Wednesday, January 19, 2011

దాసరి పిలిస్తే వెళ్లి చూశా.. ఏమీ అర్థం కాలేదు: రోశయ్య

కోట్లు పెట్టి సినిమాలు తీయడం కష్టమేకానీ, దానికంటే ఆ తర్వాత చేసే ప్రమోషన్‌ కూడా అంతే కష్టం. అందుకే పబ్లిసిటీ లేని చిన్నసినిమాలు ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి. హైటెక్‌ యుగంలో విడుదలరోజే నెగెటివ్‌ టాక్‌ వస్తే చాలు ఇక థియేటర్లకు ప్రేక్షకులు రావడం మానేస్తారు. దాంతో ఎలాగో మైకుల ముందు సక్సెస్‌, సూపర్‌హిట్‌, అదుర్స్‌ అంటూ తెగ మాట్లాడేస్తుండాలి. ఇటువంటి కోవలో చాలా చిత్రాలే ఉన్నాయి. 
అగ్రహీరోల చిత్రాలు విడుదలకు ముందు ప్రోగ్రెస్‌ చెప్పడానికి నిరాకరించే నిర్మాత, దర్శకులు చిత్రం విడుదలయ్యాక అటో ఇటో అయితే తప్పనిసరిగా మీడియా ముందుకు వస్తుంటారు. సి. అశ్వనీదత్‌ చిత్రాలు అన్నీ ఇలాగే ఉంటాయి. అలాగే మరికొంతమంది అగ్రనిర్మాతలుకూడా ఈ బాటలోనే పయనిస్తారు.
తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'పరమవీరచక్ర' విషయం తీసుకుంటే ఇదే స్పష్టమవుతోంది. విడుదలనాడే హైదరాబాద్‌ క్రాస్‌రోడ్‌లోని శాంతి, సంథ్య ధియేటర్లలో మ్యాట్నీకి కలెక్షన్లు పడిపోయాయి. కొత్త సినిమా అయితే బాల్కనీ టిక్కెట్లు బ్లాక్‌లో కూడా దొరకవు. అటువంటిది బ్లాక్‌ టిక్కెట్లు అసలు రేటుల తీసుకోండని బతిమాలడం మరీ విచిత్రం. ఇందుకుకారణం. ఈనాటి ట్రెండ్‌కు తగినట్లుగా సస్పెన్స్‌, ఉత్సాహం రేకెత్తించేట్లుగా సినిమా లేకపోవడమే. 
బోయపాటి శ్రీను తీసిన 'సింహా'లో డాక్టర్‌ మర్డర్‌ చేయడం వంటి ట్విస్ట్‌లతో యువతనూ ఆకట్టుకున్నాడు. పరమవీచక్రలో దేశద్రోహూలు దేశంలో ఉన్నారని చెప్పి వారిని దేశంకోసం త్యాగం చేసిన వ్యక్తిపై ద్రోహి అని ముద్ర వేస్తే దాన్ని ఎలా సాల్వ్‌ చేశాడనేది కథాంశం. ఇదే కథను ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా పలుమార్పులతో చేస్తే మరింతగా బాగుండేదని ఫిలింనగర్‌ కథనం. కానీ దీనికి దాసరి అంగీకరించరు. దీంతో 'నా సినిమాను థియేటర్‌కు వచ్చి చూడడండి' అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

No comments:

Post a Comment