Sunday, December 26, 2010

కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలంగాణ ప్రజాప్రతినిధులు అల్టిమేటం!!!

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. ఇందులో పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే ప్రతిపాదన పెట్టగా, దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఫలితంగా డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. 
అంతేకాకుండా, విద్యార్థులు, ఉద్యమకారుల పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేసే వరకు రేపటి నుంచి గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఎంపీలంతా నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం 11 గంటలకు సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలు తెలంగాణ అంశంపై మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించారు. 
ఈ భేటీ అనంతరం సీనియర్ నేత కేశవరావు విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని తాము చేసిన డిమాండ్‌కు గడువు నేటితో ముగిసిందన్నారు. పాక్షికంగా కాకండా పూర్తిస్థాయిలో కేసులు ఎత్తివేసే వరకూ నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 31 తర్వాత పరిణామాలను బట్టి తెలంగాణ ప్రజా ప్రతినిధులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానానికి అల్టిమేటమ్ జారీ చేసినట్టు చెప్పారు.

No comments:

Post a Comment