షేర్ ఖాన్.. నువ్వు పడగొడితే నేను నిలబెడుతా...
“నిలబెడతాం అంటే నిలబెట్టి తీరుతాం: దట్సిట్” ఇది ఈ వార్త వ్రాసే క్రోద్ది నిమిషాల ముందు అవిశ్వాసం పై మద్దత్తు ఇచ్చే విషయంలో చిరంజీవి వ్యాఖ్యలు. తన
నివాసంలో పిఆర్పి ఎంఎల్ఏ లతో సమావేశం అయిన చిరంజీవి, మీడియా వారితో మాట్లాడుతూ తన ఎంఎల్ఏ లకు కాంగ్రెస్ పార్టీలో చిన్నచూపు వాస్తవమే అని, కానీ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి తదితరులు ఇచ్చినభరోసా మేరకు ఈ మనస్పర్ధాలు, తేడాలు ఇక ముందు ఉండవని భావిస్తున్నామని అన్నారు.
నివాసంలో పిఆర్పి ఎంఎల్ఏ లతో సమావేశం అయిన చిరంజీవి, మీడియా వారితో మాట్లాడుతూ తన ఎంఎల్ఏ లకు కాంగ్రెస్ పార్టీలో చిన్నచూపు వాస్తవమే అని, కానీ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి తదితరులు ఇచ్చినభరోసా మేరకు ఈ మనస్పర్ధాలు, తేడాలు ఇక ముందు ఉండవని భావిస్తున్నామని అన్నారు.
అందుకే ప్రభూత్వానికి మద్దత్తు తెలిపి, ప్రభూత్వం పడిపోకుండా మద్దత్తు ఇస్తామని చిరంజీవి అన్నారు. మా ఎంఎల్ఏ లకు నియోజకవర్గం పరిధిలో కొంత అసంతృప్తి ఉందని, నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు సక్రమంగా సాగటం లేదని తమ ఎంఎల్ఏ లు భావిస్తున్నారని, ప్రభూత్వం నుంచి తగిన మద్దత్తు లభించటం లేదని తన ఎంఎల్ఏ లు తెలిపారని చిరంజీవి అన్నారు.
దీనిపై పిసిసి చీఫ్ బొత్సా, ముఖ్యమంత్రి మునుముందు ఇలా జరగదని, మీ ఎంఎల్ఏ లు కూడా ఇప్పుడు మా పార్టీ వారేనని, తేడా ఏమీ లేదని తెలిపారని చిరంజీవి అన్నారు. కేంద్రం నుంచి గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ కూడా తనతో ఫోన్లో మాట్లాడారని చిరంజీవి అన్నారు.
No comments:
Post a Comment