Sunday, December 18, 2011

పాపం చిరంజీవి !!!


 చిరంజీవి రాజకీయ చరిత్ర సరికొత్తగా రికార్డు కాబోతున్నది. స్వయం కృషితో సినిమా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి రికార్డు సృష్టించిన చిరు రాజకీయాల్లో మాత్రం అందుకు భిన్నమైన పేరుతో రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. సినీ రంగంలో వెలిగిపోయిన ఎన్టీఆర్ పార్టీ స్థాపించి రాజకీయంగా అధిక గుర్తింపు పొందినప్పటికీ ఆ స్థాయిలో చిరు ప్రయత్నం ఫలించలేదు. అనుభవ రాహిత్యంతో ముందస్తు షరతులేవీ లేకుండా అర్జంట్‌గా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినప్పటికీ ఇప్పటివరకు ఆయన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించలేదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఆర్‌ఎల్‌డీ నేత అజిత్ సింగ్‌కు మాత్రం ఆగమేఘాలపై ఆదివారం నాడే కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటున్నారు. బయట నుంచే సపోర్టిస్తాం..అని కరాఖండిగా ముందే చెప్పి ఉంటే తమకు కొన్ని పదవులు దక్కేవని చిరు ఎమ్మెల్యేలు విశ్వసిస్తున్నారు. పైగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న సమయంలోనే సీఎంపైన మరింత ఒత్తిడి పెంచి ఉన్నా, తమకు ఈ దుస్థితి తప్పేదని వాపోతున్నారు. (సాంకేతికంగా ఈ ఎమ్మేల్యేలకు ఇంకా కాంగ్రెస్‌లోకి ప్రవేశం లభించలేదు- పైగా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లుగా ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖలు రాసి, ఏఐసీసీలో మాత్రం విలీన ప్రక్రియ పూర్తి అయినట్లుగా ప్రకటించారు.) శరద్ పవార్, తృణమాల్ కాంగ్రెస్ మాదిరిగా బయటి నుంచి మద్దతుగా ఉండి ఉంటే ఈ తిప్పలు తప్పేవనేది గొల్లుమంటున్నారు. కానీ పార్టీని మరింత కాలం నడపలేకనే చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి అతి తక్కువ కాలంలో పార్టీని నామరూపాలు లేకుండా చేసుకున్న సరికొత్త చరిత్రతో చిరు రికార్డులకెక్కడం కొసమెరుపు.

కనిపించని శత్రువు సెల్‌ టవర్‌ TV5




కనిపించని శత్రువు సెల్‌ టవర్‌
* కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న సెల్‌ టవర్లు 
* ప్రమాణాలు పాటించని ప్రొవైడర్లు 
* మార్కెట్‌ పెంచుకునేందుకు నిబంధనలు గాలికి
* ప్రాణాల్ని మింగేస్తున్న రేడియేషన్‌ భూతం
* వీధికో సెల్‌టవర్‌ 
* స్కూళ్లు, హాస్పిటల్స్‌, అపార్ట్‌మెంట్స్‌ పైనే టవర్లు 
* మారణాయుధాలుగా సెల్‌టవర్లు 
* తరుముకొస్తున్న రేడియేషన్‌ భూతం 
* టవర్లతో శారీరక, మానసిక సమస్యలు
* సంతాన సాఫల్యతపై రేడియేషన్‌ ఎఫెక్ట్‌ !
* డిప్రెషన్‌, మతిమరుపు గ్యారంటీ
* నిద్రలేమి, ఏకాగ్రతతో సతమతం
* బలవుతున్న చిన్నారులు 
* మింగేస్తున్న రేడియేషన్‌ భూతం 
* నివ్వెరపరుస్తున్న సర్వేలు 

సెల్‌ఫోన్‌.. ఆధునిక ప్రపంచంలో ఒక అత్యవసర వస్తువు. బీద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరి చేతిలో ఇప్పుడు సెల్‌ఫోన్ కామనైపోయింది. దీంతో వినియోగదారులకు సేవలందించేందుకు ప్రొవైడర్లు ఇబ్బడి ముబ్బడిగా టవర్లు నిర్మిస్తున్నారు. అయితే నిబంధనలను అతిక్రమిస్తూ రాజకీయ అండతో నిర్మిస్తున్న సెల్‌ టవర్లు ప్రజల పాలిట మృత్యుదేవతల్లా తయారవుతున్నాయి. 

ప్రాణాంతకంగా మారుతున్న నాన్‌ ఆయనైజింగ్‌ రేడియేషన్‌పై స్పెషల్‌ స్టోరీ మీ కోసం. హైటెక్‌ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి సెల్‌ఫోన్‌ మామూలైపోయింది. ఇన్‌ఫర్మేషన్‌ షేర్‌ చేసుకునేందుకు ఒక్కో వినియోగదారుడు డ్యుయెల్‌ ఫోన్‌ సదుపాయమున్న రెండు మూడు మొబైల్స్‌ వాడుతున్నారు. ఇటు మార్కెట్‌ పెంచుకునేందుకు మొబైల్‌ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు రేట్లు తగ్గిస్తూ కస్టమర్లకు దగ్గరవుతున్నాయి.

అయితే సిగ్నల్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లు ఎక్కడ పడితే అక్కడ సెల్‌ టవర్లను నిర్మిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు , జనావాసాలు, అపార్ట్‌మెంట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్‌ అనే తేడా లేకుండా ప్లేస్ దొరికితే చాలు తాటిచెట్లంత టవర్లు దర్శనమిస్తున్నాయి. వీటి నుంచి వెలువడుతున్న దుష్పరిణామాలు ప్రపంచానికి కొత్త రకం మారణాయుధాలుగా పరిణమిస్తున్నాయి. 

కనిపించని శత్రువుగా పరిణమిస్తున్న సెల్‌ టవర్లతో శారీరక, మానసిక సమస్యలు తలెత్తున్నాయి. రాజకీయ, కార్పోరేట్ ఒత్తిడితో మెట్రో నగరాల్లో దాదాపు ప్రతీవీధికొకటి చొప్పున టవర్లు జనావాసాల్లో వెలుస్తున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్న సెల్‌ టవర్లు రేడియేషన్‌ను వెదజల్లుతున్నాయి. దీంతో ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలు వాటిల్లుతున్నట్లు పలు సర్వేల్లో తేలింది. 

ముఖ్యంగా తలనొప్పి, నిద్రలేమి, డిప్రెషన్‌, ఏకాగ్రత కోల్పోవడం, మతిమరుపు, ఒళ్లనొప్పులు సంభవిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సంతాన సాఫల్యతపై కూడా రేడియేషన్‌ ఎఫ్టెక్ట్‌ చూపుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టవర్ల నుంచే కాకుండా అన్ని రకాల ఫోన్ల నుంచి రేడియేషన్ ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. 

వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ముసలీముతకా, పిల్లా పాపా అందరూ రేడియేషన్‌ భారిన పడాల్సివస్తోంది. ప్రమాణాలు పాటించకుండా కుప్పలు, తెప్పలుగా వెలుస్తున్న సెల్‌ టవర్లను కట్టడి చేయకుంటే ప్రపంచాన్ని రేడియేషన్‌ భూతం మింగేయడం ఖాయం. 


t v 5




successnews

Friday, December 16, 2011

అటు ఇటు కాని దారిలో చిరంజీవి: అధిష్టానం ఎటు చేస్తుందో..?!!



ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదంటే అది చిరంజీవి చలవే. ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఆపద్బాంధవుడు చిరంజీవిని కాంగ్రెస్ ఇప్పుడు "యూజ్ అండ్ త్రో"లా చూస్తున్నట్లుంది. అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కేశాం.. ఇక మరో 6 నెలలు వరకూ ఢోకాలేదు.... ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూశారు అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్టు ఉంది. చిరంజీవికి రాష్ట్రంలో ఓ కీలక పదవి కట్టబెడతారన్న వార్తలు ఊపందుకోగానే.. ఇక్కడి నేతలు వ్యూహాత్మకంగా చిరు స్టామినాకు రాష్ట్రస్థాయి పదవి సరిపోదనీ, కేంద్రస్థాయి నప్పుతుందని వ్యాఖ్యానించారు. సరే కేంద్రంలో చూస్తే అక్కడివారు వార్త అలా వచ్చిందో లేదో అడ్డుపుల్లలు తీసుకుని రెడీ అయిపోయినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 
చిరంజీవికి కేంద్రంలో బెర్త్ ఇస్తే రాష్ట్ర వ్యవహారాలతో టచ్ పోతుందనీ, పైపెచ్చు ఆయనకంటే పార్టీలో ఇప్పటికే ఎంతోమంది సీనియర్లున్నారు కనుక వారిని కాదని చిరుకు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. దీంతో చిరంజీవి అటు కేంద్రానికి కాక ఇటు రాష్ట్రానికి కాకుండా రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయినట్లున్నారు. 
ఐతే చిరంజీవి ఆశలన్నీ అధిష్టానంపైనే పెట్టుకున్నారు. సోనియా గాంధీ ఎలా అంటే.. అలానే నడుచుకుంటామని ఆది నుంచీ చెపుతూ వస్తున్నారు. పదవుల విషయంలో ఎన్ని వార్తలు తిరుగాడుతున్నా.. ఆయన మాత్రం పెదవి విప్పడంలేదు. పార్టీలో తన స్థానం ఏమిటో మేడంకు తెలుసుననీ, ఆ ప్రకారం వారు నిర్ణయం తీసుకుంటారని చెపుతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించడమే తన పని అని చెపుతున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

సౌర తుఫాను - పెనుప్రమాదం !


 వాతావరణంలోని మాగ్నటోస్పియర్ ఘోరంగా దెబ్బతిననుంది! ఫలితంగా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు పని చేయడం మానేస్తాయి! విమాన రాకపోకలు నిలిచిపోతాయి! సెల్ ఫోన్లు పని చేయవు! టీవీలు మోగవు! విద్యుత్ సరఫరా చేసే పవర్‌గిడ్‌లు అతలాకుతలమైపోతాయి! మొత్తంగా భూమిపై జీవనం పెను ప్రమాదాన్ని ఎదుర్కొనబోతున్నది! అవును. 2012 చివరిలో లేదా 2013 ప్రారంభంలో సూర్యుడిపై సంభవించే శక్తిమంతమైన సౌర తుఫాను ఈ దుష్పరిణామాలకు కారణం కానుంది! ప్రపంచం మొత్తం అంధకారమయం కానుంది! ఈ ఆందోళనలను సాక్షాత్తూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యక్తం చేయడం విశేషం! 

2013లో సంభవించే సౌర తుఫాన్‌తో భూమికి పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచమంతా అంధకారం అలుముకోక తప్పదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ హెచ్చరించింది. సౌర తుఫానుపై కంప్యూటర్ మాడ్యూల్స్ ద్వారా అధ్యయనం నిర్వహించి నాసా ఈ విషయాన్ని తేల్చింది. దీంతో భూమి నుంచి చాలా ఎత్తులో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్8) ఉపగ్రహాలు దెబ్బతిని సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుందని హెచ్చరించింది. విమాన రాకపోకలు, సెల్‌ఫోన్, టీవీ లాంటి సౌకర్యాలలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. దీంతోపాటు ఆ కణాలు పవర్‌క్షిగిడ్ ట్రాన్స్‌పార్మర్‌లను కూడా దెబ్బతీసే అవకాశం ఉండడంతో విద్యుత్ కష్టాలు తప్పవని పేర్కొంది. తుఫాన్ కారణంగా భూమికి ప్రమాదం లేదని 93 మిలియన్ మైళ్ల దూరమున్న భూమిపైకి అగ్ని గోళాలను వెదజిమ్మే శక్తి సూర్యునికి లేకపోవడమేనని స్పష్టం చేసింది. 

సీఎంఈ అంటే?

సౌర పవనం, ప్లాస్మా (జీవ ద్రవ్యం), అయస్కాంత క్షేత్రాలు భారీ విస్ఫోటనం చెంది సూర్యుని కాంతి మండలంలోకి మంటలు చెలరేగి.. అంతరిక్షంలోకి దూసుకురావడాన్నే సీఎంఈ (కరోనల్ మాస్8 ఎజెక్షన్) అంటారు. ఈ ప్రక్రియనే సోలార్ ఫ్లేర్‌గా కూడా పిలుస్తారు. బలమైన సీఎంఈ బిలియన్ టన్నుల ప్లాస్మా కలిగి ఉండి మేఘాల రూపంలో గంటకు 10 లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది. బలహీన అయస్కాంత క్షేత్రమున్న గ్రహాలు, ఉపగ్రహాలపైనున్న వాతావరణాన్ని సీఎంఈ నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

చంద్రునికి పొంచి ఉన్న ముప్పు

నాసా పరిశోధకుల ప్రకారం..చంద్రునిపై వాతావరణం చాలా బలహీనంగా ఉంటుంది. 2 రోజుల సీఎంఈ ప్రయాణంలో చంద్రుని ఉపరితలంపైనున్న 100- 200 టన్నుల పదార్థం కనుమరుగవుతుంది. అయితే సౌరతుఫాను వల్ల చంద్రునికి జరిగే నష్టం వాస్తవమా? కాదా? అనే విషయం 2013లో తాము ప్రయోగించే ‘ల్యూనార్ అట్మాస్పియర్, డస్ట్ ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్’ (ఎల్‌ఏడీఈఈ)తో తేలపోనుందని నాసా వెల్లడించింది. ఈ సీఎంఈ వల్లే గతంలో అంగారకునిపై ఉన్న వాతావరణం పూర్తిగా నాశనమైపోయి ఉంటుందని నాసా పేర్కొంది. సౌర తుఫాను వల్ల ఈ గ్రహంపై వాతావరణం ఎలా తుడుచుకుపెట్టుకపోయిందో.. 2013లో అరుణ గ్రహంపైకి ప్రయోగించే మార్స్ అట్మాస్పియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (ఎంఏవీఈఎన్) వాహక నౌక పరిశోధించనుందని వెల్లడించింది. 

యుగాంతం ఎందుకు అసాధ్యం..

2012లో ఏర్పడే సీఎంఈతో భూమిపై ఉన్న వాతావరణం అంతా దెబ్బతిని యుగాంతం సంభవిస్తుందని కొందరు వదంతులు సృష్టించారు. దీనికి వారు చెప్పిన కారణం.. ‘సౌరవ్యవస్థ ప్రస్త్తుతం 11 ఏళ్ల జీవిత చక్ర ప్రమాణాన్ని పెంచుకోవడంలో నిమగ్నమై ఉంది. అయితే 2012 చివర్లో సంభవిస్తున్నట్లుగా భావించే సోలార్ ఫ్లేర్‌తో గనుక సౌర జీవిత చక్రవూపమాణాన్ని పెంచుకునే ప్రక్రియ ఒకేసారి సంభవిస్తే భూప్రళయం తప్పద’ని హెచ్చరించారు. దీనిపై నాసా స్పందిస్తూ.. ‘ఇలాంటి సౌరచక్రం శతాబ్దాలుగా జరుగుతోంది. ఇంతకుముందు ఈ రెండు ప్రక్రియలు ఒకేసారి సంభవించినా భూమికి ఎలాంటి హానీ కలగలేదు. అదేవిధంగా సోలార్ ఫ్లేర్ అనే ఈ ప్రక్రియ 2012లో కాకుండా 2013 లేదా 2014లో సంభవించే అవకాశం ఉంద’ని సమాధానం ఇచ్చింది. అయితే దీనికున్న శక్తి మేరకు భూవాతావరణంపై తీవ్ర ప్రభావం మాత్రం చూపగలదని హెచ్చరించింది.

manatelugunela

Wednesday, December 14, 2011

చిరంజీవి పెట్టిన కొత్త డిమాండ్‌తో గందరగోళ పరిస్థితి నెలకొంది.


 కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్‌ మరింత బలోపేతమయిం దని భావిస్తున్న తరుణంలో చిరంజీవి పెట్టిన సరికొత్త డిమాండ్‌తో జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో వణుకు మొదలయింది. చిరంజీవికి జాతీయ స్థాయిలో ప్రాధా న్యత కల్గిన పాత్ర వుంటుందని ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం ఆయన కు హామీ ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే ఆయనకు కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించ వచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి బలా న్నిస్తూ చిరంజీవి ఇటీవల అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయి పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె ముందు వాగ్దానం చేశారు. 
ఇందుకు ప్రతిఫలంగా విలీనం ప్రక్రియ పూర్తి కాగానే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామంటూ అధిష్ఠానంలోని నాయకులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరు తన రాజకీయ చతురతను ప్రదర్శిం చారు. తాను కేంద్రంలో ఏ పదవులు కోరుకోవడం లేదని, రాష్ట్రంలోనే ప్రజలకు అందుబాటులో వుంటూ సేవ చేయాలని భావిస్తున్నట్లు బాంబు పేల్చారు. తనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి పదవి కావాలని నెమ్మదిగా మనసులో మాట బయట పెట్టినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ వర్గాలలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ్రపజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత తనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆదరించారని, అక్కడే వుండి తన ప్రజలకు సేవలందించాలని భావిస్తున్నట్లు ఆయన తన మనసులో మాట బయటకు చెప్పడంలో అంతరార్థం వేరే వుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన పావులు కదుపుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 
ఏ రాజకీయ అనుభవం లేని చిరంజీవి ఈ స్థాయిలో మెలిక పెడతారన్నది ఊహించని పరిణామమేనని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు సైతం అవాక్కవుతున్నారు. చిరంజీవి తొలిసారిగా రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడం ప్రారంభించారని ఆందోళన పడుతున్నారు. ఆయన తన 16 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం శుభపరిణామమే అయినా ఆయన కోరికలో నిగూఢ రాజకీయ చతురత కనపడుతున్నదని బెంబేలెత్తుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండు రోజులుగా ఢిల్లీలొ మకాం వేసి చిరంజీవి వింత పోకడపై సమీక్షలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. మంగళవారం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఎంపీలు వుండవల్లి అరుణ్‌ కుమార్‌, కేవీపీ రామచంద్రరావు తదితర ఎంపీలతో బొత్స కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తున్నది. బుధవారం ఉదయం బొత్స రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో సమావేశమై ఈ పరిణామంపై చర్చించే అవకాశం వుంది.

                                                                                            .......మేజర్‌న్యూస్‌

విశాఖ డెయిరీ మరోసారి పాల ధరను పెంచింది...



విశాఖ డెయిరీ యాజమాన్యం మరోసారి పాల ధరను పెంచింది. నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి పెరగడంతో సామాన్యులకు మరింత భారం కానుంది. ఈ ఏడాది ఆగస్టులో పెంచడం తెలిసిందే. తాజాగా లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచారు. అరలీటరుకు రూపాయి పెరగనుంది. ఈ ధరలు ఈ నెల 16నుంచి అమల్లోకి వస్తాయని డెయిరీ యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు, పాల కొనుగోలుదారులు, పాల రవాణా ఖర్చులు, ప్యాకింగ్ ఫిల్మ్ ధరలు, యంత్ర సామగ్రి, విడిభాగాల ధరలు పెరగడంతో డెయిరీ నిర్వహణ కష్టతరమవుతోందని వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా ధరను పెంచాల్సి వచ్చిందని పేర్కొంది

ఆడ శిశువుని వదిలివేశారు !!!


ఆడ శిశువుని వదిలివేశారు
విశాఖపట్నం: లంకెలపాలెం జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఆడ శిశువుని వదిలివేశారు. స్థానికులు ఆ బిడ్డని ఆస్పత్రిలో చేర్చారు.

ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తా


పాయకరావుపేట; రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందక పోతే రాజకీ య సన్యాసం చేస్తానని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. డిసెంబర్ 12 సోమవారం స్థానిక లక్ష్మీ పంక్షన్ హాల్‌లో పాయకరావుపేట నియోజకవర్గ విస్తృత సమావేశం జరిగింది. ఈసమావేశంలో చెంగల వెంకట్రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో జరిగిన ఓటమి తాను ఓటమిగా భావించడం లేదన్నారు. కొత్తగా మండలం కలవడం, కొత్త పార్టీతో తనకు తక్కువ మెజార్టీతో ఓడిపోయానన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పాయకరావుపేట నియోకవర్గం టి.డి.పి.కి కంచుకోటగా ఉందన్నారు. జనవరి 1వ తేదీ నుంచి మద్యం విక్రయాలను ఎం.ఆర్.పి. ధర కన్నా ఎక్కువ అమ్మితే తాను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మండలంలోని పి. ఎల్.పురం భూములు పేదలకు పంచేందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈవిషయమై శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల వద్ద ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాకర నూకరాజు కంటే ఒక రోజు ఎక్కువగా ఎమ్మెల్యేగా ఉండాలని, అత్యధిక 22 వేలకు పైగా ఓట్లు మెజార్టీ సాధించాలని ఆశగా ఉందని తెలిపారు. ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కార్యకర్తలంతా గ్రామాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన అన్నారు.

పదవుల కోసం విలీనం కాలేదు


విశాఖపట్నం ; పి.ఆర్.పి. మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలుచేసే ప్రయత్నంలో వ్యవస్థాపకుడు చిరంజీవి నిమగ్నమై ఉన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనుటకు డిసెంబర్ 12 సోమవారం ఇక్కడకి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సామాజిక న్యాయం కొరవడిందని ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి 104 మంది బి.సి.లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అనుభవ రాహిత్యం వలన అధికారంలోకి రాలేకపోయినప్పటికీ తాను ఆశించిన ఆశయాల సాధనకు విశాల భావాలు కలిగిన అంతర్గత స్వాంతత్య్రమున్న కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరిగిందన్నారు. కేవలం పదవుల కోసం విలీనం అయ్యామన్న ఆరోపణలు అర్ధరహితమన్నారు.
ఎటువంటి షరతులు లేకుండా ఆనాడు విలీనానికి చిరంజీవి అంగీకరించడం జరిగిందన్నారు. ఇప్పుడిప్పుడే తన ఆశయాలను, ప్రజలుకు ఇచ్చిన హామీలను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పి.సి.సి. అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. చిరంజీవి సూచనను కాంగ్రెస్ పార్టీ తూచ తప్పకుండా ఆవిష్కరించడానికి సుముఖంగా ఉందని గంటా పేర్కొన్నారు. మరొకవైపు వేర్పాటు వాదంతో రాష్ట్రం అట్టుడికి పోతున్న సమయంలో టి.డి.పి, అర్ధం లేని డిమాండ్‌తో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, కిరణ్ ప్రభుత్వం మాదిరి దేశంలో మేర ఏ ప్రభుత్వం రైతులకు మేలు చేయలేదని ఛాలెంజ్ చేసారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాట మేరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా 17 మంది పి.ఆర్.పి. ఎమ్మెల్యేలు ఓటు వేయడం జరిగిందన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారనున్నారని జోస్యం చెప్పారు. ఈకార్యక్రమంలో పినపోలు వెంకటేశ్వరరావు, పతివాడ చిన్నంనాయుడు, కంచిపాటి జగన్నాధరావు, గుమ్ముడు సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 13, 2011

147 మంది కొత్త ఎమ్మెల్యేలతో వచ్చేనెల 9నుంచి విశాఖ పర్యటన


హైదరాబాద్: ప్రస్తుత శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. 147 మంది కొత్త ఎమ్మెల్యేలతో వచ్చేనెల 9, 10, 11 తేదీల్లో విశాఖ జిల్లా పాడేరు, అరకు, విశాఖపట్నంలలో పర్యటన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు

ఇంటర్నెట్ హద్దుల్లో ఉండాల్సిందేనా?!


ఒకరికొకరు రాసుకునే ఉత్తరాలను- తోక లేని పిట్ట తొంభై ఆమడలు ప్రయాణిస్తుందంటారు. ఇది గతం. ఇప్పుడు ఇంటర్నెట్, ఈమెయిల్స్ దే రాజ్యం. ఈ నెట్ పిట్ట తొంభై కాదు కదా... ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలూ క్షణాల్లో చుట్టి వస్తుంది. జస్ట్ క్లిక్ మనిపిస్తే చాలు. చక చక పరుగులు పెడుతుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, గుగుల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ... నెటిజనుల అభిలాషమేరకు.. అంతర్జాల సంచలనాలు. ఇతర ఎన్నో వెబ్ సైట్లు. ఎవరికి వాళ్లు దున్నిపడేస్తున్నారు. ఉన్నవీ లేనివీ కుమ్మరించి పారేస్తున్నారు. ఒక్కోసారి ఆ పైత్యానికో విచక్షణ వుండదు కదా అనిపిస్తుంది. అంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎంత అడిగే వారు లేకున్నా.. అంత బరితెగింపా? అని ఆశ్చర్యపోతున్నారు సామాన్యులు.
నెట్... దృశ్య ప్రాధాన్య కామధేనువు. కంటి ముందు ఎన్నో కమనీయదృశ్యాలు. వాటితో పాటు మరెన్నో కఠినమైన విషయాలు. అంతుచిక్కని రహస్యాలు. అనుకోని గందరగోళాలు. తెలిసినవీ తెలియనివీ అనేకానేక మతలబులు. నెట్ కు అడిక్ట్ అయితే చాలు- అంతే సంగతులు. ఒక పద్ధతి పాడు ఉండదు. అవసరమైనంత సమాచారం వరకైతే పరవాలేదు. అనవసర సమాచారం అనవసరంగా పోగవుతోంది. వద్దన్నా వదలని దృశ్యాలు.. ఇతర సమాచారాలు. విసిగి వేసారేలా చేస్తున్నాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు. 


సెల్ఫ్ డిసిప్లిన్ లేక పోవడంతో, సెల్ఫ్ ఎడిట్ అంతకన్నా లేక పోవడంతో... వెబ్ సైట్లలో అసందర్భ సమాచారం, అనవసరంగా పేరుకుపోతోంది. కాస్త సరదాగా అన్నట్టు మొదలైన ఈ విధానం.. ఇప్పుడో వరదగా మారింది. అనవసర దురదగా తయారైంది. ఎంత దారుణం అంటే, ఎవరికైనా కాస్త ఇమేజీ వుంటే దాన్ని డామేజీ చేయడానికి వెనకాడ్డం లేదు. అడ్డగోలుగా రాయడం, మార్ఫింగ్ వంటి నీచ విధానాల ద్వారా వారి ముఖచిత్రాలను అసహ్యంగా తయారు చేయడం- వంటి వాటితో చేయాల్సినదంతా చేస్తున్నారు. బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర నటులకే తప్పడంలేదీ తిప్పలు. 
ఐ హేట్ బాలయ్య డాట్ కామ్ వంటి వివాదాలు తెలిసిందే. బాలకృష్ణ వంటి మాస్ హీరోలను ఎన్ని రకాలుగా అవమాన పరచాలో అన్ని రకాలుగా అవమాన పరచారు. ఆయన ఈ సైట్ నిర్వాహకుల వివరాలేమిటో తెలుసుకోమని కోరుతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికొచ్చిందీ వ్యవహారం. 
ఇటీవల వెలుగులోకి వచ్చిన గ్రేటాంధ్రా డాట్ కామ్ వ్యవహారం గురించైతే చెప్పనే అక్కర్లేదు. ఒక పద్ధతి ప్రకారం నటులు ఇతర రాజకీయనాయకుల మీద కావాలని సంచలన వార్తలను రాస్తూ పట్టుపడిన విధం తెలిసిందే. తమ తమ వెబ్ సైట్ల హిట్లను పెంచుకోవడంలో భాగంగా కొందరిని పనిగట్టుకుని అవమానపరచడమనే నీచానికి దిగజారిందీ వెబ్ సైటు. దానికి తోడు కొందరి మీద ప్రత్యేకాభిమానం- మరి కొందరి మీద దురభిమానం దృష్టిలో పెట్టుకుని పాడు వార్తలు వండి వర్చాడంలో దిట్టగా పేరుంది ఈ వెబ్ సైట్ నిర్వాహకుడికి. దీంతో గ్రేటాంధ్రా డాట్ కామ్ నిర్వాహకుడు వెంకట రెడ్డిని పోలీసులు అరెస్టు చేసారు కూడా. ఇదేనా పద్ధతి? అని అడిగేవారు లేకపోవడంతో ఇలాంటి సైట్ల నిర్వాహకులకు ఒక అడ్డు అదుపూ లేకపోతోంది. 
ఇలాంటివెన్నో విషయాలు. ప్రాంతీయ విభేదాలు రెచ్చుగొట్టడాలు. దారుణమైన బూతు రాతలు. ఆడ-మగ విచక్షణ కోల్పోతూ.. అసభ్యకరమైన దృశ్యాలను తయారు చేయడాలు.  వాటి ద్వారా సంచలనం సృష్టించాలనే నీచమైన పద్ధతులు.. ఇప్పుడో ఫ్యాషనైపోయింది.  అంతెందుకు.. నిన్న మొన్న చిరంజీవి కాబోయే కోడలు ఉపాసన మీద కూడా నెట్లో ఇలాంటి దారుణాలకే ఒడిగట్టారు కొందరు. స్వీయ నియంత్రణతో తప్ప మరే విధంగానూ అడ్డుకట్ట వేయలేం అన్నట్టుగా తయారైంది. అది తెలుసుకోకుంటే భవిష్యత్తు మరింత దారుణంగా తగలబడేట్టుంది చూస్తుంటే.

Monday, December 5, 2011

షేర్ ఖాన్.. నువ్వు పడగొడితే నేను నిలబెడుతా...


షేర్ ఖాన్.. నువ్వు పడగొడితే నేను నిలబెడుతా...


“నిలబెడతాం అంటే నిలబెట్టి తీరుతాం: దట్సిట్” ఇది ఈ వార్త వ్రాసే క్రోద్ది నిమిషాల ముందు అవిశ్వాసం పై మద్దత్తు ఇచ్చే విషయంలో చిరంజీవి వ్యాఖ్యలు. తన
నివాసంలో పి‌ఆర్‌పి ఎం‌ఎల్‌ఏ లతో సమావేశం అయిన చిరంజీవి, మీడియా వారితో మాట్లాడుతూ తన ఎం‌ఎల్‌ఏ లకు కాంగ్రెస్ పార్టీలో చిన్నచూపు వాస్తవమే అని, కానీ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి తదితరులు ఇచ్చినభరోసా మేరకు ఈ మనస్పర్ధాలు, తేడాలు ఇక ముందు ఉండవని భావిస్తున్నామని అన్నారు.
అందుకే ప్రభూత్వానికి మద్దత్తు తెలిపి, ప్రభూత్వం పడిపోకుండా మద్దత్తు ఇస్తామని చిరంజీవి అన్నారు. మా ఎం‌ఎల్‌ఏ లకు నియోజకవర్గం పరిధిలో కొంత అసంతృప్తి ఉందని, నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు సక్రమంగా సాగటం లేదని తమ ఎం‌ఎల్‌ఏ లు భావిస్తున్నారని, ప్రభూత్వం నుంచి తగిన మద్దత్తు లభించటం లేదని తన ఎం‌ఎల్‌ఏ లు తెలిపారని చిరంజీవి అన్నారు.
దీనిపై పి‌సి‌సి చీఫ్ బొత్సా, ముఖ్యమంత్రి మునుముందు ఇలా జరగదని, మీ ఎం‌ఎల్‌ఏ లు కూడా ఇప్పుడు మా పార్టీ వారేనని, తేడా ఏమీ లేదని తెలిపారని చిరంజీవి అన్నారు. కేంద్రం నుంచి గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ కూడా తనతో ఫోన్లో మాట్లాడారని చిరంజీవి అన్నారు.

Saturday, November 26, 2011

రాష్ట్ర ప్రజలకు వరాలు! ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నేడు ముఖ్యమంత్రి తాయిలాలు


ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కొత్త వరాలను ప్రకటించేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించనున్న ‘రచ్చబండ’ వేదికగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త వరాలను ప్రకటించనున్నారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాద్‌నగర్ బయలు దేరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి ఎటువంటి వరాలను ప్రకటిస్తారన్నది ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా అంతు చిక్కడం లేదు. మహిళలకు జీరో వడ్డీపై రుణాలు ఇచ్చే పధకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. డ్వాక్రా మహిళలకు ప్రస్తుతం పావలా వడ్డీపై రుణాలు ఇస్తుండగా దాన్ని జీరో వడ్డీ చేయాలన్న అభిప్రాయంతో ఉన్నారు. పేద ప్రజలకు వంద రూపాయలకే నిత్యావసర సరుకుల ప్యాకేజి కూడా ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్యాకేజి గురించి ముఖ్యమంత్రి ఇంతకు ముందే ప్రకటించారు. ‘ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి కొన్ని వరాలను ప్రకటించనున్నారు’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నాయకుడు ఒకరు చెప్పారు. అయితే అవేటిమన్నది వివరించడానికి ఆయన నిరాకరించారు. ముఖ్యమంత్రే ప్రకటిస్తారు కదా, చూస్తూండండి’ అని ఆయన అన్నారు.
ప్రతి నెలా ఒక్కో కొత్త పథకాన్ని ప్రకటించాలన్నది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయం. ప్రధానంగా మహిళలకు ఒక ప్రత్యేక పథకం గురించి ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. అయితే ఈ పథకాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించాలా లేక ఇప్పుడే ప్రకటించాలా అన్నది ఆయన ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించినట్లయితే ఓట్ల కోసమే ప్రకటించారన్న అనుమానం కలగవచ్చని, ముందుగానే ప్రకటించి అమలు చేసినట్లయితే మహిళలను ఆకర్షించుకోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ‘ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది, పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రకటించేందుకు అవకాశం ఏర్పడింది’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీవ్ యువ కిరణాలు, రూపాయికే కిలో బియ్యం పథకం, ఇందిర జల ప్రభ వంటి పథకాలను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా ప్రకటించబోయే పథకం ఎలా ఉంటుంది, ఎవరిని ఉద్దేశించింది అన్నది ఆసక్తిగా మారింది. ఇలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో షాద్‌నగర్‌కు బయలుదేరి వెళతారు. అక్కడ అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. 5.96 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 34.31 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన వివిధ పనులను ప్రారంభిస్తారు. అనంతరం షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

సొంత పార్టీ నేతలే కిషన్ జీ ఎన్‌కౌంటర్‌కి కారణమా?

సొంత పార్టీ నేతలే కిషన్ జీ 

ఎన్‌కౌంటర్‌కి కారణమా?


మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు, అసోం వేర్పాటువాద సంస్థ ఉల్ఫాకు సంబంధం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే సొంత పార్టీ నేతలే కిషన్ జీ  మరణానికి కారణం అయ్యారనే సందేహాలు వున్నాయి .దక్షిణ, ఉత్తర భారతాన్నంతా ఏదో మేరకు ప్రభావితం చేయగలుగుతున్న మావోయిస్టు పార్టీకి 'ఈశాన్యం' కొరకరాని కొయ్యగా మారింది.  ఈ నేపధ్యం లో అసోంలో పాగా వేసేందుకు గత పది, పదిహేనేళ్లుగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది . బెంగాల్ సరిహద్దుల్లో ఉండటం, భద్రతా బలగాల దాడుల తాకిడి తక్కువగా ఉండి షెల్టర్‌కు అనువుగా ఉండటం వల్ల కూడా అసోంపై కన్నేశారు. దీనికోసం ఉల్ఫాతో చాలాకాలంగా చర్చలు జరుపుతున్నారు.  ఈ చర్చల కోసం 2008లో కిషన్‌జీ బంగ్లాదేశ్ వెళ్లి బారువాను కలుసుకున్నారు. మావోయిస్టులకు అవసరమైన మౌలికమైన వనరులకు సంబంధించిన మద్దతు ఇవ్వటానికి అంగీకరిస్తూనే.. 'దాడుల' ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చారు. దీంతో ఇకపై ఉల్ఫాతో చర్చలకు వెళ్లరాదని మావోయిస్టులు నిర్ణయించారు. అసోంలో స్వయంగానే ఎదిగే ప్రయత్నం చేశారు. అప్పర్ అసోం లీడింగ్ కమిటీ (యూఏఎల్‌సీ) అనే సంఘం పెట్టి.. విస్తరణ వ్యూహాలను అమలు చేశారు. రిక్రూట్‌మెంట్, విరాళాల సేకరణపై దృష్టి సారించారు. ప్రస్తుతం వంద మందికిపైగా అసోమీలు మావోయిస్టు పార్టీలో చేరినట్టు సమాచారం. "అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో మావోయిస్టుల శిక్షణా శిబిరాలు ఉన్నాయి. సాదియా, తిన్‌సూకియా జిల్లాలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఒక్కప్పుడు ఇవి ఉల్ఫాకు పెట్టని కోటలు. తమ ప్రాంతంలోకి మావోయిస్టులు రావటంపై స్థానిక ఉల్ఫా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారుఅయితే, ఒక్క ఉల్ఫాయే కాదు, పోలీసులు, సైన్యం కూడా 'మావోయిస్టు' ప్రమాదాన్ని గుర్తించి  నిఘాను పెంచి గాలింపు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులు దొరకలేదు గానీ, ఉల్ఫాకు చెందిన కార్యకర్తలు మరణించారు. దీంతో  బారువా కలవరపడ్డారు. మావోయిస్టులను అసోం నుంచి తరిమేయాలని నెల క్రితం ఆయన తన కేడర్‌కు ఆదేశాలు జారీ చేశారని, దీని కోసం ఉల్ఫా కొన్ని దళాలను కూడా ఏర్పాటు చేసిందని నిఘా వర్గాల సమాచారం . పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న కిషన్‌జీ ఈ దశలోనే అసోంలో అడుగు పెట్టారు . బెంగాల్‌లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టు కోటను కూల్చివేయడంతో కీలక పాత్ర  పోషించిన ఆయనకు..'అసోం' టాస్క్ అప్పగించారని తెలుస్తోంది. అలా అసోం చేరాడు  అనుకున్న కిషన్‌జీ గురువారం బెంగాల్‌లోని జంగల్‌మహల్‌లో శవమై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అసోంలోనే పట్టుకొని, బెంగాల్‌లో కాల్చి చంపి ఉంటారన్న అనుమానాన్ని సానుభూతిపరులు వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగాల్ కమిటీలో కిషన్‌జీ తీరు నచ్చని నేతలే బలగాలకు ఉప్పందించారనే   పుకార్లు  కూడా  వున్నాయి .అధికార వర్గాలు చెబుతున్నాయి. "అసంతృప్త నేతల నుంచి కిషన్‌జీ ఆనుపానులను భద్రతా బలగాలు తెలుసుకుని   ఉచ్చు బిగించి, కిషన్‌జీని ఎన్‌కౌంటర్‌లో అంతం చేశాయి'' అనే వాదనలు విన్పిస్తున్నాయి.

Thursday, November 24, 2011

ఏడాది కిరణం


ఏడాది కిరణం
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉరికిస్తున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన ఏడాది దిశగా అడుగుల వేస్తున్నది. ఈ నెల 25తో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కానుండడంతో ఇటు ప్రభుత్వం అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంది. వైఎస్‌ ఆకస్మిక మరణంతో ఇటు ప్రభుత్వం, అటు పార్టీ ల్లోనూ తీవ్ర సంక్షోభం నెలకుంది. అంతేకాకుండా ప్రత్యేక వాద ఉద్యమాలు ఉవ్వెత్తిన వెగిసిపడ్డాయి. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సంక్షోభ కోరల్లో చిక్కుకొంది. అనంతరం 14 నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజెటి బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో పరిస్థి తులు చక్కబడలేదు.
ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో గతంలో మంత్రిగా ఎటువంటి అనుభవం లేకపోయి నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన మార్క్‌ పాలన తో నల్లారి ఏడాది పాలనకు చేరువకావడం ఆయన మంత్రివర్గ సహచరుల సైతం నమ్మశక్యం కావడం లేదు. కేబినెట్‌లో ఒకరిద్దరు తప్ప మెజారిటీ మంత్రులు నల్లారిపాలనకు బ్రహ్మరథం పడుతూ ఆయనపై పూర్వి విశ్వాసం ఉంచడం గమనార్హం. వచ్చే ఎన్నిక ల్లోనూ నల్లారి సారథ్యంలో తమ పార్టీ ముందుకు పోతోందని మెజారిటీ మంత్రులు అభిప్రాయ పడుతున్నారు. వైఎస్‌ సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్రవేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలన సంస్కరణలకు అన్ని స్థాయిల్లో పదును పెడుతూ, మరోవైపు ఖాళీ ఖజానాను తిరిగి పట్టాలెక్కించడం బాగా కలిసివచ్చిందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా గ్రీన్‌ఛానల్‌ విధానాన్ని తెరమీదకు తెచ్చి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎటువంటి నిధుల సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పన్నుల వాత కాస్త ఎక్కువైనప్పటికీ.. మెజారిటీ ప్రజల ఆంక్షాలు నెరవేర్చే దిశగా నల్లారి సర్కార్‌ సంక్షేం దిశగా పరుగులెట్టింది.
రచ్చబండతో ప్రజలకు మరింత చేరువగా…
ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు నల్లారి మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో వైఎస్‌ ఇమేజ్‌ను కూడా నల్లారి క్రాస్‌ చేశారని ఆయన కేబినెట్‌ సీనియర్‌ మంత్రులు చెబుతున్నారు. లక్ష 16 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, రాజీవ్‌ యువ కిరణాల పేరుతో ప్రైవేట్‌రంగంలో వచ్చే మూడేళ్లల్లో 15 లక్షల ఉద్యోగాల రూపకల్పన నల్లారి ఇమేజ్‌ పెంచింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఈ పథకం ఎంతగానో ఆకట్టుకొన్నది. అదే విధంగా రూపాయికే కిలో బియ్యం పథకం పేద ప్రజలకు ఎంతో ఊరట నిచ్చింది. రెండోవ దశ రచ్చబండతో 35 లక్షల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సామాజిక ఫించన్లు తదితర పథకాలు నల్లారి పాలనా సుస్థిరతకు ఎంతోగానో తోడ్పడినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

Monday, November 21, 2011

సీబీఐ విచారణపై చంద్రబాబు బ్లాక్‌మెయిలింగ్!!!


 సీబీఐ విచారణపై చంద్రబాబు బ్లాక్‌మెయిలింగ్!!!



 క్రమ ఆస్తులపై సీబీఐ విచారణ నిర్వహిస్తే అవిశ్వాస తీర్మానం పెడతామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాసరాజు గాజువాక 61వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని 21-11-2011ఆదివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో రోజా ప్రసంగించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారన్నారు. అందువల్ల అవిశ్వాసం పెట్టాలంటే ఆయన అరికాళ్లకు చెమట్లు పడుతున్నాయన్నారు. అధికారంలోకి రాలేమని తెలిసే చంద్రబాబునాయుడు అవిశ్వాసానికి ముందుకు రావడం లేదన్నారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. 
గతంలో పదవుల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చుట్టూ తిరిగిన నేతలు ఆయన మరణానంతరం రోశయ్య చుట్టూ, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నారన్నారు. వైఎస్ బతికున్న కాలంలో వానపాముల్లా ఉండే కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇప్పుడు నాగుపాముల్లా బుస కొడుతున్నారన్నారు. వారు బుస కొట్టడానికి తప్ప దేనికీ పనికి రారన్నారు. ఎందరు నాయకులు, పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. వైఎస్ ప్రతిష్టను చూసి ప్రజలు ఓట్లేశారు తప్ప, కిరణ్‌కుమార్‌రెడ్డిని, బొత్స సత్యనారాయణను చూసి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏనాడూ రైతు సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుతం రైతు సమస్యలపై పగటి వేషగాడిలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ మరణం తరువాత రాష్ట్రం చిన్నాభిన్నమైందన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ర్త అధ్యక్షురాలు నిర్మలా కుమారి మాట్లాడుతూ వైఎస్ మరణానంతరం రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. పార్టీ అర్బన్ కన్వీనర్ జి.వి.రవిరాజు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను దోచుకున్న చంద్రబాబునాయుడిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో అతని గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. గాజువాక నియోజకవర్గ నేత తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, నాయకులు ఉరుకూటి అప్పారావు, చొప్పా నాగరాజు, కొయ్య ప్రసాదరెడ్డి, అంగ అప్పలరాజు, వంశీకృష్ణ యాదవ్, చట్టి అప్పారావు (బాబు), నక్క వెంకట రమణ, పరదేశి, షౌకత్ అలీ, పల్లా చినతల్లి తదితరులు పాల్గొన్నారు.

Thursday, November 17, 2011

నిజాయితీని నిరూపిస్తాం


నిజాయితీని నిరూపిస్తాం
తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ విజయమ్మ వేసిన పిటిషన్‌లో గతంలో ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆరోపించిన అంశాలే ఉన్నాయని తెలుగుదేశంపార్టీ పేర్కొంది. అనేక కేసులు విచారణకు అర్హత లేవని కోర్టులే తోసిపుచ్చాయని, అవే అంశాలతో మళ్ళీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఆపార్టీ దుయ్యబట్టింది. విజయమ్మ పిటిషన్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విచారం వ్యక్తంచేసింది.ప్రతివాదికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, పిటిషన్‌ ఒకటైతే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రొచ్చులోకి దిగి, ఆ రొచ్చును ఇతరులపైకి చల్లే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 1975 నుంచి చంద్రబాబుపై ఇవే ఆరోపణలు చేసి 18సార్లు కోర్టుల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహా అనేక మంది కాంగ్రెస్‌ నేతలు పిటిషన్లు వేశారని, వాటిని నిరూపించలేక కొన్ని ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్లు విచారణకు అనర్హమైనవని కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ కేసులో కూడా గతంలో చేసిన ఆరోపణలపై పిటిషన్‌ వేసి ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. 1999, 2004 మధ్య ఐదేళ్ళపాటు ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చర్య తీసుకోమని కోరలేదంటూ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఈ అంశాలకు అర్హత లేదని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టంచేసిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రశ్నించడం, కించపరచడం తమ ఉద్దేశం కాదని, కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తిని కూడా సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తాము న్యాయ వ్యవస్థనుగానీ, సిబిఐగానీ ప్రశ్నించడం లేదని, విజయమ్మ పిటిషన్‌ ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు గత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నామని బొజ్జల అన్నారు. సింగపూర్‌లోని హోటల్‌ ఫోటోను ఇంటర్నెట్‌ నుంచి తెచ్చి చంద్రబాబు బినామీ ఆస్తి అని ఆరోపించారని, అయితే ఆ హోటల్‌ యాజమాన్యం గురించి కనీస ప్రస్తావన చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలో వైట్‌హౌస్‌ ఫోటో తెచ్చి అది కూడా చంద్రబాబు బినామీ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు.

Wednesday, November 16, 2011

ధరలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు...


ధరలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు – రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
‘పేద కుటుంబాలు మూడు పూటలా కడుపునిండా అన్నం తినాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీని కోసమే రూపాయికి కిలో బియ్యం అమలుచేస్తున్నాం. కానీ మిగిలిన ధరలు భారీగా పెరిగిపోయినందున ఎలా కుటుంబాన్ని నెట్టుకురావాలన్నదే మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్న ప్రశ్న అని నాకు తెల్సు. అందుకే సంచలనాత్మకమైన రీతిలో ధరల నియంత్రణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, మంత్రిని కూడా నియమించనున్నాం…’ పశ్చిమగోదావరి రచ్చబండలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన కీలకమైన ప్రకటన ఇది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో 15-11-2011తెది మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూపాయికి కిలో బియ్యం పథకం ప్రయోజనాలు, విశిష్టతలను వివరిస్తూనే మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోందని అంగీకరించారు. పేదలకు ప్రయోజనకరంగా ధరలను నియంత్రించడానికి వీలుగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించడానికి మానిటరింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తాము తీసుకున్న రుణం లక్ష రూపాయల వరకు ఏడాదిలోపే తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండబోదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ వడ్డీ భారాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు. మరోవైపు మహిళలకు త్వరలోనే మంచి శుభవార్తను ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగానే పావలా వడ్డీ రాయితీ అందరికి అందుతోందా అంటూ డ్వాక్రా మహిళలను ప్రశ్నించగా కొంతమంది వస్తోందని, మరికొందరు రావటం లేదని సమాధానాలు చెప్పటంతో పావలా వడ్డీ పథకంలో ఇదొక సమస్యగా మారిందని, ప్రభుత్వం కూడా గుర్తించిందని సిఎం చెప్పారు. దీనిని పరిష్కరించడానికి ఇకనుంచి నేరుగా గ్రామాల్లోని సంఘాలకు వడ్డీ రాయితీ జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేసమయంలో వేదికపై ఉన్న మంత్రి సునీతాలక్ష్మారెడ్డిని దీనికి సంబంధించి ఉత్తర్వులు వెంటనే వెలువడేలా చూడాలని ఆదేశించారు. దీంతో మహిళలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.
రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చెప్పారు. ధాన్యానికి మద్దతుధర విషయంలో అదనంగా 120 రూపాయల బోనస్ చెల్లించాలని ఇప్పటికే ప్రధానమంత్రిని కోరామన్నారు. మత్స్య, పౌల్ట్రీల నుండి నాలా ఛార్జీలు వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలకనున్నట్లు సిఎం ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలో పెద్దఎత్తున సాగుతున్న చేపలు, రొయ్యల ఎగుమతులను మరింత ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతురుణాలపై అమలుచేస్తున్న ఏడు శాతం వడ్డీ రేటును మహిళా గ్రూపులకు కూడా అమలుచేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. పావలా వడ్డీ కంటే తక్కువకే మహిళా సంఘాలకు రుణాలు అందించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిని అయిదవ కాంటూరు నుంచి మూడవ కాంటూరుకు తగ్గించడానికి ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సిఎం వరాల జల్లు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, ఉండవల్లి అరుణకుమార్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన ప్రారంభం
గర్భిణీలను ఆదుకోవడానికి కేంద్రం ప్రకటించిన ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజనను రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఏలూరులో ఇందుకు సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో 56వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చడానికి ఏడున్నర కోట్ల రూపాయలను ఆయన విడుదల చేశారు. అంతకుముందు దాదాపు 125 కోట్ల రూపాయలతో ఏలూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

పెట్రోలు ధ‌ర త‌గ్గిందోచ్‌..


పెట్రోలు ధ‌ర త‌గ్గిందోచ్‌..
పెరుగుట తప్ప తరుగుట ఎరుంగని పెట్రోలు ధర తగ్గింది. ఔనా.. నిజమేనా!? అని ఆశ్చర్యపోయి నా.. పెరుగుట తరుగుట కొరకే అని మీరు అనుకున్నా ఇది నిజం. చమురు కంపెనీలు పెట్రోలు ధర లీటరుకు రూ.1.85 తగ్గించాయి. స్థానిక పన్నులను కూడా కలుపుకొంటే వాహనదారుడికి సుమారు రూ.2.40 వరకు ఉపశమనం కలగనుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ తగ్గింపు అమల్లోకి రానుంది. దాదాపు మూడేళ్లలో పె ట్రోలు ధరలు తగ్గడం ఇదే తొలిసారి. లీటరుకు రూ.1.85 తగ్గించడంతో స్థానిక పన్నులు కూడా కలుపుకొని ఢిల్లీలో పెట్రోలు రూ.2.22 తగ్గింది. ముంబైలో 2.34; కోల్‌కతాలో 2.31; చెన్నైలో 2.35 తగ్గింది. అంతర్జాతీయంగా ధరలు త గ్గడం కారణంగా గతంలో ధరలను సవరించినప్పటి నుంచి లీటరు పెట్రోలుకు మాకు రూ.1.85 లాభం వచ్చిందని, ఆ లాభాన్ని వినియోగదారులకు అందించాలని భావిస్తున్నామని ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ఎస్ బుటోలా చెప్పారు.

చిరంజీవి కేంద్రమంత్రి కాబోతున్నారా..?


చిరంజీవి కేంద్రమంత్రి కాబోతున్నారా..?
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డంఖా భజాయించి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవికి అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల అది నెరవేరడంలో జాప్యం జరుగుతోంది. దీనిపై పిసిసి అధ్యక్షుడుగా ఉన్న బొత్సను ఎవరైనా ప్రశ్నిస్తే చిరంజీవి కేంద్ర మంత్రి అవడం ఖాయం.అది కూడా మరి కొద్ద నెలలలోనే అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారని అడిగితే అది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం . కావాలంటే వేచి చూడండి అని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాజ్య సభ ఎన్నికలలో చిరంజీవికి టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే అంతకుముందే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని బొత్స అభిప్రాయ పడుతున్నారు.మంత్రి పదవిలోకి వచ్చాక ఆరు నెలలలోగా పార్లమెంటుకు ఎన్నికైతే సరిపోతుంది కనుక ఇబ్బంది ఉండదని అంటున్నారు. చిరంజీవి మా పార్టీ నాయకుడు అని బొత్స సంతోషంగా చెబుతున్నారు. అయితే ఈ మద్య చిరంజీవి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా చేస్తానని అనడంతో రకరకాల ప్రచారాలు వచ్చాయి. ఆయన రాష్ట్ర పదవితోనే సరిపెట్టుకొంటారేమోనన్న భావన కలిగింది. కాని ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు బొత్స చెబుతున్న మాటలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ఎంతకాలంలో చిరంజీవి కేంద్ర మంత్రి అయి ఆయన అభిమానులను అలరిస్తారో చూడాలి.

Sunday, November 13, 2011

మన్మోహన్ ప్రకటనపై కేసీఆర్ మండిపాటు



మన్మోహన్ ప్రకటనపై కేసీఆర్ మండిపాటు
కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు ?
 తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మన్మోహన్  చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ప్రజలకు 'భయపడకండి.. నేనున్నాను' అంటూ అభయమిచ్చారు. . ఆయనకు ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్య విలువలపై గౌరవం లేదని మండిపట్టారు.
తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండీ చూడలేని కబోధి ప్రధాని మన్మోహన్ అని దుయ్యబట్టారు. 'తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తుంది.. ఇదే నా శాపం' అంటూ దని శాపనార్థాలు పెట్టారు. 'తెలంగాణ ప్రజలారా బాధపడకండి, భయపడకండి ...మీతో నేనున్నాను.. అన్ని రకాల పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుందాం' అంటూ కేసీఆర్ ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రజల కోపాగ్నికి కాంగ్రెస్ రుచి చూస్తుంది. 
బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు: ఈటెల 
ప్రధాని మన్మోహన్‌సింగ్ బాద్యతారాహిత్యంగా మాట్లాడారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎంపీలో తెలంగాణ అంశాన్ని చేర్చడంతో పాటు పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించారు. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు.. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించాలి. తెలంగాణకు అనుకూలంగా దేశ వ్యాప్తంగా 28 పార్టీల లేఖలను ప్రధానికి అందించాం.ఇప్పుడు దానిని పక్కనపెట్టి అన్ని పార్టీలను కన్సల్ట్ చేయాలని మాట్లాడడం తగదు..నిర్ణయం ప్రకటించాల్సిన కాంగ్రెస్ దొంగదారులు వెతుకుతోంది..తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంతత, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసమే అడుగుతున్నారు. జాతీయ సమస్య అని ప్రధాని ఇప్పుడు అంటున్నారు.. 14 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఏమైంది..అన్ని రాష్ట్రాలు ఆత్మగౌరం వల్ల చేసిన ఉద్యమాల ఫలితంగానే ఏర్పడ్డాయి. చరిత్రను ప్రధాని అవలోకనం చేసుకోవాలి.. 
చావు కబురు చల్లగా చెప్పినట్టుంది: యాష్కీ
ప్రధాని వ్యాఖ్యలు చావు కబురు చల్లగా చెప్పినట్టుంది.. దీనిని పూర్తిగా విభేధిస్తున్నాం... ఇదే నిజమన్న భయాందోళన మాలో ఉంది.. ఇదే యూపీఏ ప్రభుత్వ నిర్ణయమని అనుకుంటున్నాం. తెలంగాణను అడ్డుకునే లగడపాటి రాజ్‌గోపాల్, కేవీపీ రామచంద్రరావులు ఇలాంటి ప్రకటనలే వస్తాయని గత రాత్రి నుంచే అంటున్నారు. అదే వాస్తమౌతోంది. తెలంగాణ వాదులంతా ఈ సమయంలో ఏకమవ్వాలి..యూపీఏ నిర్ణయం కూడా ప్రధాని చెప్పనట్టే ఉంటుంది.. ఈ విషయంలో టీడీపీ కూడా కుమ్మక్కయింది. 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతానని చంద్రబాబు అభయమిచ్చాడు.. దానికి కేంద్రం కూడా తలొగ్గింది.. ప్రజల అభిప్రాయానికి ఏ ప్రభుత్వమైనా తలొంచాల్సిందే.. లేదంటే దిగిపోవాలి..ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆదివారం సమావేశమవుతుంది. ఇందులో కెకె , జానారెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులతో చర్చిస్తాం.. ఏమి చేయాలన్న దానిపై అందులో నిర్ణయిస్తాం. యూపీఏకు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు. 
కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలి: హరీశ్
ప్రధాని ప్రకటన పూర్తి బాధ్యతా రాహిత్యం... తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేసి వెంటనే బయటకు రావాలి, రోజుకో ప్రకటన చేస్తూ ఆపార్టీ తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. తెలంగాణ ప్రజల ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఒకలా... అవసరం తీరాక మరోలా మాట్లాడితే ఎలా? 
తెలంగాణ ఇవ్వలేమని చెప్పలేదు: వినోద్
ప్రధాని కొత్తగా మాట్లాడిందేమి లేదు. ఐదు నెలల క్రితం యూపీ పీసీసీ సోనియా, రాహుల్ సమక్షంలో ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానించారు. ..అలాగే తెలంగాణ కూడా ఇస్తారని అన్నారు. అయితే ఇదంతా రెండో ఎస్సార్సీనా..లేక నేరుగా ఇస్తారా.. అన్నది వేచి చూడాలి. తెలంగాణను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలే నష్టపోతారు. ప్రధాని తెలంగాణ ఇవ్వలేమని స్పష్టం చేయలేదు...కష్టమని చెప్పలేదు. 
కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేయండి : ఎర్రబెల్లి
తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెస్, తెస్తామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ప్రధాని ప్రకటనతో కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. పదే పదే మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేయాలి. ఈ మోసానికి శిక్షగా ప్రభుత్వాలను కూల్చాలి. 
రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు: కోదండ
పార్లమెంటులో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు. పూటకో మాట మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమాన పరిచారు. కాంగ్రెస్ కో ఖతం కరో.. తెలంగాణకో హాసిలో కరో నినాదాన్ని చేపడతాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎటు వైపో తేల్చుకోవాలి. 


ఖండిస్తున్నాం: గద్దర్, విమలక్క, సూర్యం
ప్రధాన మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మరోసారి నిలువెల్లా దగా చేసిందనడానికి మన్మోహన్ వ్యాఖ్యలు నిదర్శనం. కేవలం పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం, ప్రజలు అందుకు సిద్దపడాలని పిిలుపునిస్తున్నాం. 
విభజన వాదనలో పసలేకనే ప్రకటన : పరకాల
ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న వాదనలో పసలేదు. చిదంబరం లాంటి వారు వారి రాష్ట్రాల విభజనకు ఒప్పుకుంటారా? తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు కలిసి ఉండాలని కోరుకొంటున్నారు. అందుకే ప్రధాన మంత్రి ఈ ప్రకటన చేశారు

Friday, November 11, 2011

రాసాభాసగా మారిన విశాఖ రచ్చ బండ కార్యక్రమం


రాసాభాసగా మారిన విశాఖ రచ్చ బండ కార్యక్రమం









విశాఖలోని గాజువాకలో జరిగిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. గతంలో మొదటి విడత రచ్చబండ కార్యక్రమంలో ఆర్జీలు పెట్టుకున్న ప్రజలకు రేషన్ కార్డులు, ఫించన్లు, ఇందిరమ్మ గృహాలు ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని నినాదాలు చేశాయి. దీంతో స్సందించిన అధికారులు అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో సభ ప్రారంభమైంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ఎమ్మెల్యే, మేయర్‌, కమిషనర్‌ల ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేయటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Wednesday, November 9, 2011

ప్రజలు కరెప్ట్ అయితే నాయకులు ఏం చేస్తారు..?: జయసుధ


సినిమా రంగం నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి సికింద్రాబాద్‌ ఎం.ఎల్‌.ఎ.గా ఎన్నికయ్యారు నటి జయసుధ. అటు రాజకీయాల్లోనూ తన సేవ చేస్తూనే మరోవైపు తనకు లైఫ్‌ ఇచ్చిన సినిమా రంగాన్ని వదలనని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమారంగంలో బిజీగా ఉన్నానంటున్న జయసుధ... రాజకీయాల గురించి చర్చించారు. ఆమె చెప్పిన పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ'లో మీ పాత్ర ఎలా ఉంటుంది? 
చాలా మంచి పాత్ర. ఇంటిలో తల్లి, బిడ్డ రిలేషన్స్‌ ఎలా ఉంటాయో సినిమాల్లోనూ అలాగే ఉన్నాయి. నిఖిత నా కుమార్తెగా నటించింది. కొన్ని సీన్స్‌ చేస్తున్నప్పుడు నా ఇంట్లో మా పెద్దబ్బాయితో మాట్లాడే సందర్భాలు గుర్తుకు వస్తున్నాయి. చాలా నాచురల్‌గా దర్శకుడు శ్రీధర్‌ తెరకెక్కించారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? 
రాజకీయాల్లో ఉండటం వల్ల కొన్ని తగ్గించాను. ఇది కాక.. 'సోలో' సినిమా చేశాను. బాలకృష్ణతో 'అధినాయకుడు' (ఇంకా పేరు పెట్టలేదు) చిత్రంలో నటించాను. తొలిసారిగా ఆయన కాంబినేషన్‌లో చేయడం చాలా థ్రిల్‌గా అనిపించింది. ఇందులో బాలకృష్ణ మూడు తరాలకు చెందిన మూడు పాత్రలు పోషించారు. అందులో మొదటితరం చెందిన పాత్రకు భార్యగా చేశాను. 

ఇప్పటి సినిమాలు మీకెలా అనిపిస్తున్నాయి? 
ఇప్పటి యూత్‌ మంచి సినిమాలు తీయాలి. చాలావరకు కొన్నిలిమిట్స్‌ వరకే పరిమితం అవుతున్నారు. ప్రేమ అనే కాన్సెప్ట్‌తో చాలా చిత్రాలు వచ్చాయి. రొటీన్‌గా ఉంటున్నాయి. ఇటీవలే 'నైనా' తెలుగులో ప్రేమఖైదీ చూశాను. ప్రేమికుల మధ్య సంబంధాలు ఇలాగ కూడా చూపించవచ్చా అని ఆశ్చర్యపోయాను. గొప్ప ప్రయత్నం. ఆడకపోయినా కంటెంట్‌, తీసే విధానం బాగుంది. 

మొన్నీమధ్య వచ్చిన 'సెవెన్త్‌ సెన్స్‌' గొప్పప్రయత్నం. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇటువంటి కొత్తకొత్త చిత్రాలు రావాలి. చెప్పే విధానంలో కొత్తదనం ఉంటేనే ఆకట్టుకుంటుది. బొమ్మరిల్లు తీసుకుంటే.. అందులో ప్రేమలో రకరకాల షేడ్స్‌ ఉన్నాయి. ప్రేయసీప్రియులతోపాటు తల్లిదండ్రులతో ప్రేమ సంబంధాలు సరికొత్తగా ఉన్నాయి. అలా కొత్త ప్రయత్నాలు తెలుగులో ఇంకా రావాలి.

రాజకీయాల్లో మీరు ఏం నేర్చుకున్నారు? 
అబ్బో! రాజకీయాల్లో చాలా నేర్చుకున్నాను. రోజూ కొత్తకొత్త విషయాలు తెలుస్తాయి. ఎన్నో రకాల మీటింగ్స్‌, వ్యక్తుల్ని కలుస్తుంటాం. ట్రూ పొలిటిషన్‌ అవ్వాలంటే కనీసం 10 ఏళ్ళ సర్వీస్‌ ఉండాలి. అయినా రాజకీయాలు కావాలని నేను వెళ్ళి ఎవర్నీ అడగలేదు. వై.ఎస్‌.ఆర్‌. పిలిచి నీకు సోషల్‌ వర్క్‌ అంటే ఇష్టం కదా... ఇక్కడకు వచ్చి చేయమన్నారు.

'ఆరోగ్యశ్రీ' అప్పుడే మొదలైంది. దాని ద్వారా ఇంకా పేదలకు మరింత సేవ చేయాలని అనుకున్నాను. ప్రతీదీ అది కావాలి.. ఇది కావాలి.. అంటూ ప్రజలు బిచ్చగాళ్ళలా అడుక్కుతిన్నట్లు రాజకీయాలపై ఆధారపడం నాకు నచ్చలేదు. అందుకే ఏదో చేయాలని ఈ రంగంలోకి వచ్చాను.

మరి అనుకున్నది చేయగలిగారా? 
ఏమీ చేయలేమని తెలిసిపోయింది. ఏదో చేయాలని ట్రై చేస్తున్నాం.

అంటే...?!! 
ముందుగా ప్రజలు లైఫ్‌స్టైల్‌ మార్చుకోవాలి. అప్పుడే ఏదైనా చేయగలం. నా నియోజకవర్గంలో 65 బస్తీలున్నాయి. వాటిలో తిరుగుతుంటే... హైటెక్స్‌ అంటూ గొప్పలు చెప్పుకునే మన సిటీలో ఇంత దరిద్రంగా బస్తీలున్నాయా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అన్నిచోట్లా వాటర్‌, డ్రైనేజీ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. రోడ్డుపై పేదలకు కట్టిన టాయ్‌లెట్స్‌ ఆర్భాటంగా ఓపెన్‌ చేస్తారు. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు. అధికారుల్ని అడిగితే.. అది అంతే మేడమ్‌. వారికి ఎంత చేసినా అంతేనంటారు. 

పేదలకు క్వార్టర్స్‌ కట్టారు. నాలుగు అంతస్తులు ఉన్నాయి. లిఫ్ట్‌ ఉండదు. ఒకవేళ కడితే.. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయరు. చెత్తవేయడానికి సెపరేట్‌ ప్లేస్‌‌లు ఉన్నాయి. కానీ బస్తీల్లో రోడ్డుపైనే చెత్తనంతా వేస్తారు. విపరీతమైన కంపు... దోమలు.... 200 రూపాయలకు ఓటువేసి.. ప్రజలు కరెప్ట్‌ అయితే.. సమస్యల గురించి అడిగే హక్కు ఉండదు.

మీవంతుగా ఏదైనా చేశారా? 
చాలా చేయాలనుకున్నా.. కానీ ఏమీ చేయలేకపోతున్నా... నాలాంటి వందమంది జయసుధలు వచ్చినా ఏమీ చేయలేం అని తెలుసుకున్నాను. ప్రజల్లో చైతన్యం లేదు. స్వలాభమే చైతన్యం. నాలాలపై ఇళ్లు కడుతుంటారు. దాంతో డ్రైనేజీ పొంగుతుంది. తర్వాత వాళ్ళే వచ్చి.. సమస్యలు వస్తున్నాయ్‌ అని ఎం.ఎల్‌.ఎ.లపై తిరగబడతారు. అది ధర్నా వరకు దారితీస్తుంది. 

ఇదంతా చూసి హ్యూమన్‌ రైట్స్‌ వారు వస్తారు. వారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా.. ఒక వేళ తెలిసినా.. ఏదో పోరాటం చేయాలని... ప్రజలకే సపోర్ట్‌ చేస్తారు. ప్రజలు ఏం చేశారు. ఎందుకిలా అయిందని వారికి చెప్పరు. అధికారులు ఎంత చెప్పినా వినరు. మీడియా దీన్ని చిలువలు పలవలు చేస్తుంది. దీంతో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తాం. తర్వాత మళ్లీ సమస్య మామూలే. నాలాలపై ఇళ్లు కట్టడం మానరు. దాన్ని కూలిస్తే.. అదే పెద్ద నేరం... ముందుగా మనం శుభ్రంగా ఉండాలి. ఇంటి పరిసరాల్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ప్రజల్లో లేనంతవరకు ఏమీ చేయలేం.

నిర్మాతగా మారే ఆలోచన ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి? 
నేను నిర్మాతగా మారే ఆలోచన లేదు. మా పెద్దబ్బాయి నిహార్‌కపూర్‌ డిజిటల్‌ టెక్నాలజీ ఆస్ట్రేలియాలో చేశాడు. తను దర్శకుడు అవ్వాలని కోరిక. ఇక రెండోవాడు.. శ్రియన్‌కపూర్‌ మంచి షూటర్‌. నేషనల్‌ లెవల్‌ కాంపిటేషన్‌లో కూడా పాల్గొన్నాడు.. అని ముగించారు.