హైదరాబాద్ : పోలీసు శాఖలో హోంగార్డుల వేతనాలను పెంచుతూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు చలపతిరావు, ఉపాధ్యక్షుడు గోవిందరావు, రవీందర్కుమార్, సత్యనారాయణలు సీఎంను కలిశారు. పోలీసు శాఖలో హోంగార్డులుగా పనిచేస్తున్న 30 వేల మంది వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరగా, దానిపై సీఎం సానుకూలంగా స్పందించారు. పోలీసుల సమస్యల గురించి తెలుసుకోవటానికి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులకు సమయం కేటాయిస్తానని చెప్పారు.
No comments:
Post a Comment