Wednesday, January 26, 2011

దేశ సౌభాగ్యానికి మరో హరిత విప్లవం – గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి సందేశం


మొదటి హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన మన దేశం మరింత సౌభాగ్యవంతం కావడానికి మరో హరిత విప్లవం రావాలని రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభ దేవీసింగ్‌ పాటిల్‌ పిలుపు ఇచ్చారు.తొలి హరిత విప్లవం నీటి పారుదల ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం  అయిందనీ, రెండో హరిత విప్లవం వర్షాధార ప్రాంతాలకు విస్తరించవలసి ఉందని ఆమె స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా ఆమె జాతి నుద్దేశించి ప్రసంగించారు. పెరిగిన సంపద అన్ని వర్గాలకూ పంపిణీ అయినప్పుడే అభివృద్ధి సార్ధకమైనట్టని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశం బయటపడటం ఆనంద దాయకమని ఆమె అన్నారు. సంక్షోభానికి ముందు ఉన్న వృద్ధి రేటు కోసం యూపీఏ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, 9 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు.మన దేశంలో ఎక్కువ మంది ఈనాటికీ వ్యవసాయ రంగం మీదే ఆధార పడి జీవిస్తున్న దృష్ట్యా, వ్యవసాయం లాభసాటి అయ్యేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ, అయితే, తరచు సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల స్థితిగతుల్లో మార్పు కనిపించడం లేదని ఆమె అన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు, ప్రోసెసింగ్‌, మార్కెటింగ్‌, పరిశోధన, అభివృద్ధి రంగాలన్నింటిలో రైతులకు భాగస్వామ్యం కల్పించాలనీ, భూమి హక్కులు, ఉత్పత్తులపై వ్యవసాయదారుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. వర్షాధార ప్రాంతాల్లో రైతులకు మెరుగైన రాబడులు అందించే బాధ్యతను కార్పొరేట్‌ రంగం చేపట్టాలనీ, ఆహార భద్రత అత్యంత కీలకమైన అంశమని ఆమె అన్నారు. దేశ ప్రజలందరికీ ఆరోగ్య వసతులు కల్పించాలనీ, మహిళా సాధికారత, ఉన్నత ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావాలనీ,కీలకమైన జాతీయ లక్ష్యాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి జరగాలని ఆమె సూచించారు.పార్లమెంటు ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక అనీ, పార్లమెంటరీ వ్యవస్థ సక్రమంగా ,సజావుగా పనిచేసేట్టు చూడటం ప్రభుత్వం,ప్రతిపక్షాల బాధయత అని ఆమె అన్నారు. పార్లమెంటు గౌరవ మర్యాదలు నిలిచేలా చూడటం అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. ఎంతటి జటిలమైన సమస్యలపైనైనా ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య నిర్మాణాత్మక, సహకార ధోరణి ఉన్నప్పుడే వాటికి పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు.తమ సమస్యలను చట్టసభల సభ్యులు చర్చించి, వాటికి పరిష్కారాన్ని కనుగొన్నప్పుడే ఆ సంస్థల పట్ల గౌరవం నిలుస్తుందనీ, ఇది జరగకపోతే ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిలుతుందని ఆమె హెచ్చరించారు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న నేరప్రవృత్తిని తగ్గించేందుకు, మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇందుకు తల్లితండ్రుల సహకారం కూడా ఎంతైనా అవసరమని ఆమె అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ మంచి ఎక్కడ ఉన్న స్వీకరించే గుణాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. చారిత్రక విలువలను ముందుకు నడిపించే బాధ్యతను యువత చేపట్టాలనీ, భావిభారత పౌరులైన నేటి బాలబాలికలను సత్పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను పెద్దలు చేపట్టాలని ఆమె సూచించారు. సమాజంలో బలహీన, అట్టడుగు వర్గాలకూ, అల్పసంఖ్యాక వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందించడంలో ప్రాధాన్యం ఇవ్వాలనీ, తరతరాలుగా అణగారిన వర్గాలకు చేయూత నివ్వడం ద్వారా వారిని కూడా సమాజంలో ఇతర వర్గాల స్థాయికి తీసుకుని రావాలని ఆమె సూచించారు. అలాగే,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడమే కాకుండా వాటిని పటిష్టంగా అమలు జరపాలని ఆమె సూచించారు.దేశ సౌభాగ్యానికి మరో హరిత విప్లవం – గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి సందేశంమొదటి హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన మన దేశం మరింత సౌభాగ్యవంతం కావడానికి మరో హరిత విప్లవం రావాలని రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభ దేవీసింగ్‌ పాటిల్‌ పిలుపు ఇచ్చారు.తొలి హరిత విప్లవం నీటి పారుదల ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం  అయిందనీ, రెండో హరిత విప్లవం వర్షాధార ప్రాంతాలకు విస్తరించవలసి ఉందని ఆమె స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా ఆమె జాతి నుద్దేశించి ప్రసంగించారు. పెరిగిన సంపద అన్ని వర్గాలకూ పంపిణీ అయినప్పుడే అభివృద్ధి సార్ధకమైనట్టని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశం బయటపడటం ఆనంద దాయకమని ఆమె అన్నారు. సంక్షోభానికి ముందు ఉన్న వృద్ధి రేటు కోసం యూపీఏ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, 9 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు.మన దేశంలో ఎక్కువ మంది ఈనాటికీ వ్యవసాయ రంగం మీదే ఆధార పడి జీవిస్తున్న దృష్ట్యా, వ్యవసాయం లాభసాటి అయ్యేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందనీ, అయితే, తరచు సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల స్థితిగతుల్లో మార్పు కనిపించడం లేదని ఆమె అన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు, ప్రోసెసింగ్‌, మార్కెటింగ్‌, పరిశోధన, అభివృద్ధి రంగాలన్నింటిలో రైతులకు భాగస్వామ్యం కల్పించాలనీ, భూమి హక్కులు, ఉత్పత్తులపై వ్యవసాయదారుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. వర్షాధార ప్రాంతాల్లో రైతులకు మెరుగైన రాబడులు అందించే బాధ్యతను కార్పొరేట్‌ రంగం చేపట్టాలనీ, ఆహార భద్రత అత్యంత కీలకమైన అంశమని ఆమె అన్నారు. దేశ ప్రజలందరికీ ఆరోగ్య వసతులు కల్పించాలనీ, మహిళా సాధికారత, ఉన్నత ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావాలనీ,కీలకమైన జాతీయ లక్ష్యాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి జరగాలని ఆమె సూచించారు.పార్లమెంటు ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక అనీ, పార్లమెంటరీ వ్యవస్థ సక్రమంగా ,సజావుగా పనిచేసేట్టు చూడటం ప్రభుత్వం,ప్రతిపక్షాల బాధయత అని ఆమె అన్నారు. పార్లమెంటు గౌరవ మర్యాదలు నిలిచేలా చూడటం అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. ఎంతటి జటిలమైన సమస్యలపైనైనా ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య నిర్మాణాత్మక, సహకార ధోరణి ఉన్నప్పుడే వాటికి పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు.తమ సమస్యలను చట్టసభల సభ్యులు చర్చించి, వాటికి పరిష్కారాన్ని కనుగొన్నప్పుడే ఆ సంస్థల పట్ల గౌరవం నిలుస్తుందనీ, ఇది జరగకపోతే ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిలుతుందని ఆమె హెచ్చరించారు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న నేరప్రవృత్తిని తగ్గించేందుకు, మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఇందుకు తల్లితండ్రుల సహకారం కూడా ఎంతైనా అవసరమని ఆమె అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ మంచి ఎక్కడ ఉన్న స్వీకరించే గుణాన్ని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. చారిత్రక విలువలను ముందుకు నడిపించే బాధ్యతను యువత చేపట్టాలనీ, భావిభారత పౌరులైన నేటి బాలబాలికలను సత్పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను పెద్దలు చేపట్టాలని ఆమె సూచించారు. సమాజంలో బలహీన, అట్టడుగు వర్గాలకూ, అల్పసంఖ్యాక వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందించడంలో ప్రాధాన్యం ఇవ్వాలనీ, తరతరాలుగా అణగారిన వర్గాలకు చేయూత నివ్వడం ద్వారా వారిని కూడా సమాజంలో ఇతర వర్గాల స్థాయికి తీసుకుని రావాలని ఆమె సూచించారు. అలాగే,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడమే కాకుండా వాటిని పటిష్టంగా అమలు జరపాలని ఆమె సూచించారు.

No comments:

Post a Comment