హైదరాబాద్ : సాధమైనంత త్వరలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నారని అంబటి రాంబాబు తెలిపారు. గురువారం ఆయన జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. పార్టీ ఎప్పుడు పెడతామనేది ఇప్పుడే చెప్పలేమని, అయితే పార్టీని వైఎస్ జగనే స్వయంగా ప్రకటిస్తారన్నారు. అప్పటివరకూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోపాటు, మీడియా కూడా వేచి ఉండాలన్నారుపార్టీ ఏర్పాటుపై విధివిధానాలు ఖరారు అయ్యాక రాష్ట్రంలోని.మార్గ నిర్ధేశకులని అన్ని జిల్లా శ్రేణులు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంబటి రాంబాబు తెలిపారు. ప్రజలే తమ ఆయన అన్నారు. వారి ఆశీస్సులు జగన్కు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో బలీయమైన పార్టీగా జగన్ పార్టీ అవతరించబోతుందన్నారు. పులివెందుల, కడప నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలలోపే కొత్త పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన జగన్మోహన్రెడ్డికి లేదన్నారు. సర్కార్ ఉంటుందో, కూలుతుందో తమకు సంబంధం లేదని అంబటి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment