Sunday, January 2, 2011

పఠనాభిలాషను పెంచుకోవాలి: పార్థ సారథి

విజయవాడ : పఠనా భిలాష ద్వారా వ్యక్తి ఆలోచనా ధోరణి మారుతుందని రాష్టమ్రంత్రి కె.పార్థసారథి అన్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 22వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని మంత్రి శనివారం సాయంత్రం ప్రారంభించారు. 11 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 290 మంది ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 22 ఏళ్లుగా నిర్విరామంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తూ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నగరానికి తలమానికంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పీయూష్‌కుమార్, బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment