Thursday, December 16, 2010

అక్షరమే చరిత్రను నిలబెడుతుంది ...

విశాఖపట్నం ; టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ చివరికి అక్షరమే చరిత్రను నిలబెడుతుందని నగర పోలీస్ కమిషనర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. టర్నర్ చౌల్ట్రీలో 11వ విశాలాంధ్ర పుస్తక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి పూర్ణచంద్రరావు మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి సైతం మీడియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. పుస్తకం మనుగడ సాగించడం అసాధ్యమని భావించే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తపర్చారు. పుస్తకం కొత్త పద్ధతుల్లో జనాల మధ్యకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి చివరికి అక్షరమే నిలుస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలు, గ్రంథాలు అనేకం పాఠకులను ఆకర్షించేవిధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఏయూ ప్రొఫెసర్ డాక్టర్ పి.బాబివర్ధన్, కార్పొరేటర్ ఎజె స్టాలిన్, డాక్టర్ చందు సుబ్బారావు, రచయిత విరియాల లక్ష్మిపతి, డాక్టర్ వి.సూర్యారావు, డాక్టర్ దేవరకొండ సహదేవరావు, మంగు శివరామప్రసాద్, పి.అనంతరావు, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ ఎం.వి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment