Monday, January 10, 2011

,,రైతుకోసం,, పర్యటనలో టీడీపీ అధినేత

రైతు కోసం మూడు రోజుల యాత్రకు బయలుదేరిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకున్నారు. మూడు జిల్లాల్లో పర్యటించనున్న బాబు... పంట నష్టపోయిన రైతులను, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఆయా ప్రాంతాల్లో అన్నదాతలతో ముఖాముఖి చర్చలో పాల్గొంటారు. 
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రైతు కోసం యాత్ర చేపడుతున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పంటనష్టపోయిన రైతులను, ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను బాబు ఓదారుస్తారు. ఈ సందర్భంగా పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు సికింద్రాబాద్‌ స్టేషన్లో కార్యకర్తలు, అభిమానులు వీడ్కోలు పలికారు. 
ఉదయం జిల్లాకు చేరుకున్న బాబు, తాడేపల్లి గూడెంలో కాసేపు రెస్ట్‌ తీసుకుంటారు. అక్కడి నుంచి నల్లజర్ల చేరుకుని పొగాకు రైతులనుద్దేశించి బాబు ప్రసంగిస్తారు. అనంతరం భీమడోలు, గుండుగొలను మీదుగా రైతులను కలుస్తూ, పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తూ దెందులూరు మండలం కొవ్వలి చేరుకుంటారు. 
కృష్ణా తీర్పు వల్ల నష్టం వాటిల్లిన రైతులతోను, కొల్లేరు రైతులతో చంద్రబాబు సమావేశం అవుతారు. అక్కడి నుంచి కృష్ణా జిల్లా కైకలూరుకు చేరకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 

No comments:

Post a Comment