Sunday, June 5, 2011

డిజిపి అరవిందరావుకు డాక్టరేట్‌



డిజిపి అరవిందరావుకు డాక్టరేట్‌

డిజిపి కె అరవిందరావుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రకటించింది. అరవిందరావు వర్సిటీ భాషలు అనువాద అధ్యయన కేంద్రంలో ఆచార్య శ్రీపాద సుబ్రహ్యణ్యం పర్యవేక్షణలో ‘అద్వైత దృష్ట్యా ఉపనిషనిత్తుల జ్ఞానస్వరూపం-ఒక పరిశీలన’ అనే అంశంపై పిహెచ్‌డి చేసినట్లు ప్రజాసంబంధాల అధికారి జి.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనకు త్వరలో జరిగే స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ ప్రదానం చేస్తారు.
అనుమాండ్ల భూమయ్యకు దత్తపీఠం స్వర్ణకంకణం
పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ అనుమాండ్ల భూమయ్యకు మైసూరు దత్తపీఠం వారి ప్రతిష్టాత్మకమైన ఆస్థాన విద్యాంసుని గౌరవం, స్వర్ణకంకణ సత్కారం లభించింది. దత్తపీఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి చేతులమీదుగా భూమయ్య ఈ గౌరవాన్ని అందుకున్నట్లు వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


No comments:

Post a Comment