Sunday, December 12, 2010

అబ్బాయి జగన్ ఎన్టీఆర్ బాటలోనే పయనిస్తున్నాడు ;లక్ష్మీ పార్వతి ,

తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినందుకు దానిని నిలిపేందుకు ఆనాడు స్వర్గీయ ఎన్.టి.రామారావు నడుం బిగిస్తే, ఇపుడు మళ్లీ వైఎస్ జగన్ అదే బాటలో పయనిస్తున్నాడని ఎన్టీఆర్ తెలుగుదేశం నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలిపారని ఆమె గుర్తు చేశారు. ఇపుడు ఢిల్లీ నడివీధుల్లో రాష్ట్రం పరువును నాయకులు తాకట్టు పెట్టడాన్ని అబ్బాయి జగన్ జీర్ణించుకోలేకపోవడం వల్ల ఆ పార్టీని వీడి బయటకు వచ్చారన్నారు.వైఎస్ జగన్ సభలకు వస్తున్నవారంతా వైఎస్ అభిమానులేనని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు ప్రజల ముందుకు వస్తున్న వైఎస్ జగన్‌కు రాబోయే కాలంలో తెలుగువారు బ్రహ్మరథం పడతారని లక్ష్మీ పార్వతి జోస్యం చెప్పారు. రాష్ట్ర ఎంపీల వైఖరికి వ్యతిరేకంగా త్వరలో తను ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.

No comments:

Post a Comment