విశాఖ జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మలివిడత ఓదార్పు యాత్రకు రంగం సిద్దమైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు యాత్ర సాగనుంది. ఢిల్లీ దీక్ష కోసం ఈ నెల 8న ఓదార్పును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న జగన్ తిరిగి నేటినుంచి ప్రారంభిస్తున్నారు. సుమారు 320 కిలోమీటర్లు సాగే యాత్ర పాయకరావుపేట నుంచి ప్రారంభమవుతుంది.
వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన ఆరుకుటుంబాలను యువనేత జగన్ ఓదార్చనున్నారు. యాత్రలో పాల్గొనేందుకు జగన్ ఈ ఉదయం పదిన్నరకు విమానంలో రాజమండ్రి చేరుకుని అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా పాయకరావుపేటకు వెళతారు.
No comments:
Post a Comment