Saturday, January 15, 2011

రాష్ర్టమంతా ,,సంక్రాంతి,, సందడి

కళ కళలాడుతున్న పల్లెలు
మకర సంక్రాంతిని రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. తెలుగు పండుగల్లో దీనికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. సూర్యుడు మేషాది రాసుల్లో సంచరిస్తూ మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకొంటారు. పన్నెండు రాసుల్లో సంచరించే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు. మకరసంక్రాంతి రోజున సూర్యోదయానికే ముందే తలంటు స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. 
నువ్వులనూనెతో శివుని చెంత దీపాన్ని వెలిగిస్తే సకలపాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున నువ్వులను ఏదో ఒక రూపంలో తినాలని చెబుతూ ఉంటారు. అందుకే సంక్రాంతినాడు నువ్వుల అరిసెలకు అంత డిమాండ్‌. అయితే..ఇప్పటి ఫాస్ట్‌ ట్రెండ్‌లో ఈ అరెసలు కూడా రెడీమేడ్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మకరసంక్రాంతి సందర్భంగా వస్త్రదానం చేస్తే ఉత్తమఫలితాలు సిద్దిస్తాయని భక్తులు నమ్మకం. 

No comments:

Post a Comment