Thursday, May 31, 2012

అత్తకు మించిన కోడలు సోనియాగాంధీ


సోనియాగాంధీ ఇందిరాగాంధీని మించిపోతోందా?లేక అధికారంలో వుంటే ఎంత సున్నిత మనస్కులైనా ఇందిరలా మారిపోతారా? సోనియాగాంధీ.. తాను రాజకీయాల్లోకి రానంటే రానని మొరాయించి కూర్చున్న ఒకానొక సాధారణ గృహిణి. ఎంత ఫారిన్ వనితైనా.. సంప్రదాయ బద్ధంగా జీవించిందే ఎక్కువ. దానికి తోడు వాల్డ్ మోస్ట్ పాపులర్ ఫ్యామిలీస్ లో ఒకటైన గాంధీ కుటుంబానికి కోడలిగా వచ్చింది. ఇందిర హఠాన్మరణం.. తదనంతరం తన భర్త రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం.. తరువాత ఆయన కూడా మరణించడంతో సోనియాగాంధీ షాకులు  మీద షాకులకు గురైంది. రాజకీయాలనే పేరెత్తితేనే చిరాకు పరాకుగా ఫీలయ్యేది. కాంగ్రెస్ పార్టీని వాళ్లూ వీళ్లు అధ్యక్షపదవుల్లో వుండి పతనావస్థకు చేర్చుతుంటే.. విధిలేని పరిస్థితుల్లో రంగంలోకి దిగింది. తిన్న తిన్నగా రాజకీయ పరిజ్ఞానం వంటబట్టించుకుంది. ఇప్పుడు సోనియా ఎలా మారిపోయిందంటే, తనకు ఎదురు తిరిగిన జగన్ లాంటి వాళ్లను ఎలా మట్టుపెట్టాలో పక్కాగా తెలిసిన ‘రాజకీయ సివంగి’లా మారింది. ఇలాంటి ఎత్తుగడలు వేయడంలో ఇందిరాగాంధీ నాడు ఎంతో ఫేమస్సయింది. ఇందిరతో పెట్టుకున్న వాళ్లు కోలుకోవడం కష్టం అన్నంతగా రాణించిందామె. ఇప్పుడు దాదాపు ఆ స్థాయికి చేరింది సోనియాగాంధీ. తండ్రి (రాజశేఖర్ రెడ్డి) మరణానంతరం సీఎం సీటు తనకు దక్కలేదన్న తలంపుతో కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించి, తరువాత ఆ పార్టీలో ఇమడ లేక జగన్ కొత్త పార్టీ పెట్టాడు. ఏమీ తెలియని అమాయకుడిగా అనుకుని అతడిని వదలటం.. ఎంత పెద్ద నేరమో తెలుసుకుంది సోనియాగాంధీ. ప్రస్తుతం అతడు గనుక ఈ ఉపఎన్నికల్లో గెలిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ కూచాలు కదులుతాయి. ప్రభుత్వం పడిపోయి మధ్యంతరం వచ్చే పరిస్థితి కూడా వుంది. కనుక జగన్ అడుగులు అల్లాటప్పాగా వేస్తున్నవి కావు. కనుక, ఈ విషయాన్ని తప్పనిసరిగా సీరియస్ గా తీసుకోవాలని తలచి సోనియాగాంధీ ఇంతగా అతడ్ని కట్టడి చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ని జైల్లో పడేయటం  ఒక్కటే మార్గం.. అతడు జనంలోకెళ్లకుండా జైల్లో కూర్చోవడమే రాబోయే మధ్యంతరాన్ని ఆపగల తారక మంత్రం. అలా కూర్చోవాలంటే తగిన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన సోనియాగాంధీకి ఇంతకన్నా మించిన టైం దొరకదు. ఇన్నాళ్లూ సీబీఐని పకడ్బందీగా వాడుకుని పావులు కదుపుతూ వచ్చింది అందుకే. ఇప్పుడు జగన్ కి చెక్ పెట్టడానికి కాలంధర్మం బాగా కలిసొచ్చింది. ఉపఎన్నికల ముందు అరెస్టు చేయడం వల్ల ఒక లాభం వుంది. ఏ మాత్రం అల్లర్లు చెలరేగినా.. జగన్ ఇన్నాళ్లు చేసిన ప్రచారం బూడిదలో పోసినట్టే. ఉపఎన్నికలు అటకెక్కుతాయి. అలా జరక్కూడదంటే, జగన్ అరెస్టైనా ఆయన పార్టీ కార్యకర్తలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి తీరాల్సిందే. ఇక్కడ పదే పదే చెబుతున్నదేమిటంటే ఇంత పక్కాగా జగన్ కు చెక్ పెట్టగలగడం నిజంగా ఒక చాణక్యమే. సోనియా ఎంతగానో రాటు దేలితే తప్ప.. ఇంతగా ప్రత్యర్ధుల పనిపట్టడం సాధ్యమయ్యే పని కాదు. అందుకే అంటున్నది.. అత్త ఇందిరను మించిన కోడలుగా సోనియా చెలరేగిపోతోందని. భవిష్యత్ పరిణామాలు ఎలా వున్నప్పటికీ.. సోనియా రాజకీయ చదరంగం ఆడుతున్న తీరు ఎంత ఆక్షేపణీయంగా అయినప్పటికీ.. ఆమెలోని రాజకీయ పరిణితి పరాకాష్టకు చేరిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tuesday, May 29, 2012

ముఖ్యమైన 10 వార్తలు…


ముఖ్యమైన 10 వార్తలు…


1.   జగన్ ను విఐపీ ఖైదీగా పరిగణించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదాలు వేసిన పిటీషన్ ను పరిశీలించిన కోర్టు అందుకు అనుమతించింది. దీంతో జగన్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అండర్ ట్రైల్ ఖైదీగా జగన్ జైల్లోకి అడుగుపెట్టే వేళకు, అప్పటికే అక్కడ తొమ్మిది మంది విఐపీ ఖైదీలు ఉండటంతో జగన్ పదవ నెంబర్ విఐపీ ఖైదీగా లోపలకు అడుగుపెట్టారు. కాగా, మొత్తం ఖైదీలను లెక్కలోకి తీసుకుంటే జగన్ కు ఇచ్చిన ఖైదీ నెంబర్ 6093.

2   చంచల్ గూడ జైలు అధికారులు, జగన్  విఐపీ అండర్ ట్రైల్ ఖైదీ కావడంతో ఆయనకు  మెరుగైన సౌకర్యాలే కల్పించారు . సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ జగన్ కు సోమవారం రాత్రి నిద్రపట్టలేదు. అర్థరాత్రి దాటినా ఆయన గదిలో లైట్ వెలుగుతూనే ఉన్నదనీ, ఆయన బెడ్ మీద పడుకోకుండా కుర్చీలో కూర్చునే ఉన్నారననీ,  జగన్ జైలులోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ముభావంగానే ఉన్నారని  జైలు సిబ్బంది అందించిన సమాచారం. తెల్లవారుఝామున 3-00 గంటల దాకా జగన్ నిద్రలోకి జారుకోలేదు. ఆ తర్వాత కాసేపు పడుకున్నా, ఆరు గంటలకే ఆయన నిద్రలేచారు. ఉదయం పాలు తాగారు. ఆ తర్వాత తనకు పేపర్లు తెప్పించి ఇవ్వమని జైలు సిబ్బందిని కోరారు. ఇంగ్లీష్ , తెలుగు పత్రికలు మొత్తం 14 పేపర్స్ ను ఆయన తెప్పించుకున్నారు.

3. విఐపీ అండర్ ట్రైల్ ఖైదీ కావడంతో అల్పాహారం దగ్గర నుంచి భోజనం వరకూ అన్నింటిని ఆయన ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. సాదారణంగా ఈ సౌకర్యం ఉన్నప్పుడు ఖైదీలు తమ ఇంటి నుంచో లేదా బంధువుల ఇళ్ల నుంచో ఆహారపానీయాలను తెప్పించుకుంటారు.

4.  జగన్ చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్‌ఫోర్స్ మెంట్ (ఈడి) బృందం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందం కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత జగన్ ను ఇంటరాగేట్ చేయడానికి సిద్ధమవుతోంది.

5.  జగన్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ ఈవేళ (మంగళవారు) మరోసారి పిటీషన్ దాఖలు చేయబోతున్నది.

6. హైదరాబాద్ లోని కొండాపూర్ లోని లగడపాటి రిసార్ట్ లో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది.  ప్లాసిడా పేరిట ఈ రిసార్ట్ ను లగడపాటి భార్య పద్మ నిర్వహిస్తున్నారు. తెలంగాణవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అక్కడ కరపత్రాలు లభిస్తున్నా, ఈ పని వారు చేయలేదనీ, జగన్ వర్గమే చేసిఉంటుందని లగడపాటి భావిస్తున్నారు.

7 . న‌టుడు, ద‌ర్శకుడు ఏవీయ‌స్ ప్రక‌టించిన ‘బ్లాగ్ బ‌స్టర్ అవార్డ్స్‌’కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం ద‌క్కింది.

8. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ బుధవారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
విజ‌య‌మ్మలోట‌స్ పాండ్ వద్ద చేప‌ట్టిన దీక్షను విర‌మింప‌చేశారు.

9 సోమవారం ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించింది.

10  .తీవ్రవాదులు హింసామార్గాన్ని విడనాడి, శాంతిబాటన సాగాలని యుపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ మరోమారు పిలుపునిచ్చారు. తీవ్రవాదుల్లో పరివర్తన రావాలనీ, దేశసమగ్రాభివృద్దిలో వారు కూడా భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు.

Thursday, May 24, 2012

పెట్రో....మంటలు......


పెట్రో....మంటలు......

 పెట్రోల్‌ రేటు సెంచరీని చేరడానికి ఎగిసెగిసి పడుతోంది. డాలర్‌ బూచీ చూపి కేంద్రం ఒకేసారి లీటర్‌కు ఆరు రూపాయలకు పైగా పెంచడంతో పెట్రోల్‌ రేటు కొండెక్కి కూర్చొంది. స్థానిక పన్నులతో కలిపి హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 81కి చేరింది. పెట్రో ధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరకు నిరసనగా రాష్ట్ర ప్రజానికం రోడ్డెక్కింది. ర్యాలీలు, ఆందోళనలతో నిరసన తెలిపారు.పెట్రో ధరలను భారీగా పెంచి యూపీఏ సర్కార్‌ జనానికి షాక్‌ ఇచ్చింది. సామాన్యుడి నడ్డి విరుస్తూ.. లీటర్‌ పెట్రోల్ ధరను ఒక్కసారిగా 8 రూపాయలు పెంచడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఏడాదిలోనే రెండోసారి పెట్రో ధరలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

పెట్రోల్‌ ధరల పై ప్రతిపక్షాలు ఫైర్‌ అయ్యాయి. పెట్రోధరల పెంపుకు నిరసనగా యూపీఏ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్థున్నారు కేంద్రం ఒక ప్రణాళిక లేకుండా పాలిస్తోందని, సామాన్య ప్రజలపై ధరల భారం మోపుతోందని దుయ్యపట్టారు. పెంచిన పెట్రోల్‌ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అంటున్నారు.పెట్రోల్‌ రేట్ల పెంపుపై వామపక్షాలు ఆందోళన బాటపట్టాయి. సీపీఎం, సీపీఐ కార్యకర్తలు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ యూపీఏ సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశాయి. ర్యాలీలు, ఆందోళనలతో నిరసన తెలిపాయి.పెట్రోల్‌ ధర పెరిగిందన్న వార్తలతో వాహనదారులు బంకుల ముందు క్యూ కట్టారు. మరోవైపు పెరిగిన రేట్లను క్యాష్‌ చేసుకునేందుకు పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు నో స్టాక్‌ బోర్డులు పెట్టడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు,

Tuesday, May 8, 2012

ఓ వ్యక్తి స్వార్థంవల్లే ఉప ఎన్నికలు


ఓ వ్యక్తి స్వార్థంవల్లే ఉప ఎన్నికలు


-తూర్పుగోదావరిలో సీఎం కిరణ్
దేశంలో సోనియానే పెద్ద క్రిస్టియన్: ధర్మాన
టీడీపీ, టీఆర్‌ఎస్‌తో జగన్ కుమ్మక్కు.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
-తండ్రి మాటను జగన్ విస్మరించారు..
-డీఎల్ పరీక్ష వాయిదాపై విచారణ జరిపిస్తాం.. తూర్పుగోదావరిలో సీఎం కిరణ్
-ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
-కోడ్ వల్ల అభివృద్ధి కుంటుపడింది
క వ్యక్తి స్వార్థం వల్లే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌డ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్.. టీడీపీ, టీఆర్‌ఎస్‌లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న కేసీఆర్, కాంగ్రెస్‌కు శత్రువైన చంద్రబాబుతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డి ఏ నాడు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయలేదని చెప్పారు. వైఎస్సార్ తన మరణానికి రెండు రోజుల ముందు జరిగిన ఓ సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ పనీ చేయొద్దని సూచించినట్లు తెలిపారు. ఆ సమావేశంలో జగన్ కూడా ఉన్నారని, అయినా తన తండ్రి మాటను ఆయన ఎందుకు విస్మరించాడో అర్థం కావడంలేదని సీఎం పేర్కొన్నారు. జగన్ అవినీతి సొమ్ముతో 70 గదుల ఇళ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రామచంవూదాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామంలో నిర్వహించిన ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టేనని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా తాము వీఆర్వో, వీఆర్‌ఏ నియామకాలు చేపట్టామని సీఎం చెప్పారు. ప్రతిభ ఉన్న వాళ్లకే పట్టం కట్టామని తెలిపారు. 2014లో రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రామచంవూదాపురం నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులును భారీ గెలిపించాలని ఓటర్లను కోరారు. సభకు హాజరైన జనాలను చూస్తుంటే త్రిమూర్తులు గెలుపు ఖాయమే అనిపిస్తోందన్నారు. తోట త్రిమూర్తులు గెలుపు కోసమే రామచంవూదాపురం మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ తన పదవికి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్, టీడీపీతో కుమ్మక్కైనందువల్లే పిల్లి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి డీఎల్ రవీంవూదాడ్డి పనిలేకనే ఏదో ఒకటి మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. మీడియా సంస్థలు కూడా పనిలేకే ఆ వార్తలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొన్నారు. డీఎల్‌వి చిల్లర రాజకీయాలని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. మంత్రులు తమకు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేయొద్దని హితవు పలికారు. పార్టీలో ఎవరు హద్దుమీరినా అధిష్ఠానంతో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. డీఎల్ పరీక్ష వాయిదా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, దీనిపై విచారణకు ఆదేశిస్తామని సీఎం వెల్లడించారు. జలయజ్ఞం కోసం నిధులు సేకరిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా 12 జిల్లాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. ఈ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తోట నరసింహం, పీ విశ్వరూప్, అమలాపురం ఎంపీ హర్షకుమార్, రామచంవూదాపురం కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పిరికిపంద అని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.
 ద్రాక్షారామం ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ... 
జగన్ లక్షకోట్లు ఎలా సంపాదించాడో ఇప్పటీకీ సమాధానం చెప్పడంలేదని విమర్శించారు. అటువంటి వ్యక్తికి ప్రజలు అధికారం ఎందుకు అప్పగించబోరని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని, ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీని చూసి జగన్ చాలా నేర్చుకోవాలని సూచించారు. వారు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా వదులుకున్నారని చెప్పారు. సీఎం పదవి చేప జగన్‌కు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. సమాజంపట్ల, ప్రజా సమస్యలపైన జగన్‌కు అవగాహన లేదని విమర్శించారు. జగన్‌కు కాంగ్రెస పార్టీ చేసిన మోసం ఏమిటని ప్రశ్నించారు. ఆయన రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. జగన్ ఒక కులానికి, మతానికి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారని ధర్మాన విమర్శించారు. దేశంలో అతిపెద్ద క్రిస్టియన్ సోనియాగాంధేనని, క్రిస్టియన్లు ఆమెను కాదని జగన్‌కు ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు. పాదయాత్ర సందర్భంగా తాను వైఎస్సార్‌తోపాటు 1647 కిలోమీటర్లు నడిచానని, జగన్ ఒక్కరోజు కూడా యాత్రలో పాల్గొనలేదని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులును గెలిపించాలని ఓటర్లను కోరారు.

Sunday, May 6, 2012

సమాచార శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రవదన్


మాచార వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తా:చంద్రవదన్
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు సమాచార వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తానని సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. 
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా డాక్టర్ ఆర్.వి. చంద్రవదన్  04-05-2012 తేది శుక్రవారం  బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన ప్రచారం కల్పించడంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కీలకమైన భూమిక నిర్వహిస్తుంది. ఈ పదవిలో గత పదిన్నర నెలల నుంచి కొనసాగిన వెంకటేశం ను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ, ఆయన స్థానంలో చంద్రవదన్‌ను ఇటీవలే ప్రభుత్వం నియమించింది. చంద్రవదన్ గతంలో పనిచేసిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో, రాజీవ్ విద్యా మిషన్ (సర్వశిక్షా అభియాన్) లో తనదైన శైలిని ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీలుగా సిఎం ప్రత్యేకంగా చంద్రవదన్‌ను ఎంపిక చేశారు. 2014 సాధారణ ఎన్నికలతో పాటు, ఈలోగా జరిగే ఇతర ఎన్నికల్లో ప్రభుత్వానికి విస్తృతమైన ప్రచారం కల్పించాలని భావిస్తున్నందు వల్ల చంద్రవదన్‌ను సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా నియమించినట్టు విశ్వసీయవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను మీడియా ద్వారా గ్రామీణ ప్రజలకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తానన్నారు. సమాచారాన్ని ప్రజలకు మరింత తొందరగా చేరవేసేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటామని చంద్రవదన్ తెలిపారు.

Saturday, May 5, 2012

వీజేఎఫ్‌ అధ్యక్షుడుగా గంట్ల శ్రీనుబాబు


విశాఖపట్నం:(సక్సెస్ న్యూస్): 2012-14 సంవత్సరాలకు వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శిలుగా గంట్ల శ్రీనుబాబు (ఆంధ్రజ్యోతి)ఎస్‌. దుర్గారావు (ఆంధ్రప్రభ),విజయకేతనం ఎగురవేశారు.ఏప్రిల్‌ 22వ తేది ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా నాగరాజు పట్నాయక్‌(ఆంధ్రజ్యోతి), నానాజీ
( హెచ్‌ఎంటీవీ) కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శులుగా దాడి రవికుమార్‌ (విజన్‌), ఎల్‌.జి. నాయుడు (వార్త), కోశాధికారిగా పి.ఎన్‌.మూర్తి (సాక్షి), కార్యవర్గసభ్యునిగా పి. వరలక్ష్మి,ఈ. ఈశ్వరరావు, డేవిడ్‌రాజు, ఎం.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, బి. గిరిబాబు, పి. దివాకరరావు, ఎస్‌. మాధవ్‌, శేఖర్‌ మంత్రి, ఎండీ గయాజుద్దీన్‌లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను జిల్లా పౌర సంబంధాల అధికారి బాబ్జీ, అతని సిబ్బంది పర్యవేక్షించారు.