నారు.

05సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదంటూనే కాంగ్రెస్ పార్టీకి విధేయుడినంటూ ధిక్కార స్వరం పెంచారు. సీఎం క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ఉద్యమాన్ని కేంద్రం గుర్తించిందని, సీమాంధ్ర ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని సీఎం కిరణ్ విజ్ఞప్తి చేశారు.

06విభజన వల్ల సాగునీటి రంగానికి ఎంత నష్టం వాటిల్లనుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని కిరణ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నుంచి సాగునీటి సరఫరాను మ్యాప్ ద్వారా వివరించారు. 1956లో రాష్ట్రం కలిసి ఉండాలని, ఫజల్ అలీ కమీషన్ చెప్పిందని గుర్తు చేశారు. 

07నీళ్లు బాగా వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదని, నీళ్లు లేనప్పుడే అసలు సమస్య ప్రారంభమవుతుందని కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం విడిపోతే జలయుద్ధాలు తీవ్రమవుతాయన్నారు. నీటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తుందో కేంద్రం చెప్పాలని కిరణ్ డిమాండ్ చేశారు. 
   
08విభజన అంశంపై సీడబ్ల్యూసీ నిర్ణయం సరైంది కాదన్న కిరణ్ జవహార్ లాల్ నెహ్రూ, పటేల్ గట్టి బంధాన్ని ఏర్పరచారని తెలిపారు. తర్వాత ఇందిరా గాంధీ ఆ బంధాన్ని మరింత గట్టిగా చిక్కుముడి వేశారని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలా శాసనం అయితే నెహ్రూ, ఇందిరల నిర్ణయాలు అటువంటివి కావా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు భద్రత లేదని, లక్షా 60మంది ఉద్యోగులు ఎవరు ఏ జోన్ పరిధిలోకి వస్తారో ఎలా నిర్ణయిస్తారని కిరణ్ ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ తరువాత పెన్షనర్లకు ఫించన్ ఎలా చెల్లిస్తారో చెప్పాల్సిన అవసరముందన్నారు.
 
09రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటే తన పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కిరణ్ స్పష్టం చేశారు. సీఎం పదవి శాశ్వతం కాదని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ పదవి కూడా శాశ్వతం కాదన్నారు. చంద్రబాబు, వైఎస్సార్సీపీల్లాగా పదవి కోసం పాకులాడాల్సిన అవసరం లేదన్న ఆయన సీమాంధ్రలో జరుగుతున్న ప్రజా ఉద్యమంలో రాజకీయ నేతలను ప్రజలు రానీవ్వడం లేదన్న విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
 
10అటు కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన మూడు ప్రాంతాల గురించీ ఆలోచిస్తారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఒకటికి రెండుసార్లు చెప్పినమాటిది. అవును నేను సమైక్యాంధ్ర సీఎంనేనంటూ నొక్కి మరీ చెప్తున్నారు కిరణ్ కుమార్.

11సీఎం వ్యాఖ్యలపై సీమాంద్రలో  సంబరం  
12విభజన అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు సీమాంద్రలోని కాంగ్రెస్ శ్రేణులు హర్షాతీరేకం వ్యక్తంచేశాయి. టపాసులు పేల్చి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనీ, తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా వుండడం వల్లనే అభివృద్ది సాధ్యమని నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం చేశారన్నారు. 

Monday, September 9, 2013

తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ వినాయకచవితి.

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించు దేవుడు మన గణపతి. అన్నికార్యములకు, ముందుగా పూజింపవలసిన ప్రధమైన దేవుడు విఘ్నేశ్వరుడు. విజయానికి, చదువులకు, జ్నానానికి, దేనికైన మన గణనాథుడే దిక్కు. వినాయకుని ప్రార్ధన, పూజ అనేది చాలా పవిత్రమైనది. తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ వినాయకచవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సక్సెస్ న్యూస్.బ్లాగ్ స్పాట్.కామ్ తెలుపుతోంది. వినాయకుడి ఇష్టమైన విషయాలను తెలుసుకుందాం. 
గణేషుడిని గరికతో పూజిస్తే సకల లాభాలు!
వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేని పూజ విఘ్నేశ్వరుని లోటుగానే ఉంటుంది. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితం. పూర్వం సంయమిని పురంలో ఒక మహౌత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బైటికి వచ్చిన యముని తేజస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణుని వద్దకు పరుగుతీశారు. ఆయన వారినందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు ఒకనాడు శివుడు హాలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కాని ఉపశమనం పూర్తిస్థాయిలో కలుగలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహూకరించాడు. వారిని వాటేసుకుంటే శరీరతాపం తగ్గుతుందని భావించారు.
కానీ ఫలితం పూర్తిస్థాయిలో సిద్ధించలేదు కాని ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడా బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తిస్థాయిలో రాలేదు. కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికీ ఇదే చికిత్సగా పనికివస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80 వేల మంది మునులు అక్కడికి వచ్చారు. ఒకొక్కరు 21 గరిక పోచల చొప్పున 16 లక్షల 80 వేల గరికపోచలు అందజేశారు. వాటితో తాపోపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించే వారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాం.
బొజ్జగణపయ్యకు ఇష్టమైన జిల్లేడుకాయలు
వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి. 'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గణనాథునికి ఇష్టమైన 'జిల్లేడు కాయలను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.
21 పత్రాలతో పూజ ఎందుకుచేయాలి!
వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి ‘మతం' అంటే ‘మానవత్వా'న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. . 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు.


 చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ' రహస్యం. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ.