Tuesday, December 28, 2010

తెలంగాణలో ఉనికి కోసం కాంగ్రేస్ పాట్లు

తెలంగాణా కాంగ్రేస్ నేతన్నడూ లేని విధంగా, క్రొత్తగా కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారు. లేక పోతే తెలంగాణా లు ఎఎంపీలందరూ దీక్ష చేయడం ఏమిటి?
 వారికి MLC,MLA లందరూ మద్దతు ఇవ్వదమేమిటి?
విద్యార్థులను విడిపించడంలో ఇన్ని రోజులూ వాళ్ళు చేసిందేమిటి?  
తెలంగాణా విద్యార్థులను విదిపించడానికో లేకపోతే తెలంగాణలో కోల్పోతున్న తమ ఉనికిని దీన్ని అడ్డంగా పెట్టుకుని కాపాడుకోవడానికో భలే పన్నాగం పన్నారు.
తెలంగాణా ఆవిర్భవించడానికి తాము మాత్రమె కారకులని , కాంగ్రెస్స్ మాత్రమె తెలంగాణని ఇవ్వగలదని ప్రజలలో మెప్పు పొందడానికి ఇలా చేస్తున్నారని అనడంలో వింతేమీ లేదు.
కాంగ్రేస్ కుళ్ళు , కుతంత్రాలలో ఇది ఒక భాగం అని చెప్పవచ్చును.ఇదంతా డిల్లీ పెద్దలకు కూడా తెలిసే ఉంటుంది.బహుశా ఈ నాటకానికి రూపకర్తలు వారే అయిఉంటారు. కాంగ్రేస్ తెలంగాణా ఇచ్చి ప్రజల మన్ననలను పొందాలని అనుకుంటుందేమో పాపం కాని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని విశ్వశించరు. తెలంగాణా రావడానికి సృశి చేసిన క్రెడిట్ T.R.S కి దక్కకుండా ముందస్తు జాగ్రత్తలు బాగానే తీసుకుంటోంది.
T.R.S కాంగ్రేస్ నాయకులపై ఎటువంటి వ్యూహాలతో ఎదురుదాడి చేస్తుందో చూడాలి.      

No comments:

Post a Comment