Sunday, January 23, 2011


వచ్చే నెల 5, 6 తేదీల్లో చిరంజీవి రాక
విశాఖపట్నం: వచ్చే నెల 5, 6 తేదీల్లో ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి జిల్లా పర్యటనకు వస్తున్నారని స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో మృతి చెందిన రైతులు కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడారు.జిల్లాలో ఏడుగురు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారని, అనకాపల్లి, కశింకోట, యల మంచిలి, ఎస్.రాయవరం, పాయకరావుపేట ల్లో చిరంజీవి పర్యటించి, వారి కుటుంబ సభ్యులను కలుస్తారన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని అధికారులు దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1200 
కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే గంటా రచ్చబండ షెడ్యూల్‌పై చ ర్చించారు 

No comments:

Post a Comment