Sunday, January 9, 2011

,,జలదీక్ష,, కోసం హస్తినకు పయనమైన జగన్

జగన్ ,ఢిల్లీ ,యాత్ర'కు...
 సికింద్రబాద్‌ స్టేషన్‌కు భారీగా తరలి వచ్చిన నేతలు 
యువనేత జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ యాత్ర సందర్భంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ సందడిగా మారింది....రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు, ప్రజా ప్రతినిధులు హస్తిన వెళ్ళేందుకు తరలి సికింద్రబాద్‌ స్టేషన్‌కు తరలి వచ్చారు. అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ జగన్‌ చేపట్ట దలచిన దీక్షకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని వారు ప్రకటించారు. 

 అభిమానులతో కిక్కిరిసిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ ..
యువనేత జగన్‌ జల దీక్ష చేపట్టేందుకు ప్రత్యేక రైలులో కొద్ది సేపటి కిందటే ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. మరోవైపు జగన్‌ దీక్షకు మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జగన్‌ అభిమానులు, రైతు సంఘం నేతలతో రైల్వేస్టేషన్‌ కిక్కిరిసిపోయింది.

No comments:

Post a Comment