Tuesday, April 10, 2018

యోగా చేసిన కవిత

తంజలి యోగా పీఠం ఆధ్వర్యాన నిజామాబాద్ లో చేపట్టిన ఉచిత యోగా చికిత్స, ధ్యాన శిబిరాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. శిక్షణా శిబిరానికి వచ్చిన వారితో రాందేవ్‌బాబా యోగాసనాలు వేయించారు. యోగా అనేది ఒక్కరోజు చేసే ప్రక్రియ కాదని నిత్య సాధన ఉండాలని రాందేవ్‌బాబా అన్నారు. 2050 నాటికి భారత దేశాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారతస్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య కోసం లక్షకోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.