Saturday, December 25, 2010

జగన్ఽవివేక డబుల్ గేమ్ ,కాంగ్రేసుకు హడల్

వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డికి మద్య సత్సంభందాలు లేవని ఇప్పటివరకు అందరికి తెలుసు.కాంగ్రేస్ తనకిచ్చిన మంత్రి పదవిని వదులుకోలేని వివేక, జగన్ కు సహకరించలేదు.తాజాగా వీరిద్దరి మద్య జరిగిన సంధి సఫలం అయింది.పులివెందులలో క్రిస్మస్ సందర్భంగా భేటి అయిన వీరిరువురి మద్య సానుకూల వాతావరణం నెలకొంది.
వై.ఎస్ రాజశేకర్ రెడ్డి పై కాంగ్రేస్ నేతలైన డి.ఎల రవీంద్రా రెడ్డి, డి.శ్రీనివాస్ , బొత్సా సత్యనారాయణ మరియు తదితర నేతలు అవినీతి ఆరోపణలు చేయడం వంటి విషయాల వల్ల వై.ఎస్ వివేకానంద రెడ్డి కలత చెందారు.కాంగ్రేస్ తనను జగన్ మోహన్ రెడ్డి విష్యం లో పావుగా మార్చి౦దన్న విషయం కూడా వివేకా గ్రహించినట్టున్నాడు.
ఇది ఒక కోణం లోనుంచి విశ్లేషిస్తే మాత్రమె, ఇంకో కోణం లో అయితే వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అస్త్రంగా చెప్పవచ్చు.ఇది వీరిరువురూ కావాలనే కాంగ్రేస్ కి షాక్ ఇచ్చే ప్లాన్ చేసినట్టు కొందరు అనుకుంటున్నారు.
ఇంకొంత కాలం వివేకా మంత్రి పదవిలో కొనసాగి తరువాత జగన్ పార్టీ లో చేరే అవకాశం ఉంది.ఏది ఏమైన ఇక రాష్ట్రంలో కాంగ్రేస్ కి గడ్డుకాలమే.

No comments:

Post a Comment