Tuesday, December 28, 2010

తెలంగాణ ఏర్పాటుతో సమస్యలు పరిష్కారం కావు: జేపీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే అది పొరపాటే అవుతుందని లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఆయన సోమవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటితో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. 
ఈ నేతల రాజకీయ స్వార్థం ఏదో ఒక రోజున బయటపడుతుందన్నారు. ఆ రోజున జరిగిన నష్టాన్ని తలచుకుని బోరున విలపించక తప్పదని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్న సమయంలోనే మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. లేనిపక్షంలో ఇరు ప్రాంతాల వాసులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. 
ఇకపోతే.. రైతుల సమస్యలపై రాజకీయ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. ముందుచూపులేని ప్రభుత్వాల వల్లనే రైతులకు, ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందన్నారు.

No comments:

Post a Comment