Saturday, January 15, 2011

కనిపించిన ,మకర జ్యోతి,

శరణు ఘోషతో మార్మోగిన శబరిమల
శబరిమల అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోయింది. కాసేపటి క్రితం మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి కనబడగానే అయ్యప్ప భక్తుల శరణుఘోషతో శబరిమల మార్మోగింది. దాదాపు 60 లక్షలకు పైగా స్వాములు ప్రత్యక్షంగా జ్యోతిని దర్శించుకున్నారు. జ్యోతిని చూడగానే అయ్యప్పలు ఆనందడోళికల్లో మునిగిపోయారు. జ్యోతి దర్శనంతో మాలధారణ ముగిసింది.  శబరిమలైలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనమిచ్చింది. శుక్రవారం రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల ప్రాంతంలో జ్యోతి దర్శనం అయ్యింది. శబరిమలైకు 20 కిలోమీటర్ల పరిధిలో బారులు తీరిన లక్షలాది అయ్యప్పలు జ్యోతి దర్శనం చేసుకున్నారు. శబరిమల అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. మకరజ్యోతి దర్శనానికి లక్షల సంఖ్యలతో వచ్చిన స్వాములతో శబరిమల కిక్కిరిసిపోయింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారి దర్శనాన్ని నిలిపివేసిన ఆలయ వర్గాలు మకరజ్యోతి ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యాయి. మకర జ్యోతి దర్శనం కోసం తరలివచ్చిన అయ్యప్ప స్వాములు పంబ, కరిమలై, అప్పాచిమేడు, పులిమేడు, సన్నిధానం, సరంగుత్తి ప్రాంతాల్లో బారులు తీరారు. శరణుగోష చేస్తూ మరకజ్యోతి కోసం వేచి చూశారు. సాయంత్రం ఆరు గంటలకు పంబళం నుంచి హరిహరసుతుడు అయ్యప్ప ఆభరణాల ఊరేగింపు ప్రారంభమైంది. స్వామివారి ఆభరణాలు ఆలయానికి చేరడానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టింది. ప్రతీ యేడాది జరిగే సాంప్రదాయ తంతు ప్రకారం ఆభరణాలను ఆలయాలకు చేర్చారు. ఆ సమయంలోనే మకర నక్షత్రం భక్తులకు దర్శనమిచ్చింది. సన్నిధానంలో అయ్యప్ప స్వామివారికి ఆభరణాల అలంకరించిన అనంతరం శబరిమలై గిరుల్లో సుదూర ప్రాంతాల్లో మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల సమయంలో జ్యోతి దర్శనం అయ్యింది. మకరజ్యోతి దర్శనమే స్వామివారి దివ్యవదర్శనంగా భావించిన భక్తులు పులకించిపోయారు. అయ్యప్పను కీర్తిస్తూ శరణుఘోష చేశారు. అనంతరం ఆలయ వర్గాలు భారీ స్తాయిలో బాణాసంచా కాల్చారు. ఇదిలా ఉంటే శబరిమలలో కేరళ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించింది. 

No comments:

Post a Comment