Wednesday, December 14, 2011

విశాఖ డెయిరీ మరోసారి పాల ధరను పెంచింది...



విశాఖ డెయిరీ యాజమాన్యం మరోసారి పాల ధరను పెంచింది. నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి పెరగడంతో సామాన్యులకు మరింత భారం కానుంది. ఈ ఏడాది ఆగస్టులో పెంచడం తెలిసిందే. తాజాగా లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచారు. అరలీటరుకు రూపాయి పెరగనుంది. ఈ ధరలు ఈ నెల 16నుంచి అమల్లోకి వస్తాయని డెయిరీ యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు, పాల కొనుగోలుదారులు, పాల రవాణా ఖర్చులు, ప్యాకింగ్ ఫిల్మ్ ధరలు, యంత్ర సామగ్రి, విడిభాగాల ధరలు పెరగడంతో డెయిరీ నిర్వహణ కష్టతరమవుతోందని వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా ధరను పెంచాల్సి వచ్చిందని పేర్కొంది

No comments:

Post a Comment