Wednesday, December 15, 2010

మూడేళ్లు వేచి చూడండి... రాష్ట్ర కాంగ్రెస్ ఖాళీ: పిల్లి సుభాష్

మరో మూడున్నర సంవత్సరాల పాటు వేచి చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జోస్యం చెప్పారు. జగన్ కొత్త పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా ఆయన పార్టీకి తరలి వస్తారని ఆయన ప్రకటించారు. ఆయన బుధవారం విజయవాడలో మాట్లాడుతూ వైఎస్ తనయుడు అధికారం కోసం యాత్రలు, ప్రజా కార్యక్రమాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. జగన్ కొత్త పార్టీ స్థాపిస్తే అనేక మంది పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులంతా తండోపతండాలుగా తరలి వస్తారన్నారు. జగన్ కొత్త పార్టీ పెట్టినప్పటికీ.. తాము పూర్తి కాలం ఎమ్మెల్యేలుగా కొనసాగుతామన్నారు. ఎందుకంటే.. వైఎస్ఆర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని తాము కూల్చబోమన్నారు. అందువల్ల పూర్తి కాలం మనుగడ సాగిస్తామన్నారు. ఇకపోతే.. తమ రాజీనామాల విషయాన్ని త్వరలోనే తేల్చుతామని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

No comments:

Post a Comment