:పెట్రోల్ ధరలను మళ్లీ లీటరుకు 2.54 పైసలు పెంచారుశానివారము అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. పన్నులతో సహా మూడు రూపాయల వరకు పెరిగింది. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్ ధరలు రెండు సార్లు పెరిగాయి. ఏడాది కాలంలో ఏడు సార్లు పెరిగాయి. పెట్రోల్ ధర పెంపుపై ఆగ్రహంపెట్రోల్ ధర పెంపుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆందోళనలు చేశాయి. విశాఖపట్నంలో సిపిఐ, సిపిఎం వేరువేరుగా నిరసన తెలిపారు. ఆటోలకు, మోటార్ సైకిళ్లకు తాళ్లు కట్టి లాగారు. కర్నూలులో జడ్పీ మాజీ చైర్మన్ బండి అనంతయ్య ఎప్పటిమాదిరిగానే తనదైన ప్రత్యేక శైలిలో నిరసన తెలిపారు. అనంతయ్య ఆధ్వర్యంలో రెండు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు.ఈ ధరల పెంపుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇలా పెట్రోల్ ధరలు పెంచుతూపోతే మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుందని వాపోయారు. కేంద్ర స్థాయిలో జరిగే కుంభకోణాలను నిరోధించి, ఆ డబ్బుని సబ్సిడీల రూపంలో ఇచ్చి మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని కొందరు సలహా ఇచ్చారు.
No comments:
Post a Comment