Saturday, January 15, 2011

జగన్ బండారం బయటపెట్టడానికి గంటసేపు చాలు!: శంకర్

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు, మాజీ కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి అవినీతిని నిరూపించడానికి గంట సేపు చాలుననని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు అన్నారు. 
వై.ఎస్. జగన్ అవినీతిని నిరూపించేందుకు తన వద్ద నిరూపిత సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఎక్కడైనా జగన్ బండారాన్ని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని శంకరరావు తెలిపారు. వై.ఎస్. జగన్ అవినీతిని నిరూపించలేకపోతే తన ఆస్తులను ప్రజలకు ఇచ్చేస్తానని ఆయన సవాలు విసిరారు. సైకోఫ్యాన్స్ వల్లే జగన్ పార్టీ పెడుతున్నారని, వై.ఎస్. జగన్ తన ప్రవర్తన మార్చుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని శంకరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి కంటే ఒక మెట్టు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు శంకరరావు తెలిపారు. 
తెలంగాణ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని శంకరరావు చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎన్నికపై తమ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని శంకరరావు మీడియా ప్రతినిధులతో అన్నారు. 2012లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment