తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ..బిజెపి తెలంగాణ శంఖారావం పేరిట ఆదిలాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
యూపిఏ ప్రభుత్వం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే తాము మద్దతు పలుకుతామని గడ్కారి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై వ్యతిరేకంగా వ్యవహరిస్తే...2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ విషయంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపిది ఒకేమాట అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment