విశాఖ : విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం నామవరం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి వున్న లారీని వ్యాన్ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఆలమూరు వాసులు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
No comments:
Post a Comment