Friday, November 11, 2011

రాసాభాసగా మారిన విశాఖ రచ్చ బండ కార్యక్రమం


రాసాభాసగా మారిన విశాఖ రచ్చ బండ కార్యక్రమం









విశాఖలోని గాజువాకలో జరిగిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. గతంలో మొదటి విడత రచ్చబండ కార్యక్రమంలో ఆర్జీలు పెట్టుకున్న ప్రజలకు రేషన్ కార్డులు, ఫించన్లు, ఇందిరమ్మ గృహాలు ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని నినాదాలు చేశాయి. దీంతో స్సందించిన అధికారులు అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో సభ ప్రారంభమైంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ఎమ్మెల్యే, మేయర్‌, కమిషనర్‌ల ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేయటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

No comments:

Post a Comment