Sunday, November 13, 2011

మన్మోహన్ ప్రకటనపై కేసీఆర్ మండిపాటు



మన్మోహన్ ప్రకటనపై కేసీఆర్ మండిపాటు
కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు ?
 తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మన్మోహన్  చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ప్రజలకు 'భయపడకండి.. నేనున్నాను' అంటూ అభయమిచ్చారు. . ఆయనకు ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్య విలువలపై గౌరవం లేదని మండిపట్టారు.
తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండీ చూడలేని కబోధి ప్రధాని మన్మోహన్ అని దుయ్యబట్టారు. 'తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తుంది.. ఇదే నా శాపం' అంటూ దని శాపనార్థాలు పెట్టారు. 'తెలంగాణ ప్రజలారా బాధపడకండి, భయపడకండి ...మీతో నేనున్నాను.. అన్ని రకాల పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుందాం' అంటూ కేసీఆర్ ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రజల కోపాగ్నికి కాంగ్రెస్ రుచి చూస్తుంది. 
బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు: ఈటెల 
ప్రధాని మన్మోహన్‌సింగ్ బాద్యతారాహిత్యంగా మాట్లాడారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎంపీలో తెలంగాణ అంశాన్ని చేర్చడంతో పాటు పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించారు. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు.. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించాలి. తెలంగాణకు అనుకూలంగా దేశ వ్యాప్తంగా 28 పార్టీల లేఖలను ప్రధానికి అందించాం.ఇప్పుడు దానిని పక్కనపెట్టి అన్ని పార్టీలను కన్సల్ట్ చేయాలని మాట్లాడడం తగదు..నిర్ణయం ప్రకటించాల్సిన కాంగ్రెస్ దొంగదారులు వెతుకుతోంది..తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంతత, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసమే అడుగుతున్నారు. జాతీయ సమస్య అని ప్రధాని ఇప్పుడు అంటున్నారు.. 14 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఏమైంది..అన్ని రాష్ట్రాలు ఆత్మగౌరం వల్ల చేసిన ఉద్యమాల ఫలితంగానే ఏర్పడ్డాయి. చరిత్రను ప్రధాని అవలోకనం చేసుకోవాలి.. 
చావు కబురు చల్లగా చెప్పినట్టుంది: యాష్కీ
ప్రధాని వ్యాఖ్యలు చావు కబురు చల్లగా చెప్పినట్టుంది.. దీనిని పూర్తిగా విభేధిస్తున్నాం... ఇదే నిజమన్న భయాందోళన మాలో ఉంది.. ఇదే యూపీఏ ప్రభుత్వ నిర్ణయమని అనుకుంటున్నాం. తెలంగాణను అడ్డుకునే లగడపాటి రాజ్‌గోపాల్, కేవీపీ రామచంద్రరావులు ఇలాంటి ప్రకటనలే వస్తాయని గత రాత్రి నుంచే అంటున్నారు. అదే వాస్తమౌతోంది. తెలంగాణ వాదులంతా ఈ సమయంలో ఏకమవ్వాలి..యూపీఏ నిర్ణయం కూడా ప్రధాని చెప్పనట్టే ఉంటుంది.. ఈ విషయంలో టీడీపీ కూడా కుమ్మక్కయింది. 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతానని చంద్రబాబు అభయమిచ్చాడు.. దానికి కేంద్రం కూడా తలొగ్గింది.. ప్రజల అభిప్రాయానికి ఏ ప్రభుత్వమైనా తలొంచాల్సిందే.. లేదంటే దిగిపోవాలి..ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆదివారం సమావేశమవుతుంది. ఇందులో కెకె , జానారెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులతో చర్చిస్తాం.. ఏమి చేయాలన్న దానిపై అందులో నిర్ణయిస్తాం. యూపీఏకు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు. 
కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలి: హరీశ్
ప్రధాని ప్రకటన పూర్తి బాధ్యతా రాహిత్యం... తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేసి వెంటనే బయటకు రావాలి, రోజుకో ప్రకటన చేస్తూ ఆపార్టీ తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. తెలంగాణ ప్రజల ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఒకలా... అవసరం తీరాక మరోలా మాట్లాడితే ఎలా? 
తెలంగాణ ఇవ్వలేమని చెప్పలేదు: వినోద్
ప్రధాని కొత్తగా మాట్లాడిందేమి లేదు. ఐదు నెలల క్రితం యూపీ పీసీసీ సోనియా, రాహుల్ సమక్షంలో ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానించారు. ..అలాగే తెలంగాణ కూడా ఇస్తారని అన్నారు. అయితే ఇదంతా రెండో ఎస్సార్సీనా..లేక నేరుగా ఇస్తారా.. అన్నది వేచి చూడాలి. తెలంగాణను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలే నష్టపోతారు. ప్రధాని తెలంగాణ ఇవ్వలేమని స్పష్టం చేయలేదు...కష్టమని చెప్పలేదు. 
కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేయండి : ఎర్రబెల్లి
తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెస్, తెస్తామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ప్రధాని ప్రకటనతో కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. పదే పదే మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేయాలి. ఈ మోసానికి శిక్షగా ప్రభుత్వాలను కూల్చాలి. 
రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు: కోదండ
పార్లమెంటులో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు. పూటకో మాట మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమాన పరిచారు. కాంగ్రెస్ కో ఖతం కరో.. తెలంగాణకో హాసిలో కరో నినాదాన్ని చేపడతాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎటు వైపో తేల్చుకోవాలి. 


ఖండిస్తున్నాం: గద్దర్, విమలక్క, సూర్యం
ప్రధాన మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మరోసారి నిలువెల్లా దగా చేసిందనడానికి మన్మోహన్ వ్యాఖ్యలు నిదర్శనం. కేవలం పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం, ప్రజలు అందుకు సిద్దపడాలని పిిలుపునిస్తున్నాం. 
విభజన వాదనలో పసలేకనే ప్రకటన : పరకాల
ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న వాదనలో పసలేదు. చిదంబరం లాంటి వారు వారి రాష్ట్రాల విభజనకు ఒప్పుకుంటారా? తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు కలిసి ఉండాలని కోరుకొంటున్నారు. అందుకే ప్రధాన మంత్రి ఈ ప్రకటన చేశారు

No comments:

Post a Comment