Wednesday, March 28, 2012

చిరూ.. రెండేళ్లు ట్రైనింగ్ తీసుకో.. 2014 సీఎం అభ్యర్థి నువ్వే: సోనియా


 ఒకప్పుడు ప్రజారాజ్యం అధినేత - ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన చిరంజీవికి కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందట. పీఆర్పీకి ఆశించిన ఆదరణ లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవిని ఎంపీని చేయడంలో నిగూఢార్థం దాగి ఉన్నట్టు సమాచారం. రెండేళ్ల పాటు ఎంపీగా చిరంజీవిని కొనసాగించి.. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దించాలని హైకమాండ్ సన్నాహాలు చేస్తోంది. 
రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది అసమర్థ పాలన అని విపక్షాలు దుయ్యబడుతున్న నేపథ్యంలో... ఇంకా పార్టీలోని మంత్రులే అసమ్మతి గళం విప్పిన తరుణంలో కిరణ్‌ను పక్కన బెట్టి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని సోనియా గాంధీ యోచిస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణుల సమాచారం.
పీఆర్పీతో గుర్తింపు లభించలేదన్న బాధతో కాంగ్రెస్‌తో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవి సోనియా గాంధీ చెప్పినట్లు నడుచుకోవడం, ఆమెపట్ల వినయవిధేయతలను కలిగివుండటం ద్వారా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగానే తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగిన చిరును కాంగ్రెస్ అధిష్టానం ఎంపీగా చేసింది. ఇలా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో మంచి చెడులను తెలుసుకుంటే చిరంజీవికి రెండేళ్ల పాటు మంచి ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం భావిస్తోంది. 
పీఆర్పీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నామమాత్రపు వాక్చాతుర్యాన్ని కలిగివున్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంటనే వాక్ఫటిమను చేకూర్చుకున్నారు. ఇంకా తెలుగురాని ముఖ్యమంత్రి కంటే మంచి వాగ్దాటి సంతరించుకుంటూ వస్తున్న చిరంజీవిని సీఎం చేసి.. జగన్‌కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. మరి 2014 ఎన్నికల్లో చిరంజీవి గెలిచి సీఎం అవుతారో లేదో వేచి చూడాల్సిందే.

ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి తగ్గిపోతోంది : బాబు


 ప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి నానాటికీ తగ్గిపోతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కానీ.. రాష్ట్రం కొన్ని దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడేందుకే తమ పార్టీ పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా.. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇన్ని ఉప ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందన్నారు. 
ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజకీయంగా అనిశ్చితి నెలకొందన్నారు. 2009 తర్వాత ఉప ఎన్నికల మీద ఎన్నికలు వచ్చాయని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి క్రమేణా తగ్గిపోతోంది. ఒక దశలో తమిళనాడులో తరహాలో ఉప ఎన్నికల్లో పోటీకీ దిగకూడదని అనిపిస్తోందన్నారు. కానీ, విధిలేని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వస్తోందన్నారు. 
ఎమ్మార్ కేసు, వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేసుల్లో మంత్రులను సీబీఐ పిలిపించి విచారిస్తోందన్నారు. ఆనాడు ఎమ్మార్ కేసులో అప్పటి సీఎం వైఎస్‌కు బొత్స రాసిన లెటర్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆవిర్భవించి మార్చి 29 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.



ఉపాధి హామీ సమ్మెకు వైఎస్ఆర్ సీపీ మద్దతు



పాధి హామీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఉపాధి హామీ సిబ్బంది చేస్తున్న సమ్మె న్యాయమైందని వారి సమస్యలను వెంటనే నెరవేర్చాలని వైఎస్ఆర్ సీపీ పార్టీ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఉపాధి హమీ పథకానికి తూట్లు పొడిచి ఉద్యోగాల నుంచి తొలగించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.
కోటికి పైగా కార్డులుంటే 40 లక్షలమందికి కూడా పని కల్పించలేదన్నారు. కిరణ్ ప్రజల్ని మభ్య పెట్టేందుకు చూస్తున్నారని గట్టు ధ్వజమెత్తారు. సమ్మె చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవటం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని ఆయన గుర్తుచేశారు. 
వైఎస్ఆర్ పథకాలను నీరుగార్చి ఆయనను ప్రజల మనస్సు నుంచి తొలగించాలనే కుట్రకు ప్రభుత్వం తెర లేపిందని గట్టు ప్రభుత్వంపై మండిపడ్డాడు. కొవ్వూరులో కోట్ల రూపాయలు పంచిన వ్యక్తి మా దగ్గర డబ్బులు లేవంటు పేద ఏడుపులు ఏడుస్తన్నారని ఇదంతా ముందస్తుగా డబ్బులు పంచడానికి చంద్రబాబు పన్నిన వ్యూహమని గట్టు విమర్శించారు. 
ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేమని కిరణ్, బాబులకు అర్థం అయిపోయిందన్నారు. బాబు ఓటమిని ముందే అంగీకరిస్తే, కిరణ్ దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారన్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో కావాలనే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతోందని గట్టు వ్యాఖ్యానించారు.




Sunday, March 25, 2012

వుడా స్థలాల కేటాయింపులో భారీ కుంభకోణం వాస్తవమే


* తన కుమార్తెకు తక్కువ ధరకే స్థలం కేటాయింపు అవాస్తవమన్న మంత్రి 

* కుంభకోణంపై విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశం 

* అనర్హులపై క్రిమినల్‌ చర్యలు తప్పవు 

 తన కుమార్తెపై ఆరోపణలు నిజమైతే విచారణకు సిద్దం-మంత్రి మహిధర్ రెడ్డి 

తన కుమార్తెకు తక్కువ ధరకే భూమిని కేటాయించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌ రెడ్డి పేర్కొన్నారు. విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో ఆరోపణలు నిజమైతే.. తన కుటుంబం అంతా విచారణకు సిద్దపడుతుందన్నారురు. 

ఇక, విశాఖ-వుడా పరిధిలోని ఇళ్ల కేటాయింపులో భారీ కుంభకోణం వాస్తవమేనన్న మంత్రి.. అనర్హులపై క్రిమినల్‌ చర్యలు తప్పవని హెచ్చరించారు. మువ్వలవానిపాలెం అక్రమాలకు బాధ్యలైన అధికార్లను బదిలి చేశామన్న మహిధర్‌ రెడ్డి, కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు.

Friday, March 23, 2012



నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సరంలో అందరికి శుభం జరగాలని కోరుకుంటూ....

జీవితానికి ఉగాది ఇచ్చినంత గొప్ప ఉపమానం ఏ పండగ ఇవ్వదు...మానవతా విలువలకు గొప్పఅర్థాన్ని తెలియచేస్తుంది ....కష్టాలు ,సుఖాలు,ఒడిదుడుకులు ,చిన్న 
చిన్నఆనందాలు ,ఆవేశాలు కలబోసిన మన జీవితాలకి ఈ నందన నామ ఉగాది ఒక కొత్త గమనాన్ని నిర్దేశించాలని కోరుకుంటూ అందరికి "ఉగాది"శుభాకాంక్షలు ...సక్సెస్ న్యూస్:


Wednesday, March 14, 2012

రైల్వే బడ్జెట్ ముఖ్య అంశాలు



* పదేళ్ల తర్వాత పెరిగిన రైలు ఛార్జీలు
* లోక్లాస్ నుంచి హైక్లాస్ వరకు బాదుడు
* ప్యాసింజర్ రైళ్లలో కూడా పెరిగిన ఛార్జీలు
* ప్యాసింజర్ లో కిలోమీటరుకు 2 పైసలు పెంపు 
* సబ్బరన్ లోకల్ ట్రైన్లలో కిలోమీటరకు 2 పైసలు పెంపు
* ఎక్స్‌ప్రెస్‌ సెకండ్‌ క్లాస్‌లో కిలోమీటరకు 3 పైసలు పెంపు
* స్లీపర్ క్లాస్ లో కిలోమీటరుకు 5 పైసలు పెంపు 
* ఎసీ త్రీ టైర్ లో కిలోమీటరుకు 10 పైసలు పెంపు
* ఎసీ ఛైర్ కార్‌లో కిలోమీటరుకు 15 పైసలు పెంపు 
* ఫస్ట్‌ క్లాస్‌ ఏసీలో కిలోమీటరకు 30 పైసల పెంపు
* 300 కిలోమీటర్లు ప్రయాణిస్తే రూ.12 అదనపు భారం 
* ప్లాట్ ఫాం టిక్కెట్ రూ.౩ నుంచి 5 రూపాయలు పెంపు

రైల్వే బడ్జెట్ లో ఛార్జీల మోత మోగింది.. బెంగాల్ ఎన్నికలు పూర్తి కావడం.. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో యుపీఏ ప్రజలకు ఛార్జీల వాతలు పెట్టింది.. లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరిని ఓ బాదుడు బాదింది.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇప్పుడు ఉన్న ఛార్జీకి అదనంగా పది రూపాయలు ఎక్కువ చెల్లించాల్సిందే.. అసలు రైల్వే బడ్జెట్ లో పెరిగిన ఛార్జీలు ఒక్కసారి పరిశీలిస్తే..

ఇది కామన్ మ్యాన్ బడ్జెట్ అంటూనే దినేష్ త్రివేది ఛార్జీల పెంపులో కామన్ మ్యాన్ కు ఏ మాత్రం మినహాయింపు ఇవ్వలేదు.. కేటగిరిలను బట్టి ఛార్జీల పెంచేశారు. ప్రతి కిలోమీటరుకు రెండు నుంచి ముఫై పైసల వరకు రైల్వే ఛార్జీల భారం ప్రయాణికులపై పడనుంది. తాజాగా పెంచిన రైలు ఛార్జీల వివరాలిలా ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్ టిక్కెట్ కిలోమీటరు రెండు పైసలు పెరిగింది. 

ఎక్స్‌ప్రెస్‌లలో సెకండ్‌ క్లాస్‌ లో కి.మీకి మూడు పైసలు, అదే ఎక్స్ ప్రెస్ స్లీపర్ క్లాస్ లో ఐదు పైసలు, ఎసీ త్రీటైర్ లో 10 పైసలు, ఎసీ ఛైర్ కార్ లో కిలోమీటరు కు పది హేను పైసలు పెరిగింది. ఫస్ట్‌క్లాస్‌ ఏసీలో కిలోమీటరకు 30 పైసలు పెంచారు. దీనిని బట్టి 300 కిలోమీటర్లు ప్రయాణిస్తే 12 రూపాయలు అదనపు భారం పడింది. చివరకు ప్లాట్ ఫాం మీదకు వచ్చే వారిని కూడా రైల్వే మంత్రి వదలలేదు.. ప్లాట్ ఫాం టిక్కట్ ౩ నుంచి 5 రూపాయలు పెంచి షాక్ ఇచ్చింది. 


రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి కాస్త ప్రాధాన్యం

రైల్వే బడ్జెట్‌లో గతంలో కంటే ఈదఫా రాష్ట్రానికి కాస్త ప్రాధాన్యత లభించింది. హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌ రెండో దశకు రైల్వేమంత్రి దినేష్‌ త్రివేది గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేస్తామని చెప్పారు. మెదక్‌- అక్కన్నపేట్‌ల మధ్య, కొవ్వూరు-భద్రాచలం, కాకినాడ-పిఠాపురంల మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు. 

విశాఖ-కాకినాడల మధ్య కోస్టల్‌ కారిడార్‌ అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ల ఆధునీకరణతో పాటు ఎయిర్‌పోర్టుల స్థాయిలో మార్పు చేస్తామన్నారు. 

Monday, March 12, 2012

Raju Slideshow Slideshow

Raju Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Raju Slideshow Slideshow ★ to Visakhapatnam. Stunning free travel slideshows on TripAdvisor

Sunday, March 11, 2012

లక్షన్నర కోట్ల నష్టాల్లో ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు !!!?


దేశంలోని ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రూ. లక్షా 50 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తెలియచేశారు. సుమారు 2,200 కోట్లతో విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేసిన క్లీన్ ఫ్యూయల్స్ ప్రాజెక్ట్‌ను సోమవారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నందుకు తను ఆనందపడాలో? బాధపడాలో అర్థం కావడం లేదని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇరాన్‌లో ఉద్రిక్తత ఏర్పడినా, అరబ్ దేశాల్లో తిరుగుబాటు వచ్చినా క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోందని అన్నారు. యూరప్ ఖండంలో రాజకీయ, ఆర్థిక సంఖోభం వచ్చినా డాలర్ రేట్లలో మా ర్పులు చోటు చేసుకుంటున్నాయని అ న్నారు. ఈ రెండు నష్టాలనూ చమురు సంస్థలు ఎదుర్కోవలసి వస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వస్తోందని జైపాల్‌రెడ్డి చెప్పారు. తనకు వ్యక్తిగతంగా పెట్రో ధరలు పెంచాలన్న ఉద్దేశం లేకపోయినా గణితవాదం నుంచి తప్పించుకోలేం కదా! అని ఆయన అన్నారు. ఎప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాలన్నా ఎన్నికలు అడ్డు వస్తుంటాయి. ఎన్నికల్లేని సంవత్సరమే లేదు. ఆర్థిక భారాన్ని మోస్తున్నా, నిగ్రహంతో ఉండి, వీలైనంత వరకూ ధరలు పెంచకుండా చూస్తున్నామని జైపాల్‌రెడ్డి వివరించారు. రేట్లు పెరిగినప్పుడల్లా, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయమని ఉచిత సలహాలు వస్తున్నాయని, నష్టాల్లో ఉన్న కంపెనీలను వారెందుకు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు.
త్వరలో యూరో-4 పెట్రోలు
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు యూరో-4 పెట్రోలును దేశంలోని 13 నగరాల్లో వినియోగిస్తున్నామని మంత్రి జైపాల్‌రెడ్డి తెలియచేశారు. యూరో-3 పెట్రోలను యూరో-4 పెట్రోలుగా మార్చనున్నామని, ఇందుకు 40 వేల కోట్ల రూపాయలు ఖరవుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే విశాఖ నగరంలో కూడా యూరో-4 పెట్రోలను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన చెప్పారు. అలాగే యూరో-4 డీజిల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
కేంద్ర మానవవరుల అభివృద్ధి శాఖ మంత్రి డి.పురంధ్రీశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి రంగంలో హెచ్‌పిసిఎల్ నాలుగో స్థానంలో ఉందని అన్నారు. క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మన దేశం ఐదో స్థానంలో ఉందని అన్నారు. అలాగే పెట్రోలు ఎగుమతిలో మన దేశం ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆయిల్ రంగంలో మరిన్ని అద్భుతాలు సాధించి, ప్రపంచంలోనే భారత దేశం ఒక సూపర్ శక్తిగా ఆవిర్భవించబోతోందని ఆయన చెప్పారు. హెచ్‌పిసిఎల్ విడుదల చేస్తున్న కాలుష్యకారకాల్లోని ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని ఆమె అన్నారు. వాహనాల సంఖ్య పెరిగిపోవడం వలన కూడా కాలుష్యం పెరుగుతోందని ఆమె అన్నారు.
రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జైపాల్‌రెడ్డిని కోరారు. రాష్ట్రాన్ని ఆదుకోవలసిన సమయం వచ్చిందని చెప్పారు. రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక, సహజవాయువుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ హెచ్‌పిసిఎల్ గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. కాలుష్య రహిత నగరంలో తీర్చి దిద్దేందుకు పరిశ్రమలు కదలి రావాలని ఆయన కోరారు.


రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ యూరో-3, యూరో-4 పెట్రోలు వాడకం వలన కాలుష్యానికి తెరపడబోతోందని అన్నారు. భవిష్యత్‌లో హెచ్‌పిసిఎల్ కాలుష్య నివారణ సంస్థగా మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ హెచ్‌పిసిఎల్‌లో కాంట్రాక్ట్ కింద పనిచేసేందుకు ఈ ప్రాంతంలో నివసించే వారికే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రీనరీ అభివృద్ధికి హెచ్‌పిసిఎల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Thursday, March 8, 2012

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...



ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".


Saturday, March 3, 2012

తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారానికి మెగాస్టార్ రెడీ ,


కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి సిద్ధపడుతున్నారు. చిరంజీవి ప్రచార కార్యక్రమాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) రేపు శనివారం ఖరారు చేయనుంది. పార్టీ సూచిస్తే తాను ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చిరంజీవి శుక్రవారం చెప్పారు. దీంతో చిరంజీవిని ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి దింపడానికి పార్టీ నాయకత్వం కార్యక్రమాన్ని ఖరారు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. 

చిరంజీవి కోవూరులోనే కాకుండా తెలంగాణ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకుని సీమాంధ్రలో పర్యటించిన తర్వాత చిరంజీవి తెలంగాణలో పర్యటించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, చిరంజీవి తెలంగాణలో అడుగు పెట్టడానికి జంకినట్లే కనిపించారు. ఇప్పుడు కాంగ్రెసు కార్యకర్తల అండదండలతో, అభిమానుల తోడుతో ఆయన తెలంగాణలో పర్యటించడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. 

తాను సమైక్య నినాదం పుచ్చుకున్నప్పటికీ తెలంగాణలో తనకు అభిమానులు పెద్ద యెత్తునే ఉన్నారని చిరంజీవి భావిస్తున్నారు. వారంతా తన వెంటే ఉంటారని కూడా ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఆరు శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ చిరంజీవి ప్రచారం కార్యక్రమం ఉంటుంది.