శుక్రవారం అర్థరాత్రి హఠాత్తుగా కన్నుమూసిన సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. నిర్మాతలుచిరంజీవి , దగ్గుబాటి సురేశ్బాబు, సి. కల్యాణ్, అశోక్కుమార్, నటులు శ్రీకాంత్, అలీ, శివారెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ, రాజశేఖర్ దంపతులు, సంగీత దర్శకుడు కోటి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు ఈవీవీ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈవీవీ భౌతికకాయాన్ని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం హైదరాబాద్ శివారు మణికొండలోని ఆయన ఫాంహౌస్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
No comments:
Post a Comment